ఎమర్జెన్సీలో నా తల్లి అంత్యక్రియలకు కూడా అనుమతించలేదు: రాజ్ నాథ్ సింగ్
x
రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్

ఎమర్జెన్సీలో నా తల్లి అంత్యక్రియలకు కూడా అనుమతించలేదు: రాజ్ నాథ్ సింగ్

దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో తనను జైలులో వేశారని, నా తల్లి అంత్యక్రియలకు కనీసం అనుమతి ఇవ్వలేదని అన్నారు.


ప్రధాని నరేంద్ర మోదీని తరచుగా నియంత, కనిపించని డిక్టేటర్ అని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుండటంపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ కాలంలో తనను బలవంతంగా జైలులో పడవేశారని, తన తల్లి అంత్యక్రియలకు కూడా అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని అవమానించింది కాంగ్రెస్సే అంటూ విమర్శించారు.

ఓ జాతీయ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమర్జెన్సీ నాటి తన అనుభవాన్ని వివరించారు. తనకు అప్పుడే కొత్తగా పెళ్లయిందని.. తన వయస్సు కేవలం 24 సంవత్సరాలన్నారు. తనను పోలీసులు పట్టుకుని జైలులో పడవేసారని, అక్కడ అతను సుమారు 18 నెలలు గడిపాడని చెప్పారు.
జైలు శిక్ష సమయంలో, అనారోగ్యంతో ఉన్న తన తల్లిని పరామర్శించడానికి తనకు పెరోల్ ఇవ్వలేదని, రాజ్ నాథ్ సింగ్ చెప్పాడు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నిరసనలు చేయకూడదని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు. “ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఎంతటికైనా వెళ్లాలనే స్పూర్తి ఉంది. నా మనసులో ఎప్పుడూ నిరాశ, నిస్పృహలు తలెత్తలేదు” అన్నాడు.
'మోదీ 3వసారి, 4వసారి కూడా..
అనేక ఇతర సమస్యలపై మాట్లాడిన రక్షణ మంత్రి, ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం మూడవసారి మాత్రమే కాకుండా నాల్గవసారి కూడా అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
"మోదీ సామర్థ్యం ఉన్నంత వరకు, దేశం కోరుకునే వరకు అతను పదవిలో ఉంటారు" అని రాజ్ నాథ్ అన్నారు. కర్ణాటకలో తమ పార్టీ ‘స్వీప్’ చేస్తుందని, కేరళ, తమిళనాడుల్లో కూడా కొన్ని సీట్లు గెలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
“ఫలితాల కోసం వేచి ఉండండి, మీకే తెలుస్తుంది. కేరళలో కూడా కొన్ని సీట్లు గెలుస్తాం. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని అన్ని స్థానాలను కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తాం. 2026లో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మా ప్రయత్నాలు కొనసాగిస్తాం’’ అని రక్షణ మంత్రి చెప్పారు.
ఎలక్టోరల్ బాండ్లపై
సుప్రీం కోర్టు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించిన ఎలక్టోరల్ బాండ్ల పథకంపై, ప్రభుత్వం తగిన చర్చల తర్వాత ఈ పథకాన్ని అమలు చేసిందని, ప్రజలు దాని ప్రయోజనాలను "తగిన సమయంలో" అర్థం చేసుకుంటారని సింగ్ అన్నారు. క్విడ్ ప్రోకో జరిగిందనే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ సుప్రీంకోర్టు వాటిని పరిశీలించిదని అన్నారు.
“సుప్రీంకోర్టు తీర్పు మాకు ఆమోదయోగ్యమైనది. తీర్పును మేం విమర్శించడం లేదు. ”అని ఆయన అన్నారు. విచారణ కొనసాగుతుందని, ఎవరైనా దోషులుగా తేలితే తగిన చర్యలు తీసుకోవచ్చని ఆయన అన్నారు.
'కాంగ్రెస్ మేనిఫెస్టో '
కాంగ్రెస్ ప్రకటించిన దేశానికి సంబంధించింది కాదని అన్నారు. దేశానికి ఎటువంటి మేలు చేయదని అన్నారు. త్వరలో బిజేపీ కూడా మేనిఫెస్టోను ప్రకటిస్తుందని చెప్పారు. ప్రగతిశీల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని దీనిని రూపొందిస్తామని అన్నారు. మైనారిటీలను బుజ్జగించడం కాంగ్రెస్‌కు కొత్తేమీ కాదన్న సింగ్, బుజ్జగింపు రాజకీయాలపై బీజేపీకి నమ్మకం లేదని అన్నారు. ప్రభుత్వాన్ని ఎలాగూ ఏర్పాటు చేయమనే ఇలా అగ్నివీర్ లాంటి పథకాలను రద్దు చేస్తామని కాంగ్రెస్ వాగ్థానాలు ఇచ్చిందని అన్నారు.
Read More
Next Story