
ఉచిత బస్సుతో దివాలా అంచులో కర్ణాటక ఆర్టీసీ
తీవ్ర ఆర్థిక నష్టాలతో నడుస్తున్న కర్ణాటక ఆర్టీసీ సంస్థలు
ఉచిత పథకాలతో కర్ణాటక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తాజాగా ఉచిత బస్సు పథకంతో ఆ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ దివాలా అంచుకు చేరింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే ప్రభుత్వ ప్రతిష్టాత్మక 'శక్తి' పథకం ఈ సమస్యకు ఒక ప్రధాన కారణం.
రాష్ట్రంలోని నాలుగు రవాణా సంస్థలు కూడా తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నాాయి. 2023 జూన్ 11న ప్రారంభమైనప్పటి నుంచి, శక్తి యోజన ద్వారా 6,80.87 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ప్రయాణించారు. ఉచిత ప్రయాణానికి అయిన మొత్తం ఖర్చు రూ. 1,76,474.99 కోట్లకు చేరగా, అందులో ప్రభుత్వం రూ. 1,30,737.49 కోట్లను విడుదల చేసింది. దీంతో సంస్థలకు ఇంకా రూ. 45,737 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది.
మే 2023 నాటికి, KSRTC (కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ), BMTC (బెంగళూరు మెట్రోపాలిటన్ రవాణా సంస్థ), NWKRTC (నార్త్ వెస్ట్రన్ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ), KKRTC (కళ్యాణ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ) కలిసి రూ. 2,000 కోట్ల రుణం కలిగి ఉన్నాయి. శక్తి పథకం ఇప్పటికే ఉన్న ఒత్తిళ్లను మరింత పెంచింది. పెరుగుతున్న డీజిల్ ధరలు, సిబ్బంది జీతాల సవరణలు, ఖరీదైన విడిభాగాలు అన్నీ ఈ భారాన్ని మరింత పెంచాయి.
కేవలం వడ్డీ చెల్లింపులే ఒక భయంకరమైన కథను చెబుతున్నాయి. KSRTC 2024-25లో నెలకు రూ. 1.97 కోట్లు వడ్డీ చెల్లించింది. అన్నింటికంటే దారుణంగా ఉన్న BMTC, అదే సంవత్సరంలో నెలకు రూ. 2.24 కోట్లు చెల్లించింది. ఇది 2021-22లో గరిష్టంగా ఉన్న రూ. 5.69 కోట్ల కన్నా తక్కువ. కార్పొరేషన్లను స్థిరీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రావిడెంట్ ఫండ్, ఇంధన బకాయిలను చెల్లించడానికి, ప్రభుత్వ హామీతో, ప్రభుత్వమే తిరిగి చెల్లించే రూ. 2,000 కోట్ల రుణానికి ఆమోదం లభించింది.
2023-25 సంవత్సరానికి గాను రూ. 1,219.23 కోట్ల మోటారు వాహన పన్నును మాఫీ చేశారు. పదవీ విరమణ చేసిన సిబ్బంది గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్ కోసం రూ. 224.05 కోట్లు విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద 2025-26 చివరి నాటికి 2,000 కొత్త డీజిల్, ఎలక్ట్రిక్ బస్సులను చేర్చనున్నారు.
సంవత్సరాలుగా జీతాల సవరణ చూడని ఉద్యోగులకు కూడా ఉపశమనం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 18, 2026న జారీ చేసిన ఒక ఉత్తర్వు, 2021 నుంచి 2023 వరకు 26 నెలల కాలానికి గాను రూ. 1,271.92 కోట్ల బకాయిలను క్లియర్ చేస్తుంది. దీని తర్వాత ట్రేడ్ యూనియన్లతో కొత్త వేతన చర్చలు జరుగుతాయి.
Next Story

