
బెంగాల్ లో శ్రీరామనవమి రోజు అల్లర్లు, బలగాల మెహరింపు
బెంగాల్లో గురువారం నాడే హై అలర్ట్ ప్రకటించారు
పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లా, రఘునాథ్గంజ్ పట్టణంలో శుక్రవారం జరిగిన శ్రీరామనవమి ఊరేగింపు హింసాత్మకంగా మారాయి. రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో భారీ భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. ఈ ఘటనను ధృవీకరించిన స్థానిక పోలీసులు, ఊరేగింపు ఇరుకైన వీధుల గుండా వెళుతున్నప్పుడు పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో రాళ్ల దాడి, ఘర్షణలు చెలరేగాయని తెలిపారు.
ఘర్షణ తీవ్రతపై పరస్పర విరుద్ధమైన నివేదికలు ఉన్నప్పటికీ, అక్కడక్కడా కొన్ని ఉద్రిక్త ప్రదేశాలు ఉన్నాయని, పరిస్థితి మరింత ముదరకుండా నివారించడానికి ప్రయత్నాలు జరిగాయని పోలీసు వర్గాలు తెలిపాయి.
వాగ్వాదం- ఘర్షణలు..
పోలీసులు, ఊరేగింపు సందర్భంగా జరిగిన వాగ్వాదం హింసగా మారడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని, రెండు వర్గాల ప్రజలు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకుంటూ, ఆ ప్రాంతంలోని ఆస్తులను ధ్వంసం చేశారని పోలీసు ఉన్నతాధికారులలో ఒకరు వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు. వచ్చే నెలలో రెండు దశల ఎన్నికలు జరగనున్న బెంగాల్లో గురువారం (మార్చి 26) నుంచి హై అలర్ట్ ప్రకటించారు. శ్రీరామనవమి వేడుకల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వేలాది మంది పోలీసు సిబ్బందిని మోహరించింది.
ఎన్నికల ముందు మత ఉద్రిక్తతలు చెలరేగుతాయనే భయాల నేపథ్యంలో, ఊరేగింపులలో పాల్గొనేవారి సంఖ్యను 500కు పరిమితం చేస్తూ, ఆయుధాలు తీసుకురావడాన్ని నిషేధిస్తూ అధికారులు కఠినమైన మార్గదర్శకాలను జారీ చేశారు.
రాజకీయ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని తరచుగా హింసాత్మక ఘటనలు జరుగుతుండటంతో, రాష్ట్రంలో ఎన్నికల ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘర్షణల గురించి నివేదికలు అందిన తర్వాత, రఘునాథ్గంజ్లోని కీలక ప్రదేశాలకు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలతో సహా అదనపు బలగాలను పంపినట్లు ముర్షిదాబాద్లోని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
ప్రాణనష్టం జరగలేదు కానీ పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రాణనష్టం జరిగినట్లు తక్షణ నివేదికలు ఏవీ లేవని, అయితే కొంతమంది పోలీసు సిబ్బందితో సహా పలువురికి స్వల్ప గాయాలయ్యాయని ఆయన చెప్పారు.
అధికారిక గణాంకాలను ఇంకా సేకరిస్తున్నారు. బిగ్గరగా చేస్తున్న నినాదాలు, అరుపులు కేకలు, చెదురుమదురు హింసకు దారితీయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొందని స్థానికులు వర్ణించారు. అల్లర్లలో చిక్కుకోకుండా ఉండేందుకు పోలీసులు బారికేడ్లను పటిష్టం చేసి, పాదచారుల రాకపోకలను మళ్లించడంతో ఊరేగింపు మార్గంలోని కొన్ని ప్రాంతాల్లోని దుకాణాలు ముందుగానే మూసివేశారని ఆ అధికారి తెలిపారు.
ఇటీవలి కాలంలో ముర్షిదాబాద్లో మతపరమైన పండుగల సందర్భంగా మతపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. 'పరిస్థితి ఇప్పుడు అదుపులో ఉంది' ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా దళాలు రూట్ మార్చ్లు నిర్వహిస్తూ, నిఘా కొనసాగిస్తున్నాయని మరో అధికారి తెలిపారు.
"పరిస్థితి ఇప్పుడు అదుపులో ఉంది. శాంతిభద్రతలను కాపాడటానికి తగినంత బలగాలను మోహరించాము. పెట్రోలింగ్ కొనసాగుతోంది. మేము పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాము. హింసలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము," అని ఆయన పీటీఐకి తెలిపారు.
కోల్కతాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పండుగ ఊరేగింపు సందర్భంగా ఆయుధాలను ప్రదర్శించడాన్ని నిషేధిస్తూ కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, ఆయుధాలు కలిగి ఉన్నాయనే కారణంతో కోల్కతా, హౌరా జంట నగరాలతో సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.
కేంద్ర మంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు సుకాంత మజుందార్ ఈ ఉద్రిక్తతలకు రెచ్చగొట్టే శక్తులే కారణమని ఆరోపించగా, బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతినిధి కునాల్ ఘోష్ సంయమనం, వర్గాల మధ్య ఐక్యత కోసం విజ్ఞప్తి చేశారు. అన్ని ఘటనలపై దర్యాప్తు జరిపి, శాంతిభద్రతలకు భంగం కలిగించిన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Next Story

