
పూరి జగన్నాథుడి రథయాత్ర
పూరి రథయాత్రలో తొక్కిసలాట
ముగ్గురు భక్తుల మృతి, చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు
పూరి రథయాత్రలో తొక్కిసలాట జరిగి ముగ్గురు భక్తులు మృతి చెందారు. మరో 50 మంది భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండిచా ఆలయానికి దగ్గరగా ఉన్న శారదబలి వద్ద దుర్ఘటన జరిగింది. ప్రతి సంవత్సరం ఇక్కడికి లక్షలాది మంది భక్తులు రథయాత్రకు వీక్షించడానికి వస్తారు.
విషమంగా ఆరుగురి పరిస్థితి..
పూరి జిల్లా కలెక్టర్ ప్రకారం.. ఈ రోజు ఉదయం నాలుగు గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. జగన్నాథుడు, బలభద్ర, దేవీ సుభద్ర రథయాత్రను వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు గుండీచా ఆలయం వద్ద గుమిగూడారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగింది.
రథయాత్రలో భాగంగా జగన్నాథుడు గుండీచా ఆలయంలో ఏడు రోజుల పాటు గడిపి తిరిగి ప్రధాన ఆలయానికి తిరిగి వస్తాడు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆలయంలోని మూలవిరాట్టు స్వయంగా బయటకు తీసుకు వచ్చే ఈ యాత్రను చూడటానికి లక్షలాది మంది భక్తులు వేచి చూస్తారు.
అస్వస్థతకు గురైన భక్తులకు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఆరుగురు భక్తుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. చనిపోయిన ముగ్గురిని గుర్తు పట్టినట్లు కూడా చెప్పారు.
బలిపట్నాకు చెందిన ప్రేమ్ కాంత్ మొహంతి, ప్రవతి దాస్, బోల్ గర్హ్ కు చెందిన బసంతి సాహు అని తెలిపారు. మృతదేహాలకు పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు, కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపారు.
కారణం ఏంటీ?
తెల్లవారుజామున శారదబలి వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు గుమిగూడగా, ‘చరమాల’ ను తీసుకెళ్తున్న రెండు వాహానాలు సంఘటన స్థలానికి తీసుకెళ్లిన సమయంలో భారీ రద్దీ ఉంది.
దీనితో అక్కడ గందరగోళం ఏర్పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చరమాల అనేది దేవతల రథాలను తీసుకెళ్లడానికి లేదా కిందకు తీసుకెళ్లడానికి ఉపయోగించే తాత్కాలిక చెక్క మెట్లు.
పహుడా ఆచారం ఆర్థరాత్రి 12.30 గంటలకు పూర్తయిందని దేవతల దర్శనం తెల్లవారుజామున 3.45 నిమిషాలకు తిరిగి ప్రారంభం అయింది. ఈ సమయంలోనే జనసమూహం ఒక్కసారిగా పెరిగిపోవడంతో తొక్కిసలాట జరిగింది. ఒడిశా టీవీ ప్రకారం.. జనసమూహాన్ని నిర్వహించడానికి ఆ ప్రాంతంలో పోలీసుల మోహరింపు లేదని పలువురు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఈ సంఘటన జరిగినప్పుడూ ఎవరూ స్పందించలేదు. అగ్నిమాపక అధికారులు, రెస్క్కూ టీం లేదా ఆసుపత్రి బృందం కూడా స్పందించలేదు. ఇది వ్యక్తపరచలేదని, దయనీయమైన సంఘటన ని తొక్కిసలాటలో తన భార్యను కోల్పోయిన ఒక వ్యక్తిని ఉటంకిస్తూ జాతీయ మీడియా వార్తలు ప్రసారం చేసింది.
అవసరమైన చర్య తీసుకుంటాము..
డీజీపీ వైబీ ఖురానియా, సీనియర్ ప్రభుత్వ అధికారులు సంఘటన స్థలంలో పరిస్థితిని సమీక్షించారు. ఇదిలా ఉండగా, ఈ సంఘటన గురించి ఒడిశా న్యాయమంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీకి తెలియజేసినట్లు తెలిపారు. ‘‘మేము అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాము’’ అని హరిచందన్ అన్నారు.
పూరిలో రథయాత్ర ప్రారంభమైన ఒకరోజు తరువాత జగన్నాథుడు, బలభద్రుడు, దేవీ సుభద్రల రథాలు శనివారం శ్రీ గుండిచా ఆలయానికి చేరుకున్నాయి. ఈ ఆలయాన్ని దేవతల అత్తమ్మ స్థలంగా పరిగణిస్తారు.
వారు 12 వ శతాబ్ధపు జగన్నాథ ఆలయం నుంచి ప్రతి సంవత్సరం 2.6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆచారాలలో భాగంగా గుండీచాకు వెళతారు. బహుదా యాత్ర అని పిలువబడే తిరుగు ప్రయాణం జూలై 5న జరుగుతుంది.
పూరి ఆలయంలోకి ఇతర సమయాల్లో హిందూయేతరులను, విదేశీయులను అనుమతించరు. ఇక్కడ ఈ నిబంధనలు చాలా కఠినంగా అమలు చేస్తారు. కేవలం రథయాత్ర సందర్భంగా మాత్రమే జగన్నాథుడి దర్శనం చేసుకోవడానికి అన్యమతస్థులకు అనుమతి ఉంటుంది. అందుకే ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులు పూరికి విచ్చేస్తారు.
Next Story