దక్షిణాదిలో మత రాజకీయాలు ఎందుకు పనిచేయలేదు?
x
తమిళనాడులో ఓ చర్చిలో క్రైస్తవ, హిందూ ఆచారాల ప్రకారం జరిగిన పెళ్లి. Source: Wikipedia commons

దక్షిణాదిలో మత రాజకీయాలు ఎందుకు పనిచేయలేదు?

దక్షిణాదిలో హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు ఒకరికొకరు సంప్రదాయాలు,ఆచారాలను గౌరవిస్తూ కలిసి జీవిస్తున్నారు. 2024ఎన్నికలలో విష ప్రచారాన్నిఓటర్లు లెక్కచేయలేదు.


చెన్నైలోని నా సహోద్యోగి తన పెళ్లికి నన్ను ఆహ్వానించాడు. ఇటీవల నాకు తను పంపిన రెండు పేజీల మ్యారేజీ ఇన్విటేషన్ సింపుల్‌గా అర్థవంతంగా ఉంది. ఇక పెళ్లి వేడుక ఆదివారం ఒక చర్చిలో జరగాల్సి ఉంది. పెళ్లి కొడుకు తాను రోమన్ క్యాథలిక్ అని చెబుతూనే.. వివాహ వేడుకను తన కుటుంబం ఎలా ఏర్పాటు చేసిందో వివరించబోయాడు.

ఆచారాలు, సంప్రదాయాల మిశ్రమం..

తను చెబుతున్న దాన్ని బట్టి.. హిందూ వివాహ ఆచారాలు తన కుటుంబ సంప్రదాయాల మాదిరిగానే ఉన్నాయని తెలిసింది.

జ్యోతిష్కుడు తమ ఇద్దరి జాతకాలు పరిశీలించి, సరిపోయాయి అని చెప్పిన తర్వాత పెళ్లి ఫిక్సయ్యిందని వరుడు చెప్పాడు. జాతకంలో వ్యక్తి రాశి. జన్మ నక్షత్రానికి సంబంధించిన సమాచారం ఉంటుంది. పెళ్లికొడుకుది, నాది ఒకే రాశి.

నేను ఆసక్తిగా అడిగిన మరికొన్ని ప్రశ్నలకు అతను వివాహ ఆచారాల గురించి వివరించాడు.వరుడు వధువు మెడలో మంగళసూత్రం కట్టడం, ఆమె నుదుటిపై కుంకుమ దిద్దడంతో ఇరు కుటుంబాల్లో సంతోషం, ఆనంద వెల్లివిరిశాయి.

కాస్త విడమరిచి చెప్పాలంటే..వివాహం అనేది క్రైస్తవ, హిందూ ఆచారాలు సమ్మేళనం. ఆయనే కాదు..తమిళనాడు, పొరుగు ప్రాంతాలలోని చాలా మంది క్రైస్తవులు తమ వివాహ సంప్రదాయాలలో కొన్నింటిని హిందూమతం నుంచి అరువు తెచ్చుకున్నారు.

తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ముస్లిం మహిళలు మంగళసూత్రాన్ని ధరించడం సర్వసాధారణం. వివిధ మతాలు ఒకదానికొకటి ఆచారాలను అనుసరించవచ్చు. కానీ మత విశ్వాసాలలో వైవిధ్యాలున్నాయి.

దక్షిణాదిలోని అనేక ప్రాంతాలలో హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు శతాబ్దాలుగా ఒకరికొకరు సంప్రదాయాలు, ఆచారాలను పాటిస్తూ కలిసి జీవిస్తున్నారు.

ఉదాహరణకు.. హిందూ పురుషులు, మహిళలు చర్చి గుండా నడిచేటప్పుడు సిలువ గుర్తును వేయడం సర్వసాధారణం. ఈ ప్రాంతంలో మతాంతర సంప్రదాయాలు, వివాహాలు కూడా సాధారణం. నిజానికి, మంచి పద్ధతులతో పాటు వరకట్నం లాంటివి కూడా ప్రవేశించాయి. కానీ అది వేరే కథ.

