
పల్లెల్లో సూర్యభగవానుడి అండతో పాల వెల్లువ
దేశంలోని వెనకబడిన రాష్ట్రాలలో లాతూర్ ప్రయోగం
కేంద్రం ఆ మధ్య ‘స్వయం శిక్షణ ప్రయోగ్’ (Swayam Shikshan Prayog:SSP) అని దేశంలోని నీటి కొరత ఉన్న ప్రాంతాలలో 100 సోలార్ ఆధారిత పాల చిల్లింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన ఒక ప్రణాళికను ప్రకటించింది. గ్రామీణ పాడి విలువ గొలుసులను బలోపేతం చేయడం, పాల కల్తీని నివారించడం, మహిళా రైతులను, అసంఘటిత పాడి రైతులను సాధికారత చేయడం వైపు ఇదొక విప్లవాత్మక అడుగు.సింపుల్ గా చెబితే, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మహిళారైతులను సమాయత్తం చేయడమే ఎస్ ఎస్ పి.
మహారాష్ట్రలోని కరువు ప్రభావిత మరాఠ్వాడ ప్రాంతాన్ని కేంద్రీకరించుకుని, ఏడు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న SSP ఇప్పటివరకు 3,274 గ్రామాల్లో 30 జిల్లాలలో, 3.5 లక్షలకుపైగా మహిళా నాయకులను సాధికారీకరంచి , 60 లక్షల మందికి పైగా జీవితాలను ప్రభావితం చేసింది. వాతావరణ-అనుకూల వ్యవసాయం, శుభ్రమైన శక్తి, నీరు, శానిటేషన్, ఆరోగ్యం, పోషణ, మహిళా వ్యాపారాభివృద్ధి SSP ప్రధాన రంగాలు. పాడి పరిశ్రమలో సోలార్ శక్తి వినియోగించి పాల ఉత్పత్తి ద్వారా దాదాపు 2.76 కోట్ల గ్రామీణ భారతీయుల ఆదాయంపెరిగేందుకు బాట వేయడం దీని ఉద్దేశం.
ఈ ప్రాజెక్టు చిన్న మధ్యమ తరగతి రైతులకు శీతల కేంద్రాలు ఏర్పాటు చేయడం, పాల నిల్వ సౌకర్యాన్ని అందించడానికి, అనిశ్చితమైన విద్యుత్ సరఫరాపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, అలాగే శుభ్రమైన పునరుత్పాదక శక్తి వినియోగాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా, ప్రతి చిల్లింగ్ యూనిట్ కోసం అధిక సామర్థ్యం కలిగిన సోలార్ వ్యవస్థలను సరఫరా, ఏర్పాటు కమిషన్ చేయగల అర్హతగల తయారీదారులు, వెండర్లనుస్వయం శిక్షణ ప్రయోగ్ ఆహ్వానిస్తున్నది.
ప్రతి కేంద్రంలో 2.6 KWp సోలార్ ప్యానెల్స్, 5 KVA ఇన్వర్టర్ (డ్యూయల్ ట్రాకర్లతో), 5 కిలోవాట్స్ ఆఫ్-గ్రిడ్ పవర్ కండీషనింగ్ యూనిట్ ఉంటాయి ఇవన్నీ కేవలం 120 చదరపు అడుగుల చిన్న ప్రదేశంలో అమర్చబడతాయి. వెండర్లకు కనీసం ఐదేళ్ల అనుభవం, దృఢమైన సాంకేతిక నైపుణ్యం, నాణ్యత హామీ, స్వయం శిక్షణ ప్రయోగ్ యొక్క స్థిరత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయగల సామర్థ్యం అవసరం.మహిళల ఆధ్వర్యంలో సామాజిక మార్పు - స్వయం శిక్షణ ప్రయోగ్ లక్ష్యం. 1998లో లాతూర్ భూకంపం అనంతరం ఒక ప్రభుత్వ కార్యక్రమంగా ప్రారంభమైన స్వయం శిక్షణ ప్రయోగ్ , సంవత్సరాలకొద్దీ దేశంలోని అత్యంత ప్రభావవంతమైన మహిళా నాయకత్వ సంస్థ గా ఎదిగింది.
