‘పూరి’ లో తొక్కిసలాట జరగడానికి కారణం ఏంటీ?
x
ఆస్పత్రి ఎదుట విలపిస్తున్న బంధువులు

‘పూరి’ లో తొక్కిసలాట జరగడానికి కారణం ఏంటీ?

కనిపించని పోలీసులు, రెస్క్యూ బృందం


పూరి జగన్నాథ రథయాత్రలో ఆదివారం ఉదయం తొక్కిసలాట జరిగి ముగ్గురు భక్తులు మరణించారు. మరో 50 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండీచా ఆలయం దగ్గర ఏర్పడిన గందరగోళం, నిర్వహణ లోపాలు, భక్తుల సంఖ్య పెరగడం వల్ల ఈ విషాదం సంభవించింది.

ఈ దుర్ఘటన తెల్లవారుజామున 4.20 గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. వేలాది మంది యాత్రికులు జగన్నాథుడి ఆచారాలను వీక్షించడానికి ఒక్కసారిగా దూసుకురావడంతోనే ఈ సంఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
మరణించిన ముగ్గురు ప్రేమ్ కాంత్ మొహంతి(80), బసంతి సాహు(36), ప్రభాతి దాస్(42)గా గుర్తించారు. ఈ దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. ప్రత్యక్ష సాక్షులు, భక్తుల నుంచి సమాచారం ఆధారంగా దీనికి గల కారణాలు కింది విధంగా ఉన్నాయి.
1. జనసమూహం, ఉప్పెన..
కొన్ని నివేదికల ప్రకారం.. ‘‘పహుదా’’( దేవతలు నిద్రపోయే సమయం) అయిపోయిన కొద్దిసేపటికే ఈ సంఘటన జరిగింది. మూడు రథాలపై ఉన్న దేవతల దర్శనం తిరిగి ప్రారంభమైందని భక్తులు తోసుకుంటూ వచ్చారని అధికారులు తెలిపారు.
పహుదా రాత్రి 12.30 గంటలకు జరిగిందని దర్శనం తెల్లవారుజామున 3.45 నిమిషాలకు ప్రారంభం అయిందని అధికారులు తెలిపారు. జగన్నాథ ఆలయం నుంచి 3 నుంచి కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచా ఆలయం చుట్టూ దాదాపు 1500 మంది భక్తులు దర్శనం కోసం వచ్చారని నివేదికలు చెబుతున్నాయి. వేలాది మంది ఒకేసారి దర్శనం కోసం తరలిరావడంతో ఆకస్మాత్తుగా జనసమూహం పెరిగి తొక్కిసలాటకు కారణమైంది.
‘‘మేము తెల్లారుజామున 3.31 నిమిషాలకు గుండీచా ఆలయం ముందుకు చేరుకున్నాము. ఆ సమయంలో దాదాపు 50 వేల మంది భక్తులు ఉన్నారు. దర్శనం తిరిగి ప్రారంభమైనప్పుడూ ఆకస్మాత్తుగా గందరగోళం నెలకొంది’’ అని ఒక ప్రత్యక్షి సాక్షి గుర్తుచేసుకున్నాడు.
2.ట్రక్కుల ఆకస్మిక రాక..
ప్రత్యక్ష సాక్షుల అభిప్రాయం ప్రకారం.. ‘‘చరమాల’’ లను మోసుకెళ్లే రెండు ట్రక్కులు దేవతలను కిందకు తీసుకురావడానికి ఉపయోగించే తాత్కాలిక చెక్క మెట్లు కిక్కిరిసిన ప్రాంతం గుండా వెళ్లడానికి ప్రయత్నించినప్పుడూ పరిస్థితి గందరగోళంగా మారింది.
ఇరుకుగా ఉన్న స్థలంలోకి ట్రక్కులు రావడంతో పరిస్థితి మారిపోయింది. ప్రత్యక్ష సాక్షి చిన్మయ్ పాత్ర మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇరుకైన ప్రదేశం, పోలీసుల ఉనికి లేకుండా పోవడం, రథాల దగ్గర ఉన్న పరిస్థితులు భక్తులకు ప్రమాదకరంగా మారాయి’’ అని చెప్పారు.
3. వీఐపీలరోడ్డు..
పూరీ నివాసీ స్వాధీన్ కుమార్ పాండా జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వీఐపీల కోసం రూపొందించిన కొత్త మార్గం’’ భక్తులకు పరిమిత స్థలం మిగిల్చిందని చెప్పారు.
‘‘నేను నిన్న రాత్రి 2-3 గంటల వరకు ఆలయం దగ్గరే ఉన్నాను. కానీ నిర్వహణ బాగా లేదు. వీఐపీ ల కోసం కొత్త మార్గం ఏర్పాటు చేశారు. సామాన్య ప్రజలను దూరంగా ఉన్న వేరే మార్గంనుంచి బయటకు వెళ్లమని చెప్పినట్లు వివరించారు. దీనితో రద్దీ తగ్గలేదని అన్నారు.