రాజకీయాల వల్ల ఏర్పడిన బలమైన భిన్నాభిప్రాయాలు చాలా సంవత్సరాల తర్వాత కూడా సామరస్యాన్ని పెంపొందించే సాంస్కృతిక పద్ధతులు ఇప్పటికీ ఉన్నాయని ఈ చిన్న కథ చూపిస్తుంది.

చాలా కమ్యూనిటీలు హానికర సందేశాలను విస్మరించడాన్నే ఎంచుకున్నాయి. వాటికి బదులుగా ఉద్యోగాలు, ధరల వంటి ముఖ్యమైన వాటిపై దృష్టి సారించాయి.

వైరుధ్య అభిప్రాయాలు..

జాతీయ ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా ఉద్రిక్తతలు చోటుచేసుకుంటుం డడం వల్ల ఈ విషయం గురించి మాట్లాడటం ముఖ్యం. 2024 ఎన్నికలలో ద్వేషం, బుల్డోజర్లు, ముస్లిం స్మశాన వాటిక, అవినీతి, పోలీసు చర్యలు, అరెస్టులు, జైలు శిక్ష అనే పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

వాస్తవానికి సంక్షేమం, రిజర్వేషన్లు, సామాజిక సమానత్వం, అవినీతి, ఉద్యోగాలు, అసమానతలు, ధరల పెరుగుదలపై చర్చలు జరిగాయి, అయితే అవి సునామీలో మునిగిపోయాయి.

సుదీర్ఘ 7 దశల ఎన్నికలలో.. మొదటి ఐదు దశల్లో ఈ సమస్యలు చాలా వరకు ప్రతిధ్వనించాయి. చివరి రెండు దశల్లో ప్రసంగాలు మరింత హోరెత్తించే అవకాశం ఉంది.

అయితే సానుకూల అంశం ఏమిటంటే.. మతపర విభజనలు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి భిన్నంగా ఉంటున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో మతపర విభజనలు పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ ధోరణి 2024లో కొనసాగుతుంది.

కేరళ స్టోరీ..

కేరళలో లెఫ్ట్‌ ఫ్రంట్‌, యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ హోరాహోరీగా తలపడడంతో.. బీజేపీ తృతీయ శక్తిగా అవతరించేందుకు ప్రయత్నిస్తోంది.

రాజకీయాలను విభజించేందుకు రైట్‌వింగ్‌ గ్రూపులు ప్రయత్నించినా అవి సఫలం కాలేదు.

మలయాళ నటుడు మమ్ముట్టి రెండేళ్ల క్రితం ఒక సినిమాలో నటించిన పాత్రపై గత వారం విమర్శలు వెల్లువెత్తాయి. హిందూ అగ్ర కులానికి చెందిన రిటైర్డ్ పోలీసు అధికారి పాత్రలో ఆయన నటించారు. అందులో మమ్ముట్టి నటన హిందూ మతాన్ని అగౌరవపరిచేలా ఉందంటూ కొందరు నేటిజన్లు ఆయనను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

తమిళనాడులో రాజకీయ నాయకులకు సమ్మిళిత రాజకీయాల ప్రాముఖ్యం గురించి బాగా తెలుసు. మతపరమైన సమస్యలపై దృష్టి పెట్టకుండా రైట్ వింగ్ స్థాపన, దాని మిత్రపక్షాలను విమర్శించింది.

ఇతర ముఖ్యమైన అంశాలకు బదులుగా.. బిజెపి ప్రధానంగా అవినీతి, కుటుంబ పాలన, పేలవమైన ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలపై దృష్టి పెట్టింది.

తెలుగు రాష్ట్రాలకు రెండు వ్యూహాలు..

