పునర్జీవనం దిశగా బెంగాల్ వామపక్షాలు.. కారణం ఏంటీ?
x

పునర్జీవనం దిశగా బెంగాల్ వామపక్షాలు.. కారణం ఏంటీ?

బెంగాల్ లో వామపక్షాలు ఎక్కువగా యువతపై దృష్టిపెట్టి తమ విధానాలను పున: నిర్మించుకుంటున్నాయి. ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో చాలా మంది 30 ఏళ్ల లోపే వారే


బెంగాల్ లో సీపీఐ దశాబ్దం తరువాత ఆత్మవిశ్వాసంతో కూడిన దూకుడును ప్రదర్శిస్తోంది. ఇప్పటికే అస్థిత్వం పోరాటాలు చేస్తున్న వామపక్షాలు, ప్రస్తుతం ప్రదర్శించే దూకుడు ఆశ్చర్యం కలిగించే అంశం.ఈ అస్థిత్వ పోరులో పార్టీ అధినేతలు ముందుండి నాయకత్వం వహిస్తున్నారు.

యువతను తమ పార్టీలోకి ఆకర్షిస్తునే తమదైన విధానాలతో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, టీఎంసీపై పోరాటాలు చేస్తున్నారు. మే 7 జరిగిన మూడో దశ ఓటింగ్ లో ముర్షిదాబాద్‌లోని పోలింగ్ బూత్ నుంచి తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన "నకిలీ ఏజెంట్"ని సీపీఎం బెంగాల్ స్టేట్ సెక్రటరీ మహ్మద్ సలీం బయటకు లాగడం బెంగాల్‌లో ఇప్పటివరకు జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అత్యంత సూచనాత్మక చిత్రంగా భావించవచ్చు.

