తిరుపతి విశేషాలు:  గోవిందరాజస్వామి తెప్పొత్సవం
x

తిరుపతి విశేషాలు: గోవిందరాజస్వామి తెప్పొత్సవం

మంగళవారం సాయంత్రం శ్రీ రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీ పార్థసారథిస్వామి


తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం సాయంత్రం శ్రీ రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీ పార్థసారథిస్వామివారు భక్తులను కటాక్షించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

రెండ‌వ రోజు సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై ఐదు చుట్లు విహరించి భక్తులకు అభయమిచ్చారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.
అదేవిధంగా బుధవారం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు తెప్పలపై భక్తులను అనుగ్రహించనున్నారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.
తిరుమల విశేషాలు

మధ్వ నవమిని పురస్కరించుకుని టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం తిరుమలలోని ఆస్థాన మండపంలో 140 మంది పండితులు శ్రీ మధ్వ విజయం పారాయణం చేశారు. ఈ సందర్భంగా భువనగిరి శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం మఠాధిపతి శ్రీశ్రీశ్రీ సువిద్యేంద్ర తీర్థ స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. స్వామీజీ మాట్లాడుతూ శ్రీ మధ్వాచార్యులు బోధించిన ద్వైత సిద్ధాంతం ద్వారా భక్తే మోక్షానికి మార్గమని చాటి చెప్పారన్నారు.

రథసప్తమి విజయవంతం

ఈ ఏడాది జనవరి 25వ తేదిన రథ సప్తమి వేడుకలను కూడా టీటీడీ, జిల్లా, పోలీసు యంత్రాంగం, ఏపీఎస్ ఆర్టీసీ, శ్రీవారి సేవకుల స‌మిష్టి కృషితో అంగరంగవైభవంగా నిర్వహించామ‌ని టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ తెలియ‌జేశారు.

రథ సప్తమి విశేషాలు

- గతంలో ఎన్నడూలేనివిధంగా ఈ ఏడాది రికార్డుస్థాయిలో 3.45 లక్షల మంది భక్తులు మాడ వీధుల్లో వాహన సేవలు వీక్షణ‌.

- అన్ని విభాగాల సమన్వయంతో రద్దీ నిర్వహణ, భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో సఫలీకృతం.

అన్నప్రసాదాలు

- ర‌థ స‌ప్తమి రోజున గ్యాల‌రీల్లోని భ‌క్తులంద‌రికీ ఉద‌యం నుండి రాత్రి వ‌ర‌కు విరివిగా అన్న ప్ర‌సాదాలు, పానీయాలు పంపిణీ.

- సొజ్జ‌ రవ్వ ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా, సాంబార్ రైస్, టమోటా రైస్, పులిహోర, చక్కెర పొంగలి, వేడి బాదం పాలు, కాఫీ, పాలు, మజ్జిగ, సుండలు, బిస్కెట్లను భక్తులకు పంపిణీ.

- 9.42 లక్షల మందికి అన్న ప్రసాదాలు, 6.30 లక్షల మందికి పానీయాలు, 2.90 లక్షల మందికి పాలు, 2.15 లక్షల మందికి వాటర్ బాటిళ్లు పంపిణీ.

- వివిధ విభాగాలతో పాటు మాడ వీధులలో భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు, పానీయాలు పంపిణీ చేసేందుకు దాదాపు 220 మంది శ్రీ‌వారి సేవ‌కుల సేవ‌లు వినియోగం.

Read More
Next Story