ఆంధ్రప్రదేశ్‌లో వివిధ మతాలకు చెందిన వారు చాలా మంది నివసిస్తున్నారు. అందుకే రాజకీయ పార్టీలు మత ప్రస్తావనకు దూరంగా ఉంటున్నాయి. ఎన్నికలలో హోరాహోరీగా తలపడుతున్న తెలుగుదేశం, YSRCP రెండూ కూడా మైనారిటీ హక్కులకు మద్దతు పలికాయి.

టీడీపీకి మిత్రపక్షం, వైఎస్సార్‌సీపీతో దోస్తీగా ఉన్న బీజేపీ కూడా ఈ విషయం గురించి పెద్దగా మాట్లాడలేదు. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ల గురించి మాట్లాడిన ప్రధాని, ఏపీలో మాత్రం మాట్లాడలేదు.

తెలంగాణలో ఏఐఎంఐఎం ఉండటంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ కేటీఆర్ సారధ్యం వహిస్తున్న బీఆర్‌ఎస్ బలహీనపడడంతో బీజేపీకి మద్దతు లభించే అవకాశం ఉండడంతో కమలనాథులు భారీ స్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్‌లో AIMIM అసదుద్దీన్ ఒవైసీకి పోటీగా మాధవీలతను బరిలో నిలిపిన బీజేపీ..మతాన్నితెరపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇది హైదరాబాద్‌కు వెలుపల పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు.

రాష్ట్రంలో విజయం కోసం బీజేపీ కేవలం 'మోడీ మ్యాజిక్'పైనే ఆధారపడి ఘన విజయాన్ని అంచనా వేస్తోంది.

మోదీ ప్రజాదరణే ఆధారం..

కర్ణాటకలో మోదీని సానుకూల అంశంగా చూస్తోంది బీజేపీ. ఎన్నికలను మోదీ రాష్ట్రపతి రేసులా మార్చేశారని కొందరంటున్నారు. ప్రధానమంత్రి పదవికి మోదీ వ్యతిరేకించే బలమైన అభ్యర్థి లేకపోవడంతో ఆయనకు లాభించింది.

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీజేపీ కోలుకోలేక పోవడంతో చాలా మంది మోదీపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. కర్ణాటక పార్టీలో విభేదాలు కొనసాగుతుండగానే.. ప్రజ్వల్ రేవణ్ణ కేసు జేడీ(ఎస్)తో బీజేపీ పొత్తుకు మచ్చ తెచ్చింది.

రాష్ట్రంలో బిజెపి అధికారంలో ఉన్నపుడు.. హిజాబ్, హలాల్, మైనారిటీలను మభ్యపెట్టడం వంటివి చోటుచేసుకున్నాయి. అయితే ఆ తర్వాత గొడవ సద్దుమణిగింది. లింగాయత్‌లు (ఆధిపత్య వర్గం), కుల రిజర్వేషన్‌లపై దృష్టి సారించే రాజకీయాలు ఇప్పుడు సంప్రదాయంగా మారాయి. రాజకీయాలు ఇప్పుడు ఆధిపత్య లింగాయత్ కమ్యూనిటీ, కుల రిజర్వేషన్ల ప్రమేయంతో సహా సాంప్రదాయ సమస్యలపై దృష్టి సారిస్తున్నాయి. ఎన్నికల ప్రచార సమయంలో, ఇతర వెనుకబడిన తరగతుల (OBCలు) రిజర్వేషన్ కోటాలో ముస్లింలకు ప్రత్యేక కోటాను అమలు చేయడం గురించి చర్చ జరిగింది. దీన్ని మతపరమైన ప్రాతిపదికగా పేర్కొంటూ బిజెపి వ్యతిరేకించింది.

మొత్తానికి ఉత్తరాది ప్రజలను విభజించినంతగా దక్షిణాది ప్రజలను విభజించడానికి ప్రయత్నించలేదు. కారణం చాలా సులభం - ప్రజలు పట్టించుకోని సమస్యల గురించి రాజకీయ పార్టీలు మాట్లాడే అవకాశం లేదు.

Read More
Next Story