బీజేపీ పాలిత రాష్ట్రంలో ఐఏఎస్‌ల బదిలీలు, కొంతమందికి అదనపు బాధ్యతలు
x

బీజేపీ పాలిత రాష్ట్రంలో ఐఏఎస్‌ల బదిలీలు, కొంతమందికి అదనపు బాధ్యతలు

ఒడిశాలో కొత్తగా ఏర్పాటయిన బీజేపీ ప్రభుత్వం ఐఏఎస్‌ అధికారుల స్థానాలను మార్చడం ప్రారంభించింది. కొంతమందిని బదిలీ చేయగా.. ఇంకొంతమందికి అదనపు బాధ్యతలను అప్పగించారు.


ఒడిశాలో కొత్తగా ఏర్పాటయిన బీజేపీ ప్రభుత్వం ఐఏఎస్‌ అధికారుల స్థానాల్లో మార్చడం ప్రారంభించింది. కొంతమందిని బదిలీ చేయగా.. ఇంకొంతమందికి అదనపు బాధ్యతలను అప్పగించారు.

ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి (ACS) నికుంజా బిహారీ ధాల్ IDCO ఛైర్మన్‌గా అదనపు బాధ్యతలు చేపడతారు. అలాగే ప్రస్తుతం జీఏ-పీజీ విభాగం, టూరిజం శాఖలకు ఏసీఎస్‌గా ఏసీఎస్ సురేంద్ర కుమార్‌కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ బాధ్యతలు అప్పగించారు. సీనియర్ ఐఏఎస్ అధికారి జి మతివతనన్ భువనేశ్వర్‌లోని గోపబంధు అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ట్రైనింగ్ కోఆర్డినేషన్ డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేశారు.

ఇండస్ట్రియల్ ప్రమోషన్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఒడిశా (IPICOL) చైర్మన్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హేమంత్ శర్మ MS & ME డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు.

వాణిజ్యం, రవాణా శాఖ అదనపు బాధ్యతతో నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న ఉషా పాధీ హౌసింగ్, అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌కు అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు.

ఒడిశా స్టేట్ స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (OSSSC) చైర్మన్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న గవర్నర్‌కు ప్రధాన కార్యదర్శి శాశ్వత్ మిశ్రా ఆర్థిక, ఇంధన శాఖల అదనపు బాధ్యతలను అప్పగించారు.

1996 బ్యాచ్ IAS అధికారి విశాల్ కుమార్ దేవ్ ఒడిశా ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (OFDC) ఛైర్మన్‌గా ఉన్నారు. ఈయనకు అదనంగా ఎలక్ట్రానిక్స్, IT శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులయ్యారు.

భాస్కర్ జ్యోతి శర్మ క్రీడలు, యువజన సేవల విభాగం కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆర్. వినీల్ కృష్ణ ల్యాండ్ రికార్డ్స్, సెటిల్‌మెంట్ శాఖ కమిషనర్‌గా బదిలీ అయ్యారు.

మోహన్ చరణ్ గురించి..

ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ ఇటీవల బాధ్యతలు చేపట్టారు. 147 స్థానాలున్న శాసనసభలో బీజేపీ 78 సీట్లు గెలుచుకోగా.. బీజేడీకి 51 సీట్లు మాత్రమే వచ్చాయి. మోహన్ చరణ్ ఒడిశా మొదటి బిజెపి ముఖ్యమంత్రి అలాగే మూడో గిరిజన ముఖ్యమంత్రి కూడా. కాంగ్రెస్‌కు చెందిన హేమానంద బిస్వాల్, గిరిధర్ గమాంగ్ తర్వాత సీఎం అయిన మోహన్ చరణ్.. ఆర్‌ఎస్‌ఎస్ నిర్వహిస్తున్న సరస్వతి శిశు విద్యా మందిర్‌లో ఉపాధ్యాయుడిగా తన వృత్తిని ప్రారంభించారు. రాయికల పంచాయతీ సర్పంచ్‌గా రాజకీయ జీవితం ప్రారంభమైంది. బిజెపి ST మోర్చా జాతీయ కార్యదర్శిగా ఉంటూ 2000లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లోనూ మళ్లీ గెలిచారు. అయితే ఒడిశాలో బీజేపీ-బీజేడీ కూటమి వీగిపోవడంతో 2009, 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. 2019లో అసెంబ్లీకి తిరిగి వచ్చిన మోహన్ చరణ్ ..2024లో నాలుగోసారి తిరిగి గెలుపొందారు. మొత్తం నాలుగు సార్లు శాసనసభ్యుడిగా పనిచేశారు.

Read More
Next Story