పశ్చిమ బెంగాల్: సందేశ్ కాళీ ఘటనపై కలకత్త హైకోర్టు కీలక తీర్పు
x

పశ్చిమ బెంగాల్: సందేశ్ కాళీ ఘటనపై కలకత్త హైకోర్టు కీలక తీర్పు

సందేశ్ కాళీలో షేక్ షాజహాన్ జరిపిన అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎందుకు జరపకూడదని బెంగాల్ ప్రభుత్వాన్ని కలకత్త హైకోర్టు ప్రశ్నించింది. విచారణను సీబీఐకి..


సార్వత్రిక ఎన్నికల ముందు మమతా బెనర్జీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. సందేశ్ ఖాలిలో ఆ పార్టీ నాయకులు షేక్ షాజహాన్ జరిపిన భూ కబ్జా, మహిళలను బలవంతం చేయడం వంటి వాటిపై కలకత్త హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. అలాగే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులపై జనవరి 5 న జరిగిన మూక దాడిపై కూడా స్వయంగా హైకోర్టు పర్యవేక్షణ చేస్తుందని చీఫ్ జస్టిస్ టీఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

"సందేశ్‌ఖాలీలోని అంశాల సంక్లిష్టతను పరిగణనలోకి తీసుకుంటే, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలి. ఎటువంటి సందేహం లేదు. రాష్ట్ర ప్రభుత్వం (ఏ) ఏజన్సీని (స్థానంలో ఉంచితే) దానికి సరైన మద్దతు ఇవ్వాలి.." అని న్యాయమూర్తులు అన్నారు. మహిళల ఆరోపణలపై బెంగాల్ ప్రభుత్వానికి చీఫ్ జస్టిస్ శివజ్ఞానం ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు: ‘‘అఫిడవిట్ సరైనదేనా.. ఒక్క శాతం నిజమైనా. అది సిగ్గుచేటు అన్నారు.
రెవెన్యూ రికార్డులను పరిశీలించి, భూమిని భౌతికంగా పరిశీలించిన తర్వాత వ్యవసాయ భూమిని పిసికల్చర్ కోసం నీటి వనరులుగా అక్రమంగా మార్చారనే ఆరోపణలపై సమగ్ర నివేదికను దాఖలు చేయాలని కోర్టు సీబీఐకి తెలిపింది.
జస్టిస్ హిరణ్మయ్ భట్టాచార్యతో కూడిన ధర్మాసనం, సీబీఐ తన నివేదికను దాఖలు చేయమని కోరిన రోజున మే 2న ఈ అంశాన్ని విచారించనున్నట్లు తెలిపింది.
ఇప్పుడు సస్పెండ్ చేయబడిన తృణమూల్ నాయకుడు షేక్ షాజహాన్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సందేశ్‌ఖాలీ ద్వీపం నుంచి వచ్చిన ఆరోపణలపై బాహ్య ఏజెన్సీలను దర్యాప్తు చేయమని కోరుతూ దాఖలైన పిటిషన్‌ల క్లచ్‌ను కోర్టు గత వారం విచారించింది.
బియ్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ షాజహాన్ ఇంట్లో సోదాలు చేయడానికి వెళ్లిన ఈడీ అధికారులపై అతని మద్దతుదారులు దాడి చేశారు. దీంతో ఈ వివాదంపై దేశ వ్యాప్తంగా దృష్టిని ఆకర్షించిందనే చెప్పాలి. తరువాతనే సందేశ్ ఖాళీ ప్రాంతంలో జరుగుతున్న అక్రమాలపై అన్ని విషయాలు బయటకు వచ్చాయి. అప్పటి నుంచి రెండు నెలల పాటు పరారీలో ఉన్న షేక్ షాజహాన్ తరువాత బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రస్తుత పరిణామంతో బెంగాల్ ప్రభుత్వం చిక్కుల్లో పడినట్లయింది. ఇది ఎన్నికల సమయం కావడంతో ప్రజల్లో దీనిపై చర్చ జరిగితే టీఎంసీకి సీట్లు తగ్గే అవకాశం కనిపిస్తోంది.
Read More
Next Story