
పాక్ మధ్యవర్తిత్వంతో భారత్ పరువు పోయింది: కాంగ్రెస్
శత్రుదేశం దౌత్యపరంగా ఎదుగుతుంటే మోదీ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించిన జైరాం రమేష్
అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తామన్నా ప్రకటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని విమర్శించింది. ఇది నిజమైతే భారత ప్రభుత్వానికి తీవ్రమైన ఎదురుదెబ్బగా అభివర్ణించింది.
ఆపరేషన్ సిందూర్ తరువాత పాకిస్తాన్ దౌత్య ప్రయత్నాలు భారత్ కంటే మెరుగ్గా ఉన్నాయని ప్రతిపక్ష పార్టీ ఆరోపించింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. "ఈ నివేదికలు నిజమైతే, అవి భారతదేశానికి తీవ్రమైన ఎదురుదెబ్బతో పాటు తీవ్రమైన తిరస్కారాన్ని సూచిస్తాయి. ఇదంతా స్వీయ-శైలి విశ్వగురువు వల్లే జరిగింది," అని రమేష్ 'X' ఛానెల్లో అన్నారు.
మోదీ అనాలోచిత పర్యటన..
Multiple reports in leading international media outlets have identified Pakistan as one of the intermediaries being used between the US and Israel on the one side and Iran on the other.
— Jairam Ramesh (@Jairam_Ramesh) March 24, 2026
If these reports are true, they represent a severe setback and rebuff to India - and it is…

