‘బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ జరుగుతుంది’
x

‘బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ జరుగుతుంది’

స్పష్టం చేసిన ఎలక్షన్ కమిషన్


Click the Play button to hear this message in audio format

బీహార్‌(Bihar)లో ఓటరు లిస్టుపై స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఉంటుందని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. ఈ ప్రక్రియపై ప్రతిపక్ష పార్టీల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈసీ మరోసారి స్పష్టంగా పేర్కొంది. SIR ఖచ్చితంగా జరుగుతోందని బీహార్ ప్రధాన ఎన్నికల అధికారి (CEO) పేర్కొన్నారు. ‘‘ఓటర్లు డాక్యుమెంటేషన్ పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుత ఓటర్లు మొదట తమ ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించిన తర్వాత కూడా అవసరమైన పత్రాలను సమర్పించడానికి సమయం ఉంటుంది. ECI ఆదేశానుసారం 24.06.2025 నాటి అన్ని ఖచ్చితంగా జరుగుతాయి" అని CEO పేర్కొన్నారు.


SIR‌పై I.N.D.I.A కూటమి ఆగ్రహం

రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్‌లో మాత్రమే నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్ ప్రక్రియను ఇండియా బ్లాక్ వ్యతిరేకిస్తోంది. ఇటీవలె S.I.Rపై ఎలక్షన్ కమిషన్ ఓ సర్య్కూలర్‌ కూడా జారీ చేసింది. దాని ప్రకారం 1987 తర్వాత జన్మించిన వారు ఓటరుగా నమోదు చేసుకోడానికి వారి బర్త్ సర్టిఫికేట్‌తో పాటుగా తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికేట్లు కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఈసీ నిర్ణయాన్ని భారత కూటమి(I.N.D.I.A)లోని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తు్న్నాయి. SIR వల్ల బీహార్‌లో 8 కోట్లకు పైగా ఉన్న ఓటర్లలో 20 శాతం మంది ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని వాదిస్తున్నాయి. కూటమిలోని ఆర్జేడీ, వామపక్ష పార్టీలు, ఎన్‌సీపీ-ఎస్పీ పార్టీల తరుపున 20 మంది సభ్యుల బృందం SIRపై అభ్యంతరాలు తెలిపేందుకు ఈసీ అపాయింట్‌మెంట్ కోరింది. దాదాపు మూడు గంటల పాటు జరిగిన సమావేశంలో సింఘ్వీ, ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా, సీపీఐ-ఎంఎల్ఎల్ నాయకుడు దీపాంకర్ భట్టాచార్య SIRపై అభ్యంతరాలను వ్యక్తం చేశారు. SIR నిర్వహిస్తే లక్షలాది బీహార్ ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఓటు హక్కు కోసం ఇప్పుడు పేదలు, నిరక్షరాసులు, వలస కూలీలు బర్త్ సర్టిఫికేట్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాలా? అని ప్రశ్నించారు.

దేశవ్యాప్త సమ్మె..

ఈసీ నిర్ణయాన్ని వెనక్కతీసుకోవాలని ఇండియా బ్లాక్ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. జూలై 9న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి.

సుప్రీంలో పిటీషన్..

కాగా SIRపై ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ మహువా మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బీహార్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండా ఈసీని ఆదేశించాలని మోయిత్రా తన పిటీషన్‌లో అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.

Read More
Next Story