పాక్ మధ్యవర్తిత్వంతో భారత్ పరువు పోయింది: కాంగ్రెస్
x
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్

పాక్ మధ్యవర్తిత్వంతో భారత్ పరువు పోయింది: కాంగ్రెస్

శత్రుదేశం దౌత్యపరంగా ఎదుగుతుంటే మోదీ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించిన జైరాం రమేష్


Click the Play button to hear this message in audio format

అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తామన్నా ప్రకటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని విమర్శించింది. ఇది నిజమైతే భారత ప్రభుత్వానికి తీవ్రమైన ఎదురుదెబ్బగా అభివర్ణించింది.

ఆపరేషన్ సిందూర్ తరువాత పాకిస్తాన్ దౌత్య ప్రయత్నాలు భారత్ కంటే మెరుగ్గా ఉన్నాయని ప్రతిపక్ష పార్టీ ఆరోపించింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. "ఈ నివేదికలు నిజమైతే, అవి భారతదేశానికి తీవ్రమైన ఎదురుదెబ్బతో పాటు తీవ్రమైన తిరస్కారాన్ని సూచిస్తాయి. ఇదంతా స్వీయ-శైలి విశ్వగురువు వల్లే జరిగింది," అని రమేష్ 'X' ఛానెల్‌లో అన్నారు.

రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో ఉన్న పాకిస్తాన్‌కు కొత్త జీవం పోసినట్లు రమేష్ తెలిపారు. "2025 ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడులకు నేపథ్యంగా నిలిచిన, రెచ్చగొట్టే, ఉద్రేకపూరిత ప్రసంగాలు చేసిన వ్యక్తిని అధ్యక్షుడు ట్రంప్ ఆప్యాయంగా, పదేపదే కౌగిలించుకున్నారు. అంతేకాకుండా, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌కు వైట్ హౌస్‌లో రెండుసార్లు ఆతిథ్యం ఇచ్చారు. పాకిస్తానీ పాలకవర్గం అధ్యక్షుడు ట్రంప్ సన్నిహిత వర్గంతో ఒక సౌకర్యవంతమైన సంబంధాన్ని ఏర్పరచుకుంది," అని ఆయన పేర్కొన్నారు.

మోదీ అనాలోచిత పర్యటన..

"ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ రెచ్చగొట్టని వైమానిక దాడులు ప్రారంభం కావడానికి కేవలం రెండు రోజుల ముందు శ్రీ మోదీ అనాలోచితంగా ఇజ్రాయెల్ పర్యటన జరపడం, మన రాజకీయ చరిత్రలో ఒక అత్యంత వినాశకరమైన ఛాయిస్ గా నిలిచిపోతుంది. మధ్యవర్తిత్వం వహించగలిగిన స్థితి నుంచి మనల్ని వెనక్కి తగ్గేలా చేసిన ఎంపిక ఇది" అని ఆ కాంగ్రెస్ నాయకుడు అన్నారు. ప్రధానమంత్రి దౌత్యం దారుణంగా బట్టబయలైందని, దీనికి దేశం మూల్యం చెల్లించుకోవలసి వస్తోందని ఆయన అన్నారు.

Read More
Next Story