
రాజా రఘువంశీ హత్య కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్
నిందితులను తిరిగి మేఘాలయకు తీసుకెళ్లిన పోలీసులు..
ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ(Raja Raghuvanshi) హత్య(Murder) కేసులో అతని భార్య సోనమ్తో పాటు నిందితులను మేఘాలయ పోలీసులు మంగళవారం సోహ్రాకు తీసుకెళ్లారు. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఘటనా స్థలానికి వారిని తీసుకెళ్లిన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.
అసలు ఏం జరిగింది?
రాజా రఘువంశీ, సోనమ్(Sonam)కు ఇటీవల పెళైంది. అయితే సోనమ్కు రఘువంశీని పెళ్లిచేసుకోవడం ఇష్టంలేదు. అప్పటికే ఆమెకు తన తండ్రి నడుపుతున్న దుకాణంలో మేనేజర్గా పనిచేసే రాజ్తో చునువుగా ఉండేది. పెద్దల మాటకు విలువిచ్చి తొలుత రఘువంశీని పెళ్లిచేసుకునేందుకు అంగీకరించిన సోనమ్.. ఆ తర్వాత సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ రఘువంశీని అడ్డు తొలగించుకునేందుకు ప్లాన్ చేశారు.
ఈ క్రమంలో కిరాయి హంతకులతో రఘువంశీని చంపించేందుకు పథకం వేశారు. ప్లాన్లో భాగంగా మే 23న హనీమూన్ పేరిట సోనమ్ రఘువంశీని మేఘాలయకు తీసుకెళ్లింది. సోనమ్ ఇస్తున్న సమాచారంతో కిరాయి హంతకులు వాళ్లిదరిని ఫాలో అయ్యేవారు. సోనమ్, రఘువంశీ కొండప్రాంతంలో ఏకాంతంగా ఉండగా.. కిరాయి హంతకులు అక్కడికి చేరుకుని రఘువంశీని కత్తితో వెనక నుంచి పొడిచారు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని లోయలోకి తోసేశారు.
ఆ తర్వాత నిందితులతో పాటు సోనమ్ కొద్ది రోజుల పాటు కనిపించలేదు. ఇటు భార్యభర్తల నుంచి ఏ సమాచారం లేకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కొన్ని రోజులకు కుళ్లిపోయిన రాజా రఘువంశీ మృతదేహాం బయటపడడంతో సోనమ్ పోలీసుల ముందు లొంగిపోయింది. దర్యాప్తులో పోలీసులకు విస్తూపోయే నిజాలు తెలిశాయి.
నిందితులతో సహా ఫోరెన్సిక్ బృందం కూడా ఘటనా స్థలానికి చేరుకుంది. అక్కడ పోలీసులు నిందితులతో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించారు. ప్రస్తుతం నిందితులు మేఘాలయ పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఈ కేసును SIT దర్యాప్తు చేస్తోంది. వివిధ కోణాల్లో సిట్ దర్యాప్తు చేస్తోందని డీజీపీ ఐ నోంగ్రాంగ్ తెలిపారు.