రాష్ట్రంలో లెఫ్ట్‌ ఫ్రంట్‌కు ఆధారమైన యువజన సిపిఐ (ఎం)లో కొత్తగా ఏర్పడిన ఆత్మవిశ్వాసంతోనే సీపీఎం స్టేట్ సెక్రటరీ ధైర్యంగా ముందడుగు వేయడానికి కారణంగా రాజకీయ విశ్లేషకులు, వ్యాఖ్యత , రచయిత ఎండీ సాదుద్దీన్ అర్జూ అంటున్నారు.
చాలాకాలంలో లెప్ట్ ఫ్రంట్ లో ఈ విశ్వాసం కనిపించలేదు. మమతా బెనర్జీని గద్దె దింపే ప్రయత్నంలో తమతో బీజేపీ కలిసి వస్తుందని కమ్యూనిస్టు నాయకులు భావించారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల తరువాత బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఇక్కడ ఎదగడంతో వామపక్షాలు సొంతంగానే అధికార పార్టీలపై పోరాటం ప్రారంభించాయి.
ఎరోడింగ్ బేస్
రాష్ట్రంలో ఉన్న 42 ఎంపీ సీట్లలో 2019 ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 18 సీట్లను గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో కాషాయదళం అదనంగా 22.౭౬ ఓట్ల శాతాన్ని సాధించుకుంది. తన ఓటు బ్యాంకు పూర్తిగా కమలదళానికి బదిలీ అయ్యాయని నాయకత్వం గమనించిననప్పటి నుంచి దానికి కంటిమీద కునుకుపట్టలేదని చెప్పుకోవాలి. వామపక్షాలు ఆ ఎన్నికల్లో ఏకంగా 16 శాతం మేర ఓట్లు కోల్పోయాయి.
రెండేళ్ళ తరువాత పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు పోటీ మొత్తం బీజేపీ- టీఎంసీ మధ్యనే కేంద్రీకృతమైంది. ఈ గాయాలు ఇప్పటికీ వామపక్షాలను బాధిస్తున్నే ఉన్నాయి. రాష్ట్రంలోని మరో క్షీణిస్తున్న రాజకీయ శక్తి అయిన కాంగ్రెస్‌తో 2021 అసెంబ్లీ పోరుకు ముందు కుదుర్చుకున్న పొత్తు కూడా అర్ధంతరంగా ఉంది. తొలిసారిగా రాష్ట్ర అసెంబ్లీలో రెండు పార్టీలు ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయాయి.
వామపక్షాల పునరుజ్జీవనం
సమస్యలు ఎదురైనప్పుడు వాటిని తొలగించి పోరాటం చేయడమే ఉత్తమ మార్గం. అయితే అనేక పోరాటాల్లో రాటు దేలిన వామపక్షాలు మాత్రం బెంగాల్ లో ఎదురైన టీఎంసీ, బీజేపీలను ఎలా ఎదుర్కొవాలో మొదట అర్థం కాలేదు. ఇప్పుడు బలం మొత్తాన్ని కూడదీసుకుని ఎన్నికల బరిలోకి దిగాయి.
"ఇది కనీసం శత్రు శిబిరానికి మేము ఉన్నాము, పోరాడుతున్నాం " అనే సందేశాన్ని పంపినట్లు అవుతుందని రాజకీయ విశ్లేషకుడు అమల్ సర్కార్ అన్నారు. రాష్ట్రంలో ఇండి కూటమి అభ్యర్థులుగా లెఫ్ట్ ఫ్రంట్ బరిలోకి దిగిన 30 మంది అభ్యర్థులలో, సలీంతో సహా నలుగురు మాత్రమే 60 ఏళ్లు పైబడిన వారు. దాని నామినేట్‌లలో ఎనిమిది మంది 30 ఏళ్లలోపు వారు.
యువ బ్రిగేడ్, సంస్థకు కొత్త శక్తిని తీసుకురావడమే కాకుండా, యువ ఓటర్లతో తక్షణ అనుసంధానాన్ని ఏర్పరచడానికి తన ప్రచారంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఉపయోగించడం వంటి కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలైన TMC - BJP కంటే ముందుగానే CPI(M) ఎన్నికల సంసిద్ధతను ప్రారంభించింది.
యాత్రలు, ర్యాలీలు
పార్టీ డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డివైఎఫ్‌ఐ) ఈ శీతాకాలంలో తన రాష్ట్ర కార్యదర్శి మినాక్షి ముఖర్జీ నేతృత్వంలో 50 రోజుల రాష్ట్రవ్యాప్త 'ఇన్సాఫ్ యాత్ర'ను ప్రారంభించింది.
