తాజ్ పరిసరాల్లో యాంటీ-డ్రోన్ సిస్టమ్
x

తాజ్ పరిసరాల్లో యాంటీ-డ్రోన్ సిస్టమ్

స్మారక చిహ్నానికి అదనపు రక్షణ.


Click the Play button to hear this message in audio format

ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్‌(Taj Mahal)కు అదనపు భద్రత కల్పిస్తున్నారు. యాంటీ-డ్రోన్ సిస్టమ్ (Anti-drone system) ఏర్పాటు చేస్తున్నారు. వైమానిక దాడులను ఎదుర్కోవడానికి ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రముఖ కట్టడం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF), ఉత్తరప్రదేశ్ పోలీసుల పహారాలో ఉంది.

పహల్గామ్ ఊచకోతకు ప్రతీకారంగా మే 7న పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద కేంద్రాలపై భారత సాయుద దళాలు దాడులు నిర్వహించింది. ఆ తర్వాత పాక్ వరుసగా ఫిరంగి దాడులు, క్షిపణులు, డ్రోన్ దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (తాజ్ సెక్యూరిటీ) సయ్యద్ అరిబ్ అహ్మద్ మాట్లాడుతూ.. “తాజ్ మహల్ చుట్టూ 7-8 కిలోమీటర్ల పరిధి వరకు యాంటీ-డ్రోన్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. ఏదైనా డ్రోన్ ఈ ప్రాంతంలోకి ప్రవేశిస్తే జామ్ చేస్తుంది,” అని తెలిపారు. ఈ వ్యవస్థ పనితీరును వివరించేందుకు పోలీసు సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని ఆయన తెలిపారు.

యునెస్కో గుర్తింపు పొందిన తాజ్ మహల్‌ను సందర్శించేందుకు దేశ, విదేశాల నుంచి సందర్శకులు ఏడాది పొడవునా వస్తుంటారు. అమర ప్రేమకు నిదర్శనంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మునా నది ఒడ్డున ఉన్న అగ్రా నగరంలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముమ్తాజ్ మహల్ జ్ఞాపకార్థం నిర్మించారు.

Read More
Next Story