‘‘గల్వాన్ ఘర్షణలో చైనా ట్యాంకులు భారత్ లోకి ప్రవేశించాయి’’
x
మాజీ జనరల్ ఎంఎం నరవణే

‘‘గల్వాన్ ఘర్షణలో చైనా ట్యాంకులు భారత్ లోకి ప్రవేశించాయి’’

తన పుస్తకంలో మాజీ జనరల్ నరవణే రాశారన్న రాహుల్ గాంధీ, లోక్ సభలో గందరగోళం


Click the Play button to hear this message in audio format

భారత్- చైనా మధ్య 2020 లో జరిగిన గల్వాన్ ప్రతిష్టాంభన సమయంలో చైనా ట్యాంకులు భారత్ లోకి ప్రవేశించాయని, తరువాత జనరల్ గా పనిచేసిన నరవాణే తన ఆటో బయోగ్రఫిలో ప్రస్తావించారని రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రస్తావించడంపై సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది.

2019 మరియు 2022 మధ్య ఆర్మీ చీఫ్ గా పనిచేసిన జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే తన పదవీకాలంలో జరిగిన అనుభవాలతో రాసికొచ్చిన పుస్తకం ‘‘ఫోర్స్ స్టార్స్ ఆఫ్ డెస్టనీ’’ పై అధికార, ప్రతిపక్షాల మధ్య వాదనకు కారణమైంది. లోక్ సభలో ట్రెజరీ, ప్రతిపక్ష బెంచ్ల మధ్య తీవ్ర వాగ్వాదానికి కేంద్రంగా మారాయి.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై తన ప్రసంగంలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పుస్తకంలోని విషయాలను లేవనెత్తడానికి ప్రయత్నించగా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనితో సభలో గందరగోళం చెలరేగడంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 3 గంటలకు వరకు వాయిదా వేసే వరకూ వెళ్లింది.
నరవాణే తన పుస్తకాన్ని ప్రచురించడానికి ప్రయత్నించగా( కేంద్రం దాన్ని నిషేధించింది. భద్రతా విభాగాలలోకి కీలక అధికారుల బయోగ్రఫీపై కేంద్రం బ్యాన్ విధించే అధికారం ఉంది) సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అయిన గాంధీ నరవాణే ప్రచురించని జ్ఞాపకాలపై ఒక ప్రముఖ పత్రిక ప్రచురించిన వ్యాసం నుంచి ఉటంకించడానికి ప్రయత్నించగా, స్పీకర్, ఇతర బిజెపి నాయకులు అడ్డుకున్నారు.
రాహుల్ ఏ వ్యక్తిని లక్ష్యంగా చేసుకోలేదని, విధానాలపై మాత్రమే మాట్లాడుతున్నాడని సభలో చెప్పడానికి ప్రయత్నించగా దాన్ని అడ్డుకున్నారు. కానీ రాహుల్ మాత్రం దేశభక్తిని ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.
"2017 డోక్లాం ప్రతిష్టంభన సమయంలోనూ, 2020 గల్వాన్ చైనా ట్యాంకులు భారత భూభాగంలోకి ప్రవేశించాయి" అని రాహుల్ ఒక ఇంగ్లీష్ పత్రికలో ప్రచురించిన వ్యాసాన్ని కోట్ చేయగానే బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇంకా ప్రచురితం కాని పుస్తకాలు రాహుల్ గాంధీ ఎలా చదివారని కమలదళం ప్రశ్నించింది.

నరవణే పుస్తకం వివాదాస్పద అంశాలు ఉన్నాయా?

ఈ పుస్తకం ప్రభుత్వానికి ఎందుకు వివాదాస్పదంగా ఉంది? ప్రచురించని పుస్తకం నరవాణే ఆర్మీ చీఫ్‌గా ఉన్న సమయంలో తీసుకున్న కీలకమైన సైనిక విధాన నిర్ణయాల గురించి వివరిస్తుంది.
వీటిలో 2020లో తూర్పు లడఖ్‌లో చైనా- భారత్ మధ్య ఏర్పడిన ఉద్రిక్తత, అగ్నిపథ్ నియామక పథకాన్ని రూపొందించడం వంటివి ఉన్నాయి. కీలకమైన సైనిక కార్యకలాపాలు, ప్రభుత్వ విధానాల గురించి దాని వెల్లడి కారణంగా, భారత సైన్యం, రక్షణ మంత్రిత్వ శాఖ దాని విషయాలను సమీక్షించడంతో ఈ పుస్తకం అధికారిక పరిశీలనలోకి వచ్చింది.
ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం ప్రచురణ కోసం కేంద్రం ఆమోదం కోసం వేచి చూస్తోందని సమాచారం. ఈ పుస్తకంలోకి కొన్ని భాగాలు 2023 లోనే వచ్చాయి. ఇది 2024 లో విడుదల కావాల్సి ఉంది. కానీ అది ఇంకా ప్రచురణకు ఆమోదం పొందలేదు.
‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌’లోని ఒక నివేదిక ప్రకారం, పుస్తక ప్రచురణకర్త పెంగ్విన్ రాండమ్ హౌస్‌ను సమీక్ష పూర్తయ్యే వరకు సారాంశాలు లేదా సాఫ్ట్ కాపీలను ప్రసారం చేయవద్దని కోరినట్లు తెలిసింది.