అయితే అనిశ్చితమైన విద్యుత్, సరైన చల్లని నిల్వ అందుబాటులో లేకపోవడం వంటి సవాళ్ల కారణంగా రైతులు నష్టపోతున్నారు. చాలామంది ఖరీదైన, కాలుష్యకరమైన డీజిల్ జనరేటర్లపై ఆధారపడాల్సి వస్తోంది. స్వయం శిక్షణ ప్రయోగ్ ప్రవేశపెట్టిన ఈ సోలార్ చిల్లింగ్ హబ్లు ఈ సమస్యలను నేరుగా పరిష్కరిస్తాయి. ప్రతి కేంద్రం సంవత్సరానికి సుమారు ఆరు టన్నుల కార్బన్ డైయాక్సైౌడ్ ఉద్గారాలను తగ్గించే సామర్థ్యం కలిగి ఉండటంతో పాటు నిరంతర చిల్లింగ్ సౌకర్యం, ఆపరేటింగ్ ఖర్చులు తక్కువ, మహిళా రైతులకు మెరుగైన మార్కెట్ ప్రాప్యతను అందిస్తుంది. అంతేకాక, ఈ కార్యక్రమం మహిళల డిజిటల్ సాక్షరత వ్యాపార నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా వారికి పాడి రంగంలోని పోటీ మార్కెట్లో భాగస్వామ్యం చేసే అవకాశాలను సృష్టిస్తుంది.
అమలు చేసే బాధ్యత100 సోలార్ పాల చిల్లింగ్ యూనిట్లను సరఫరా చేసి, వాటిని ఏర్పాటు చేసి, పూర్తిస్థాయి ఆపరేషన్ స్థాయికి చేరవేయాలి. స్థానిక ఆపరేటర్లు , సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, సంపూర్ణ సాంకేతిక మాన్యువల్స్ అందించడం,అన్ని పరికరాలు జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడటం వెండర్ బాధ్యత. సమయపాలనతో డెలివరీ, బహుళ ప్రదేశాల్లో ఇన్స్టాలేషన్ పర్యవేక్షణ, కనీసం ఐదేళ్ల వారంటీ, నిర్వహణ సేవలు అందించాలి. చెల్లింపు నాలుగు దశల్లో జరుగుతుంది— ఒప్పందం సంతకం సమయంలో, పరికరాల డెలివరీ సమయంలో, ఇన్స్టాలేషన్ పూర్తయ్యే సమయంలో, మూడు నెలల విజయవంతమైన ఆపరేషన్ తరువాత. అభిరుచి చూపిన దరఖాస్తుల ఆధారంగా ముగ్గురు వెండర్లను షార్ట్లిస్ట్ చేస్తారు. వీరిని సాంకేతిక నైపుణ్యం, నాణ్యత హామీ, స్థిరత్వ పద్ధతులు ఆర్థిక ప్రతిపాదనల పోటీ సామర్థ్యాల ఆధారంగా పరిశీలిస్తారు.
భారత పాడి రంగంలో సాంకేతిక పురోగతులు
చల్లని నిల్వ సదుపాయాల అభివృద్ధితో పాటు, పాల నాణ్యత పరీక్షల్లో పారదర్శకత, న్యాయం కల్పించే సాంకేతిక పరిష్కారాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద పాల ఉత్పత్తిదారుగా ఉన్నప్పటికీ, పాల నాణ్యతలో అసమానతలు, మాన్యువల్ కాలిబ్రేషన్ తప్పులు, కొవ్వు/ ఎస్ఎన్ఎఫ్ కొలతల్లో నిర్ధిష్టత లేకపోవడం వంటి సమస్యలు రైతుల ఆదాయంపై ప్రభావం చూపుతున్నాయి. చాల క్లౌడ్ బేస్డ్ సంస్థలు అభివృద్ధి చేసిన ఐఓటి ఆధారిత స్మార్ట్ మిల్క్ అనలైజర్లు ఈ సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆన్లైన్ కాలిబ్రేషన్, బ్లూటూత్, క్లౌడ్ కనెక్టివిటీ, భద్రతాయుత లాగ్ మేనేజ్మెంట్, ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ వంటి లక్షణాలతో ఇవి పాల పరామితుల కొలతలో అత్యంత నిర్దిష్టతను నిర్ధారిస్తున్నాయి. దీంతో రైతులకు న్యాయమైన చెల్లింపులు, డేటా ఆధారిత నిర్ణయాలు, విలువ ఆధారిత పాడి ఉత్పత్తుల నాణ్యతలో పెరుగుదల సాధ్యమవుతోంది.
సుస్థిరత, సమగ్ర అభివృద్ధి వైపు ముందడుగు స్వచ్ఛ శక్తి పరిష్కారాలను ఆధునిక డిజిటల్ పరికరాలతో కలిపిన స్వయం శిక్షణ ప్రయోగ్ కార్యక్రమం గ్రామీణ మహిళా రైతుల పాడి వ్యవస్థను పూర్తిగా మార్చగలదు. ఈ ప్రాజెక్టు ఆదాయాన్ని పెంచడం, పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించడం, పాలు విలువ గొలుసులో పారదర్శకతను పెంపొందించడం వంటి ప్రయోజనాలను అందిస్తుంది. భారత గ్రామీణ పాడి రంగానికి నాయకత్వం వహిస్తున్న వేలాది మంది మహిళల జీవితాలను మార్చే ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి వినూత్న సోలార్ తయారీ సంస్థలను స్వయం శిక్షణ ప్రయోగ్ ఆహ్వానిస్తోంది.

