
‘సర్’ తో ఐదు కోట్ల మంది ఓటర్ల తొలగింపు: ఈసీ
మొత్తం జాబితాలో పది శాతం తగ్గిన ఓటర్ల జాబితా
ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ఫలితంగా, తొమ్మిది రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో 10. 2 శాతం మేర తగ్గినట్లు తెలిసింది. ఈ ప్రక్రియలో 60 లక్షలకు పైగా మరణించిన ఓటర్లను తొలగించినట్లు ఎన్నికల సంఘం, దాని రాష్ట్ర అధికారులు పంచుకున్న డేటా వెల్లడిస్తోంది.
అక్టోబర్ 27న ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) రెండవ దశను ఈసీ ప్రకటించినప్పుడు, 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఓటర్ల సంఖ్య 50.99 కోట్లకు పైగా ఉండేది. ఈ ప్రక్రియ తర్వాత, ఓటర్ల జాబితా 45.81 కోట్లకు చేరింది.
సంఖ్యాపరంగా చెప్పాలంటే ఇది 5.18 కోట్లకు తగ్గింది. శాతాల పరంగా చూస్తే, ఓటర్ల జాబితా 10.2 శాతం తగ్గింది. మొత్తం 66,88,636 మంది మరణించిన ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. వీరిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 25.47 లక్షలు, ఆ తర్వాత ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్ నుంచి 24.16 లక్షలు ఉన్నారు.
అదనంగా, SIR ప్రక్రియలో అభ్యంతరాలు, విచారణల అనంతరం 63.16 లక్షల పేర్లను తొలగించారు. ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కేరళ, పుదుచ్చేరి, అండమాన్ - నికోబార్ దీవులు, లక్షద్వీప్, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాల తుది ఓటర్ల జాబితాలను వేర్వేరు తేదీలలో ప్రచురించడంతో SIR రెండవ దశ ఇప్పుడు పూర్తయింది.

