కచ్చతీవులో నిప్పురవ్వలు... రాజేసిందెవరు?
x

కచ్చతీవులో నిప్పురవ్వలు... రాజేసిందెవరు?

పదేళ్ల పాటు ప్రధాని మోదీ అధికారంలో ఉన్నా కచ్చతీవు గురించి చేసిందేమీ లేదు. లోక్ సభ ఎన్నికలపుడు కచ్చతీవు మీద, తమిళ జాలర్ల హక్కుల గురించి మాట్లాడుతున్నారేమిటి?


తమిళనాడులో ఏదో విధంగా కాలుమోపడానికి భారతీయ జనతా పార్టీ శతవిధాల ప్రయత్నిస్తూ ఉంది. అక్కడ హిందూత్వ పాలిటిక్స్ పనిచేయం లేదు. అందువల్ల భారత జాతీయతను ప్రయోగించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇందులో భాగంగా భారత భూభాగానికి చెందిన కచ్చతీవు ద్వీపాన్ని 1974లో ప్రధాని ఇందిర గాంధీ ప్రభుత్వం శ్రీలంకు అప్పచెప్పందని పేర్కొంది. దేశ భూభాగాన్ని కాపాడాల్సిన పార్టీ భూఖండాన్ని శ్రీలంకు అప్పగిస్తుందా అని ప్రధాని మోదీ ట్వీట్ తీసుకువచ్చి ఆ రాష్ట్రంలో వేడిపుట్టించారు. అయితే, కాంగ్రెస్ కూడా గట్టిగానే సమాధానం ఇస్తావుంది. తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ లోయలో 20 మంది జవాన్లు ప్రాణ త్యాగం చేసిన తరువాత చైనాకు ప్రధాని ‘క్లీన్ చిట్’ ఎందుకు ఇచ్చారో చెప్పాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జన్ ఖర్గే అంటున్నారు. ఈ వివాదం నేఫథ్యంలో కచ్చతీవు మీద ఫెడరల్ ప్రత్యేకం.



తమిళనాడులోని రామేశ్వరం – శ్రీలంకకు మధ్యలో ఉన్న ఓ చిన్న ద్వీపం కచ్చతివు. ఇది 285 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. తమిళనాడు నుంచి కేవలం 25కి.మీల దూరంలోనే ఉంటుంది ఈ ద్వీపం. దీనిపై చాలా సంవత్సరాలుగా వివాదం ఉంది.


ఇది ఎపుడూ భూకంపం వల్ల ఏర్పడిందని చెబుతారు.పూర్వం ఇది రామనాథపురం జమిందార్ ఆధీనంలో ఉండింది. తర్వాత ఇది సిలోన్ బ్రిటిష్ ప్రభుత్వాల మధ్య భూభాగ విభజన జరిగాక ఇది మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమయింది. అయితే, ఇది తమదే నని సిలోన్ చెబుతూ వస్తున్నది. ఈ భూచెలకమీద మనుషులెవరూ ఉండటం లేదు. అయితే, ఇరుదేశాల మత్స్యకారులకు ఇది చాలా ముఖ్యం. అందువల్ల శ్రీలంక కచ్చతీవు తమకే రావాలని వాదిస్తూ ఉంది. 1974లో శ్రీలంక, భారత్ ల మధ్య కుదిరిన మారిటైం ఒప్పందంలో భాగంగా అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం దీనిని శ్రీలంకు ధారాదత్తం చేసింది. అపుడ దీనికి అంగీకరించన డిఎంకె ముఖ్యమంత్రి కరుణానిధి భారత్ ప్రధాని కి లేఖ రాస్తూ చారిత్రకంగా ఈ కచ్చతీవు ఎలా భారత్ లో భూభాగమూ వివరించారు. ఈ దీవి శ్రీలంకకు వెళ్లినా, మత్స్య సంపద మీద ఒప్పందంలో ప్రస్తావన లేకపోవడంతో భారత మత్స్య కారులు ఇక్కడ చేపలు పట్టుకుంటా దీవిలో వలలను ఆరబెట్టుకుంటూ ఉండేవారు.

