ట్రంప్.. టారిఫ్ భయంతో మందగమనంలో మార్కెట్లు
x

ట్రంప్.. టారిఫ్ భయంతో మందగమనంలో మార్కెట్లు

షేక్ అయిన ఆసియా మార్కెట్లు, ఆర్బీఐ ఏం చేస్తుందో అని వేచి చూస్తున్న స్థానిక పెట్టుబడిదారులు


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా, మెక్సికో, చైనా లపై వాణిజ్య యుద్దం ప్రారంభించడం, దానికి ఆయా దేశాలు సైతం ఢీ అనడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లు పతనం అయ్యాయి.

ఈ ప్రభావం ఆసియా మార్కెట్లపై పడింది. భారత్ లోని ప్రారంభ ట్రేడింగ్ లో బీఎస్ఏఈ బెంచ్ మార్క్, సెన్సెక్స్ 731.91 పాయింట్లు పతనమై 76, 774. 05 చేరుకుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 243 పాయింట్లు కోల్పోయి 23,239.15 వద్దకు చేరుకుంది.

ఇందులో లారెన్స్ అండ్ టూబ్రో, ఎటీపీసీ, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా సర్వీసెస్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

లాభపడిన వాటిలో టైటాన్, మారుతీ, నెస్లే, బజాజ్, ఫిన్ సర్వే వంటి ఉన్నాయి. ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, హాంకాంగ్ భారీగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. శుక్రవారం అమెరికా స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల్లో ముగిశాయి.

భారత్ మంచి బడ్జెట్ ను ప్రవేశపెట్టినప్పటికీ ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్దంతో మార్కెట్లు ఒత్తిడి గురయ్యాయి. ఇది ఎప్పుడు అంతం అవుతుందో తెలియదని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ స్ట్రాటజిస్ట్ వికే విజయ్ కుమార్ అన్నారు.
ప్రస్తుతానికి భారత్ ప్రభావితం కాదు. అందువల్ల స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకుంటాయని చెప్పారు. కానీ డాలర్ ఇండెక్స్ 109.6 కంటే ఎక్కువగా పెరగడం వల్ల ఎఫ్ఐఐలు అమ్మకాలకు దారి తీస్తాయని, దాని వల్ల ఒత్తిడి పెరుగుతుందని అన్నారు.
కేంద్ర బడ్జెట్ లో ఈక్విటీ మార్కెట్లు తెరిచే ఉంచారు. ఎఫ్ఐఐలు శనివారం రూ.1327 కోట్ల మేర స్టాక్ మార్కెట్ లోకి ప్రవేశించాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 0.70 పెరిగి 76.20 డాలర్లకు చేరింది.
అయితే స్ఠానిక పెట్టుబడి దారులు మాత్రం ఆర్బీఐ తీసుకునే పరపతి సమీక్ష గురించి ఆలోచిస్తున్నారని మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ అధినేత అయిన ప్రశాంత్ తాప్సే అన్నారు.
కెనడా, మెక్సికో నుంచి వస్తున్న వస్తువులపై 25 శాతం, చైనా నుంచి వస్తువులపై 10 శాతం సుంకాలు మంగళవారం నుంచి అమల్లోకి వస్తున్నాయి.
Read More
Next Story