కోల్‌కతా లా కాలేజీకి NCW సభ్యురాలు
x

కోల్‌కతా లా కాలేజీకి NCW సభ్యురాలు

బాధితురాలు ఎక్కడుందో చెప్పకపోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగిన అర్చన మజుందార్..


Click the Play button to hear this message in audio format

జాతీయ మహిళా కమిషన్ (NCW) సభ్యురాలు అర్చన మజుందార్(Archana Majumdar) ఆదివారం కోల్‌కతా(Kolkata) చేరుకుని నేరుగా సౌత్ కోల్‌కతా లా కాలేజీని వెళ్లారు. కాలేజీ విద్యార్థినిపై అదే కళాశాలకు చెందిన ఒక పూర్వ విద్యార్థి, మరో ఇద్దరు సీనియర్లు జూన్ 25న సామూహిక అత్యాచారానికి (Gang rape) పాల్పడ్డ విషయం తెలిసిందే. మజుందార్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను మాత్రమే కాలేజీలోకి అనుమతించిన పోలీసులు.. లోపల ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీకి అనుమతించలేదు. ఘటన జరిగిన గదిని పరిశీలించిన అనంతరం మజుందార్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. బాధితురాలికి కమిషన్ అండగా ఉంటుదన్నారు. అయితే బాధితురాలు ఎక్కడున్న విషయాన్ని పోలీసులు చెప్పకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. NCW దర్యాప్తులో భాగమని, బాధితురాలి తల్లిదండ్రులతో కూడా మాట్లాడాల్సి ఉందని చెప్పినా వారు స్పందించలేదు. దాంతో మజుందార్‌కు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం.

ఇప్పటికి నలుగురి అరెస్టు..

బాధితురాలి ఫిర్యాదు మేరకు.. కేసులో ప్రధాన నిందితుడు మోనోజిత్‌ మిశ్రా(31)తో పాటు ఇద్దరు సీనియర్ విద్యార్థులు జాయిబ్ అహ్మద్, ప్రమిత్ ముఖర్జీని అరెస్టు చేశారు. శనివారం ఉదయం కాలేజీ గార్డును కూడా అరెస్టు చేశారు. కేసు దర్యాప్తునకు అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు.

Read More
Next Story