4. నిర్వహణ లోపం..
చాలామంది భక్తులు, ప్రత్యక్ష సాక్షులు నిర్వహణ పూర్తిగా దుర్వినియోగం అయిందని ఫిర్యాదు చేశారు. ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ బాగాలేదని, అనధికార పాస్ లతో చాలా వాహనాలు ఆలయం దగ్గరకు వచ్చాయని పాండా అన్నారు.
‘‘పరిపాలన యంత్రాంగం జనసమూహాన్ని సరిగ్గా నియంత్రించలేదు. అతిపెద్ద సమస్య నిష్క్రమణ ద్వారం. దీనికి ఒడిశా పరిపాలన బాధ్యత వహించాలి. రాత్రిపూట అక్కడ పోలీసులు, ఆలయ ఉద్యోగులు లేరు’’ అని పాండా చెప్పారు.
5. పోలీస్ సిబ్బంది లేరు..
తొక్కిసలాట సమయంలో పోలీస్ అధికారులను చూడలేదని చాలామంది భక్తులు ఆరోపించారు. తొక్కిసలాటలో తన బంధువును కోల్పోయిన ఒక మహిళా మాట్లాడారు. ‘‘పరిపాలన యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల మా ఆనందం విషాదంగా మారింది.
తొక్కిసలాట సమయంలో పోలీస్ సిబ్బంది ఎవరూ లేరు. ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. కానీ నేను మా వదినను కోల్పోయాను’’ అని అన్నారు.
మరో భక్తులు మాట్లాడుతూ.. ‘‘ పోలీస్ రక్షణ లేదు. తొక్కిసలాట జరిగిన సమయంలో క్రమశిక్షణా సభ్యులు ఎవరూ లేరు’’ అని ఆరోపించారు. నా మేనల్లుడు, ఇతరులు కలిసి 50 మందిని రక్షించారని పేర్కొన్నారు.
జగన్నాథుడి రథం వైపు కదులుతున్నప్పుడూ అకస్మాత్తుగా ‘‘భారీ జనసమూహం వారి వైపు దూసుకురావడం కనిపించింది’’ అని మరో భక్తుడు చెప్పాడు. సాధారణ ప్రజలు మాత్రమే సహయక చర్యలలో సాయం చేశారని పేర్కొన్నారు.
అయితే పూరీ ఎస్పీ వినీత్ అగర్వాల్ మాట్లాడుతూ.. సంఘటన స్థలంలో పోలీసులను మోహరించారని,దర్యాప్తు తరువాత వివరాలు బయటపెడతామని అన్నారు.
6. ప్రతిస్పందన లేదు..
విషాదం జరిగిన తరువాత పోలీసులు, సహాయక సిబ్బంది త్వరగా స్పందించలేదని తెలిపారు. బసంతి సాహు భర్త మాట్లాడుతూ.. సహయక సిబ్బంది ఎవరూ మాట్లాడలేదని చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందం వాళ్లు మచ్చుకైన కనిపించలేదని ఆరోపించారు.
‘‘ప్రజలు ఒకరిపై ఒకరు పడిపోయారు’’ అని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పారు. చాలామంది నిమిషాల్లోనే స్పృహ కోల్పోయారు. అక్కడి నుంచి అంబులెన్స్ ఒక కిలోమీటర్ దూరంలో ఉంది. వారు ఏమి చేయలేకపోయారు’’ అని చెప్పారు.
గందరగోళం చెలరేగిన తరువాత అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది తప్పించుకున్నారని సాహు భర్త ఆరోపించారు. ‘‘సుమారు 200-300 మంది గందరగోళంలో పడిపోయారు.
మేము పోలీస్ అధికారులకు చెప్పాము. కానీవారు సహాయం చేయలేదు. గాయపడిన మా బంధువులను మేము స్వయంగా మోసుకెళ్లాల్సి వచ్చింది’’ అని ఆయన చెప్పారు.
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎక్స్ లో ఈ దుర్ఘటనపై ప్రతిస్పందించారు. భక్తుల భద్రతను నిర్ధారించడంలో విఫలమైందని విమర్శించారు.
‘‘ప్రభుత్వం నేరపూరితంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించిందని నేను ఆరోపించకుండానే, వారి స్పష్టమైన నిర్లక్ష్యమే ఈ విషాదానికి కారణం’’ అని ఆయన అన్నారు. జూలై 1న పండగ ముగిసే నాటికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Read More
Next Story