జనవరిలో కోల్‌కతాలోని ఐకానిక్ బ్రిగేడ్ గ్రౌండ్‌లో జరిగిన భారీ ర్యాలీతో ముగిసిన యాత్ర "అవినీతి TMC, కమ్యూనల్ BJP"కి వ్యతిరేకంగా పోరాటానికి నాంది పలికింది.
ముఖ్యంగా గ్రామీణ బెంగాల్‌లో మార్చ్‌కు లభించిన స్పందన పార్టీని తిరిగి పోటీలోకి తీసుకొచ్చిందని చెప్పవచ్చు. దాని ర్యాలీలు, రోడ్ షోలు, కార్నర్ సమావేశాలు తిరిగి ప్రజలకు ఆకర్షించడం ప్రారంభించింది. గత ఎన్నికల్లో ఫ్రంట్‌ను దాదాపుగా విస్మరించిన TMC- BJP స్టార్ క్యాంపెయినర్లు ఈసారి దాని ప్రచారాన్ని నిరంతరం పరిశీలిస్తున్నారు.
"ఈస్టర్ రోజున నేను చెప్పిన పదం పునరుత్థానం, మీకు గుర్తుంటే" అని సలీం అన్నారు, 2021 అసెంబ్లీ ఎన్నికల నుంచి వామపక్షాలు, ముఖ్యంగా సిపిఐ (ఎం) అనేక చర్యలు తీసుకున్నాయి. "మొదట, మేము యువతపై దృష్టి పెట్టాము... ఈ పునరుజ్జీవనానికి యువత ఆధారమైంది. అప్పుడు మేము శిక్షణ, వారిని నిలుపుకోవడానకి ప్రాధాన్యత ఇచ్చాము.
రెడ్ వాలంటీర్లు
“కాబట్టి, మేము ఈ వ్యక్తులను నిలుపుకునే విధంగా మా విద్యార్థి, యువజన ఉద్యమాన్ని నిర్మిస్తాము. వారు నాయకులు, నిర్వాహకులు అవుతారు. మీరు ఇన్సాఫ్ యాత్ర చూశారు. ఇది ఆ ప్రక్రియలో భాగం, ”సలీం ది ఫెడరల్‌తో అన్నారు."కోవిడ్ -19 మహమ్మారి సమయంలో మా రెడ్ వాలంటీర్లు నిస్వార్థ సేవను అందించిన విధానం లెఫ్ట్ ఫ్రంట్ లేకుండా బెంగాల్ పునరుజ్జీవనం సాధ్యం కాదని సామాన్యులలో గ్రహించడానికి దారితీసింది" అని ఆయన అన్నారు.
ఫ్రంట్ తన ఎన్నికల అదృష్టాన్ని మలుపు తిప్పడానికి " ఓటర్లు టిఎంసి-బిజెపి బైనరీని మించిపోయారు, ఎందుకంటే మంచి ప్రత్యామ్నాయం ఉందని వారు గ్రహించారు" అని సలీం పేర్కొన్నారు.
గతంలో మాదిరిగా కాకుండా కాంగ్రెస్, వామపక్షాల కూటమికి అట్టడుగు వర్గాల్లో ఆదరణ లభిస్తున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ ఓట్లను తమ పార్టీకి బదిలీ చేయడంపై వామపక్షాలు సానుకూలంగా ఉన్నాయి. సీట్ల పంపకాల ఏర్పాటు ప్రకారం, వామపక్షాలు 30 స్థానాల్లో, కాంగ్రెస్ 12 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. 22 మంది అభ్యర్థులను నిలబెట్టిన సీపీఐ(ఎం)కి అత్యధిక సీట్ల వాటా ఉంది.
సులభమైన పని కాదు
“ఈసారి, కూటమి కింది నుంచి నిర్మించబడింది. ప్రజలు, అగ్రస్థానంలో ఉన్న నాయకులు మాత్రమే కాదు, కూటమికి అత్యంత శక్తిమంతమైన వోటర్లు కూడా తమ మనస్తత్వాన్ని తిరిగి మా వైపే ”అని మార్క్సిస్ట్ నాయకుడు ఘంటా పథంగా చెబుతున్నారు. పునరుజ్జీవనం దాని పతనం అంత వేగంగా ఉండకపోవచ్చని సలీం ఆశిస్తున్నాడు,
15 ఏళ్లలో, వామపక్షాల అసెంబ్లీ సంఖ్య 235 (2006లో) నుంచి సున్నాకి (2021లో) తగ్గింది. రాష్ట్రంలో 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దాదాపు 20 స్థానాల్లో పోటీ త్రిముఖ పోరుగా మార్చినప్పటికీ, ఎన్నికల ఆధారంగా వామపక్ష-కాంగ్రెస్ కూటమి ప్రస్తుత హస్టింగ్‌లో చాలా సీట్లు గెలవలేకపోవచ్చు.
2021లో లెఫ్ట్ ఫ్రంట్ ఓట్ల శాతం 4.73 శాతానికి, కాంగ్రెస్ 2.93 శాతానికి పడిపోయింది. చెప్పుకోదగ్గ సంఖ్యలో సీట్లు గెలవాలంటే అక్కడి నుంచి పూర్తిగా తిరగబడడం కష్టమైన పని.ప్రస్తుతం రెండు పార్టీలు ఈ ఎన్నికల్లో గౌరవప్రదమైన ఓట్లను పొందడానికి దృష్టిపెడుతున్నాయి.
Read More
Next Story