కచ్చతీవు భారత్ వెనక్కి తీసుకోవాలని 1991 తమిళనాడు అసెంబ్లీ ఒక తీర్మానం చేసింది.అపుడు ఎల్ టిటిఇ సమస్య ఉండటం వల్ల, ఈ భూభాగం మీద వారి పెత్తనం ఉండటం వల్ల తమిళ మత్స్య కారులు ఎలాంటి సమస్య లేకుండా ఇక్కడ చేపలు పట్టుకునేవారు. తర్వాత వచ్చిన జయలలిత ప్రభుత్వం సిలోన్, భారత్ మధ్య కుదిరిన ఒప్పందాలను రద్దు చేయాలని సుప్రీంకోర్టు ను కూడా ఆశ్రయించింది. అయితే, 2009 తర్వాత తమిళ మత్స్య కారులకు సమస్యలు ఎదురవుతున్నాయి. ఎల్ టిటిఇ పతనం తర్వాత సముద్ర జలా మార్గాలమీద శ్రీలంక ప్రభుత్వం పట్టు బిగించింది. దీనితో కచ్చతీవు దగ్గిర చేపల పట్టడానికి వచ్చిన తమిళ మత్స్య కారులను శ్రీలంక ప్రభుత్వం నిర్భంధించడం మొదలుపెట్టింది.

అప్పటి నుంచి ఈ వివాదం తెగడం లేదు. సాగుతూనే ఉంది.

ఇపుడు 2024 లోక్ సభ ఎన్నికల సమీపిస్తున్న ఈ వివాదాన్ని లేవనెత్తుతూ దీనికి కారణం కాంగ్రెసే నని పేర్కొంది. ‘కచ్చతివు ద్వీపం’ను కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు ఇచ్చేసిందంటూ ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. భారత దేశాన్ని విడదీసి, భారత్లో ఒక భాగమైన ద్వీపాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు ఇచ్చేసిందని ఆరోపించారు. ఈ దీవుల యాజమాన్య హక్కుల కోసం జరుగుతున్న వివాదాన్ని నివారించేందుకు 1974లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధికి ఈ విషయం చెప్పి, కచ్చతీవు దీవులను శ్రీలంకకు కట్టబెట్టారని ఆరోపించారు. ఈ విషయం ఆర్టీఐ దరఖాస్తుతో తాజాగా బయటపడిందని చెప్పారు. ఇది తెలిసిన ప్రతీ భారతీయుడు కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాడని ప్రధాన పేర్కొన్నారు. భారతదేశ ఐకమత్యాన్ని, సమగ్రతతను, ప్రయోజనాలను 75 ఏళ్లుగా కాంగ్రెస్ దూరం చేస్తూనే ఉందని ధ్వజమెత్తారు. దేశ ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ పార్టీని నమ్మలేమని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ట్వీట్ చేశారు.

బిజెపి తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేసిన ఆర్టీఐ దరఖాస్తుతో కచ్చతీవు దీవుల విషయం వెలుగులోకి వచ్చింది. 1974 జూన్ లో కచ్చతీవు దీవులపై పూర్తి హక్కులను శ్రీలంకకు అప్పగిస్తున్నట్లు అప్పటి తమిళనాడు సిఎం కరుణానిధికి విదేశాంగ శాఖ కార్యదర్శి కేవల్ సింగ్ సమాచారం అందించినట్లు వెల్లడైంది.

భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రు హయాంలోనూ ఈ కచ్చతివు వివాదం కొనసాగింది. అయితే ‘ఇంత చిన్న విషయాన్ని మాటిమాటికి ప్రస్తాతవించకండి. అవసరమైతే కచ్చతివును వదులుకోవడానికి సిద్ధం’ అని నెహ్రూ అన్నట్టు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వ్యాఖ్యానించారు. ఆర్టీఐ ద్వారా తాను సంపాదించిన రెండు పత్రాలలో నెహ్రూ ఈ మెరకు వ్యాఖ్యానించినట్టు ఉందని పేర్కొన్నారు.

కానీ కచ్చతివు అనే ప్రాంతం భారత్ లో ఒక భాగమని నిరూపించేందుకు అనేక ఆధారాలు ఉన్నట్టు, అప్పటి అటార్నీ జనరల్ వాదించారు. ఈ విషయం కూడా అన్నమళై పొందిన పత్రాలలో ఉంది. ‘కళ్లు తెరిపించే, ఆశ్చర్యకర చర్యలు ప్రపంచానికి తెలిశాయి. కచ్చతీవు దీవులను కాంగ్రెస్ పార్టీ ఎలా వదులుకుందో ఇప్పుడు తెలిసింది. ఈ చర్య ప్రతి భారతీయుడికి కోపం తెప్పిస్తోంది. కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ విశ్వసించలేం. దేశ ఐక్యత, సమగ్రత, ప్రయోజనాలను బలహీన పరచడం ఆ పార్టీ విధానం. 75 ఏళ్లు దేశాన్ని ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ పాలించింది అని’ ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు.