లడఖ్ ప్రతిష్టంభన, కీలక వివరాలు..

ఈ జ్ఞాపకాలలో అత్యంత ముఖ్యమైన అంశం ఏంటంటే తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంట భారత్-చైనా మధ్య సైనిక ఘర్షణకు సంబంధించినది. మీడియా నివేదికల ప్రకారం, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) దళాలు ట్యాంకులు, సైనికులను రెచిన్ లా పర్వత మార్గానికి తరలించింది.
ఆగస్టు 31, 2020 రాత్రి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో తన సంభాషణను నరవాణే వివరించాడు, సారాంశాల ప్రకారం, సింగ్ నరవాణేతో, “జౌ ఉచిత్ సంఝో వో కరో (మీరు సముచితమని భావించేది చేయండి)” అని అన్నారు. ఆ రాత్రి జరిగిన పరిణామాలు రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు, రక్షణ సిబ్బంది చీఫ్‌తో ఫోన్ కాల్స్‌కు దారితీశాయని నరవాణే రాశారు.
రక్షణ మంత్రితో తన సంభాషణను వివరిస్తూ నరవాణే ఇలా రాసుకొచ్చారు. “పరిస్థితి క్లిష్టతను నేను RM (రక్షా మంత్రి)కి తెలియజేసాను, అతను దాదాపు 2230 గంటలలోపు నా వద్దకు తిరిగి వస్తానని చెప్పాడు, అలాగే అతను కూడా చేసాడు.” ఆ కాల్ తర్వాత తన మనసులో వంద రకాల ఆలోచనలు ప్రవేశించాయని అని ఆయన అన్నారు.
“నాకు ఒక చిన్న విషయం అందింది. ఇప్పుడు బాధ్యత పూర్తిగా నాపై పడింది. నేను లోతైన శ్వాస తీసుకొని కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చున్నాను. గోడ గడియారం టిక్ టిక్ చేయడం తప్ప మిగతావన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి,” అని ఆయన అన్నారు.

అగ్నిపథ్ పై పుస్తకంలో..

సాయుధ దళాలలో సిబ్బందిని స్వల్పకాలికంగా చేర్చడం కోసం రూపొందించిన అగ్నిపథ్ నియామక పథకాన్ని కూడా చర్చించాయి. సైన్యం ప్రారంభ నియామకంలో 75 శాతం నియామకాలను నిలుపుకోవడం, 25 శాతం మందిని విడుదల చేయడం అని నరవాణే రాశారు. కానీ చివరకు 25 శాతం మందిని మాత్రమే అగ్నిపథ్ కింద సైన్యంలో నిలుపుకున్నారు.
నియామకాలకు మొదట ప్రతిపాదించిన నెలకు రూ. 20,000 జీతంపై కూడా ఆయన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. "ఇది ఆమోదయోగ్యం కాదు. ఇక్కడ, దేశం కోసం తన ప్రాణాలను అర్పించాల్సిన శిక్షణ పొందిన సైనికుడి గురించి మనం మాట్లాడుతున్నాము. కచ్చితంగా ఒక సైనికుడిని రోజువారీ కూలీ కార్మికుడితో పోల్చలేము?" అని ఆయన రాశారు.
ఆ మొత్తాన్ని తరువాత నెలకు రూ. 30,000కి పెంచారని పేర్కొన్నారు. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) నిబంధనలకు సవరణలు పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు ముందస్తు అనుమతి లేకుండా విషయాలను ప్రచురించకుండా పరిమితం చేస్తున్నప్పటికీ, రక్షణ సేవలు ఆ నిబంధనల పరిధిలోకి స్పష్టంగా రాలేదని పేర్కొన్న ఒక మూలాన్ని కూడా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ఉటంకించింది.
Read More
Next Story