నేను ఎలాంటి పోరాటాలు చేయను కానీ.. కంగనా రనౌత్
x

నేను ఎలాంటి పోరాటాలు చేయను కానీ.. కంగనా రనౌత్

నేను ఎలాంటి పోరాటాలు చేయను కానీ నా పై దాడి చేస్తే.. అందుకు ప్రతిదాడి కూడా ఎదుర్కొవాల్సి ఉంటుందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అన్నారు.


నేను పోరాటాలు చేయను కానీ, నన్ను ఎవరైన ఒక్కసారి కొడితే మీరు తీవ్ర స్థాయిలో ప్రతిదాడులు ఎదుర్కొవాల్సి ఉంటుందని మండి లోక్ సభ అభ్యర్థి, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అన్నారు. మండి లోక్ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన కంగనా, దీనిని తన జీవితంలో అతిపెద్ద మలుపుగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆమె జాతీయ మీడియాతో మాట్లాడారు.

తన ప్రత్యర్థి, మండి స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, సమస్యలపై ఎన్నికల్లో పోరాడాలి, అయితే అతను కించపరిచే పదాలు ఉపయోగిస్తే, అదే విధమైన భాష వినడానికి సిద్ధంగా ఉండాలని కంగనా అన్నారు.
"నా గత రికార్డుల ప్రకారం, నేను ఎవరినైనా సవాలు చేయగలను, నేను ఎన్ని పోరాటాలు చేసిన, ప్రతి పోరాటానికి ముందుండేది నేనే అన్నారు. "నేను గొడవలు చేయడానికి వెళ్లను, కానీ నాపై దాడి చేస్తే, నేను తిరిగి ప్రశాంతంగా వెళ్లను. ప్రతిదాడి చేసే వెళ్తాను" అని ఆమె తేల్చి చెప్పింది. మండి లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కంగనా పేరు ప్రకటించినప్పటి నుంచి కాంగ్రెస్ నేతలతో మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా ష్రినేట్ కి చెందిన ఎక్స్(ట్విట్టర్) హ్యాండిల్ నుంచి ఆమెకు వ్యతిరేకంగా కొన్ని "అవమానకరమైన" వ్యాఖ్యలు పోస్ట్ చేయబడ్డాయి, తరువాత వాటిని ఆమె పోస్ట్ చేయలేదని, ఆమె ఖాతాలకు నిర్వహించే మరో వ్యక్తి పోస్ట్ చేశారని ఆరోపిస్తూ వాటిని తొలగించారు.
దీనిపై కంగనా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ, విక్రమాదిత్య సింగ్‌లను "బడా పప్పు, చోటా పప్పు" అని పిలిచిన, కంగన తరువాత సింగ్‌ను "ఏక్ నంబర్ కా ఝూటా (లియర్) పాల్టు బాజ్ (తన వైఖరిని మార్చుకునే వ్యక్తి)" అని మాటల తూటాలు పేల్చారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విక్రమాదిత్య సింగ్, రాష్ట్ర మంత్రి, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్, మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు, రాంపూర్ బుషైర్ రాజ కుటుంబానికి చెందిన వారసుడు. కంగనా ఇంతకుముందు గొడ్డు మాంసం తినడంపై మాట్లాడిన వీడియో ను ప్రస్తావిస్తూ, విక్రమాదిత్య.. ‘ ఆమెకు(కంగనా) బుద్ధి ప్రసాదించమని శ్రీరాముడిని ప్రార్థిస్తున్నాను. ఆమె దేవ్ భూమి నుంచి వచ్చినంత స్వచ్చంగా తిరిగి బాలీవుడ్ వెళ్తుంది. ఎందుకంటే ఆమెకు ప్రజల గురించి ఏమి తెలియదు. కాబట్టి ఓడిపోవడం గ్యారెంటీీ’’ అని విమర్శించారు.
మంగళవారం ఆమె కులు క్యాప్ గురించి అడిగిన ప్రశ్నకు, కంగనా సమాధానమిస్తూ.. "జోట్" దానిని అలంకరించడం పవిత్రమైన రోజులలో ధరించే సంప్రదాయ ఆభరణమని చెప్పారు. "ఈ రోజు ధరించడానికి సరైన సమయం అని నేను భావించాను," ఆమె చెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజల నుంచి మద్దతు వెల్లువెత్తిందని, మూడోసారి అధికారంలోకి రావాలని కోరుతున్న నాయకుడికి ఇంత ఆదరణ లభించడం అపూర్వమని ఆమె అన్నారు.
'మోదీ హామీ' ఒక్కటే పని చేస్తుందనడంలో సందేహం లేదని, కలియుగంలో పని చేసే ఏకైక హామీ మోదీ హామీ అని ప్రజలు కూడా చెబుతున్నారని ఆమె అన్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ గెలుపొందడం ద్వారా 400 సీట్ల లక్ష్యానికి తోడ్పడుతుందని అన్నారు.
జనవరి 22న అయోధ్యలో జరిగిన పవిత్రోత్సవ కార్యక్రమానికి హాజరైన కంగనా, రామ మందిరం స్ఫూర్తిదాయకమని అన్నారు. రామరాజ్యమే మన సనాతన ధర్మానికి ఆధారమని, బీజేపీ అభివృద్ధి చేయడమే కాకుండా మన వారసత్వాన్ని కూడా తీసుకువెళుతుందని ఆమె అన్నారు.
Read More
Next Story