వేసవి కావడంతో భారత జలాల్లో చేపలు తగ్గిపోతున్నాయి. రామేశ్వరం, సమీప జిల్లాలకు చెందిన మత్స్యకారులు చేపలు పట్టేందుకు కచ్చతీవు ద్వీపానికి వెళుతున్నారు. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ దాటి వెళ్లడంతో శ్రీలంక నౌకాదళం అదుపులోకి తీసుకుంది. దాంతో సమస్య వెలుగులోకి వచ్చింది. ఆ వెంటనే ఆర్టీఐ ద్వారా సమాచారం బయటకు వచ్చింది. ఆ అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు.

ఈ కచ్చతివులో చేపలు పట్టేందుకు చాలా మంది తమిళులు వెళుతూ ఉంటారు. కానీ ఇప్పుడది చాలా కష్టంగా మారింది. ఇంటర్నేషనల్ మేరిటైమ్ బౌండరీ లైన్ కు అవతల ఉన్న ఈ ప్రాంతానికి వెళుతుంటే శ్రీలంక అధికారులు మత్స్యకారులను అరెస్ట్ చేస్తున్నారు. కచ్చితివును శ్రీలంకలో భాగంగా భారత్ గుర్తించడం చాలా మంది తమిళులకు ఇష్టం లేదు.

కచ్చతివులో సెయింట్ ఆంటోని ఆలయం ఉంటుంది. ప్రతియేటా అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. 1974లో జరిగిన ఒప్పందం ప్రకారం భారత మత్స్యకారులు ఉత్సవంలో పాల్గొనవచ్చు. అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ వేటకు వెళుతున్న వారికి మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

అయితే, దాదాపు 50 ఏళ్ల నాటి సమస్యపై తన ప్రభుత్వం అందించిన సమాచారం ఆధారంగా ప్రధాని మోదీ కళ్లు తెరవడం పట్ల తమిళనాడులో అధికారంలో ఉన్న ద్రవిడ మున్నేత్ర కళగం (డిఎంకె) విస్మయం వ్యక్తం కచ్చతీవు ద్వీపం వ్యవహారం దౌర్భాగ్యమే అయినా అది కాలం చెల్లిన రాజకీయ సమస్య అని డీఎంకే అధికార ప్రతినిధి ఎస్ మనురాజ్ కొట్టిపారేసారు. పదేళ్లు అధికారంలో ఉన్న తర్వాత కూడా ప్రతిపక్షాలపై నిందలు వేయడంలో బీజేపీ నిమగ్నమైందని డీఎంకే చురకలంటించింది. ఈ పదేళ్ల కాలంలో తాను సాధించిన విజయాలపై ప్రచారం చేసేందుకు బీజేపీ భయపడుతోందని, అందుకే ప్రతిపక్షాలపై ఆరోపణలు చేయడంపైనే దృష్టి సారించింది ఆయన అన్నారు.

మరోవంక, శ్రీలంకకు కచ్చాతీవును ఇందిరా గాంధీ ఇచ్చివేయడంపై ప్రధాని మోదీ చేసిన ఆరోపణను ఖండిస్తూ పది సంవత్సరాల పాలనలో ఆ దీవిని వెనుకకు తీసుకోవడానికి ఎందుకు చర్యలు గైకొనలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు. తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో 20 మంది జవాన్లు ప్రాణ త్యాగం చేసిన తరువాత చైనాకు ప్రధాని ‘క్లీన్ చిట్’ ఎందుకు ఇచ్చారని 1974లో ఒక స్నేహపూర్వక ఒప్పందంలో భాగంగా శ్రీలంకకు కచ్చాతీవు దీవిని ఇవ్వడమైందని చెబుతూ సరిహద్దు గ్రామాల మార్పిడిలో భాగంగా మోదీ ప్రభుత్వం కూడా బంగ్లాదేశ్ పట్ల అటువంటి ‘స్నేహపూర్వక వైఖరి’ ప్రదర్శించిందని ఖర్గే గుర్తు చేశారు.


పదేళ్లు నిద్రపోయి, ఇపుడు ఉన్నట్లుండి ప్రధాని మోదీకి తమిళనాడు మత్స్యకారుల మీద ప్రేమెలా పుట్టిందోనని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ విస్మయం వ్యక్తం చేశారు.


Read More
Next Story