
ఎంకే స్టాలిన్
తిరుప్పరంకుండ్రం వివాదం: తన ప్రభుత్వాన్ని సమర్థించుకున్న స్టాలిన్
మోదీ ఆలయాన్ని సందర్శించడంపై విమర్శలు
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుప్పరంకుండ్రం ఆలయ దీపాల వెలిగింపు వివాదంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరినీ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమర్థించుకున్నారు. రాజకీయ నాయకులు వ్యక్తిగత విశ్వాసం, రాజకీయాలకు తలొగ్గకూడదని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరుప్పరంకుంద్రన్ లోని అర్ములిఘు సుబ్రమణ్య స్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు చేసిన రోజున ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మార్చి 1 న తనకు 73 ఏళ్లు నిండిన సందర్భంగా విడుదల చేసిన వీడియో సందేశంలో తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న రాతి స్తంభం పై కార్తీక దీపం వెలిగించే వివాదంపై తన ప్రభుత్వం తన వైఖరిని సమర్థించుకుందని మత నాయకుడిగా కాకుండా ముఖ్యమంత్రిగా ఆలయ సంప్రదాయాన్ని కాపాడటానికి తాను ఎంపిక చేసుకున్నానని స్టాలిన్ అన్నారు.
‘‘వ్యక్తిగత విశ్వాసం రాజకీయాలకు తలొగ్గకూడదని నేను దృఢంగా నమ్ముతున్నాను. హేతుబద్దత విశ్వాసంతో విభేదించాల్సిన అవసరం లేదు. రెండూ సమాజానికి చెందినవి’’ అని ఆయన సందేశంలో పేర్కొన్నారు. హేతువాద నాయకుడు పెరియార్ రామసామి, అడిగలర్ మధ్య స్నేహం దానికి రుజువు అని పేర్కొన్నారు.
డీఎంకే ప్రభుత్వం దేవాలయాలను రక్షించడం, ఆధ్యాత్మికత, విద్యకు సానుకూల వాతావరణాన్ని పెంపొందించడం పట్ల ప్రశంసలు అందుకున్న కుంద్రకుడి పొన్నంబల అడిగలర్ గురించి స్టాలిన్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
ఆదివారం సాయంత్రం ఆలయాన్ని సందర్శించిన తరువాత మధురై లో ఎన్డీఏ భారీ ర్యాలీలో ప్రసంగించిన ప్రధానమంత్రి, తిరుప్పరంకుండ్రం దీపాల వెలిగింపు అంశంపై ప్రజల మనోభావాలపై డీఎంకే కు ఎలాంటి గౌరవం లేదని అన్నారు. డీఎంకే ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని చివరికి భక్తులే గెలుస్తారని అన్నారు.
దర్గా సమీపంలో తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న దీపథూన్ పై దీపం వెలిగించడంపై తలెత్తిన వివాదంలో మద్రాస్ హైకోర్టులో కార్తీక దీపం పండగనాడు హిందువులు దీపం వెలిగించడానికి అనుమతి ఇచ్చింది.
కానీ ఈ చర్య రెండు మతాల ప్రజల మధ్య సంఘర్షణకు దారితీస్తుందని పేర్కొంటూ స్థానిక అధికారులు అనుమతించలేదు. ‘‘మనకు వేర్వేరు నమ్మకాలు ఉండవచ్చు. కానీ మనం ఒకే దేశంలో నివసిస్తున్నాము. ఒకే భాష మాట్లాడతాము. ఒకే భవిష్యత్ వైపు నడుస్తున్నాము.
అదే ద్రవిడ ఉద్యమం నాడి’’ అని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తన పార్టీ విడుదల చేసిన సందేశంలో పేర్కొన్నారు. రాజకీయాల్లో తన లక్ష్యం అందరినీ ఏకం చేయడమేననీ ఆయన నొక్కి చెప్పారు. తమిళం, ఇంగ్లీష్ ద్వంద్వ భాష విధానాన్ని సమర్థించడంపై తన ప్రభుత్వ వైఖరిని పునరుద్ఘాటించారు.
Next Story

