
‘రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఎత్తివేయాలి’
పార్లమెంటులో చర్చకు పట్టుబడతామన్న కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్
ప్రధాని మోదీ(PM Modi) నేటి (జూన్ 20) నుంచి మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. బీహార్(Bihar) రాష్ట్రం సివాన్లో రూ. 400 కోట్లుతో చేపట్టనున్న వైశాలి-డియోరియా రైల్వే లైన్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లోనూ పర్యటించి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
బీహార్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్(Congress) ప్రధాన కార్యదర్శి ఇన్చార్జ్ కమ్యూనికేషన్స్ జైరాం రమేష్(Jairam Ramesh) ప్రధాని ముందు మూడు డిమాండ్లను ఉంచారు. బీహార్ రిజర్వేషన్ల చట్టాన్ని రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో భాగం చేయాలని, రిజర్వేషన్ల కోసం 50 శాతం పరిమితిని అధిగమించడానికి రాజ్యాంగాన్ని సవరించాలని, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఇబీసీలకు రిజర్వేషన్లను అనుమతించే ఆర్టికల్ 15(5)ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ మూడు అంశాలపై చర్చకు పట్టుబడతామని జైరాం రమేష్ పేర్కొన్నారు.
"ప్రధాని ఈరోజు బీహార్లో ఉన్నారు. అక్కడ మునుపటి ఇండియా బ్లాక్ ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వే ఆధారంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఓబీసీలు, ఈబీసీలకు 65% రిజర్వేషన్లను ప్రతిపాదించింది. అయితే దీన్ని కోర్టులో సవాల్ చేశారు.
తమిళనాడులో 69% రిజర్వేషన్లను కాపాడటం కోసం 1994లో నరసింహారావు దీన్ని చేశారని చెప్పారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, OBC, EBCలకు రిజర్వేషన్ల కోసం 50% సీలింగ్ను అధిగమించడానికి రాజ్యాంగాన్ని సవరించాలని కాంగ్రెస్ ఎంపీ ప్రభుత్వాన్ని కోరారు.
ప్రైవేట్ విద్యాసంస్థల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, OBC. EBCలకు రిజర్వేషన్లు కల్పించే ఆర్టికల్ 15(5)ని ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.