‘‘అప్పట్టో జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ వర్మ ఒకే కోర్టులో పనిచేశారు’’
x
జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ యశ్వంత్ వర్మ

‘‘అప్పట్టో జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ వర్మ ఒకే కోర్టులో పనిచేశారు’’

సింభోలి షుగర్స్ కేసును గుర్తు చేసుకున్న పిటిషనర్


రాజేష్ ఆహుజా

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు కాలిపోయిన ఘటనపై విచారణ ఎదుర్కొంటున్నారు. ఇంతకుముందు ఆయన తన దగ్గరకు వచ్చిన సింభోలి షుగర్స్ తో తనకున్న గత సంబంధం కారణంగా ఒకసారి ఒక కేసు నుంచి తప్పుకున్నారు.

2014 అక్టోబర్ లో బార్ నుంచి బెంచ్ గా పదోన్నతి పొందే ముందు, జస్టిస్ వర్మ సింభోలి షుగర్స్ కు లీగల్ కౌన్సిల్ గా వ్యవహరించారు. ముఖ్యంగా 2012 లో వ్యవసాయ - వ్యాపారం ఎఫ్ఎంసీజీ కంపెనీకి నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు.
దీని కారణంగా 2018 లో సింభోలి, దాని ప్రమోటర్లపై బ్యాంకు మోసం కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సీబీఐ, దీనిలో ఆయన కూడా నిందితుడిగా ఉన్నారు.
అంతకుముందు రెండు సంవత్సరాల ముందు ఆయన అలహాబాద్ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నప్పుడూ, చెరకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించిన కేసును విచారించడానికి పిటిషన్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయన తనను తాను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత ఆ కేసును మరొక బెంచ్ ముందుకు తరలించారు.
కేసు తిరస్కరణ..
ఈ సంఘటన జనవరి 2016 లో జరిగింది. జస్టిస్ వర్మ అప్పటి అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ లో భాగంగా ఉన్నారు. తరువాత ఆయన సుప్రీంకోర్టుకు పదోన్నతి పొంది భారత ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు.
ఉత్తర ప్రదేశ్ లోని చెరకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ దాఖలు చేసింది. ఈ కేసును వాదించడానికి దాని కన్వీనర్ వీఎం సింగ్ స్వయంగా హాజరయ్యారు.
చెరకు రైతులకు రావాల్సిన బకాయిలు వడ్డీతో సహా రావాలని ఆయన వాదించారు. అయితే షుగర్ కంపెనీల యజమానాలు దీనిని వ్యతిరేకించారు. ‘‘జస్టిస్ వర్మ ఒకప్పుడు సింభోలి షుగర్స్ లో డైరెక్టర్ గా ఉన్నందున నేను అప్పుడు అభ్యంతరం చెప్పాను. ఆయన ఈ కేసు నుంచి తప్పుకోవాలని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాను’’ అని సింగ్ గుర్తు చేసుకున్నారు.
బెంచ్ అభ్యంతరం..
ఈ దరఖాస్తు పై బెంచ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. జస్టిస్ వర్మ అభ్యర్థనను న్యాయమూర్తులు అంగీకరించినప్పటికీ ఈ ప్రక్రియ కేవలం కోర్టు ముందు సమస్యను ప్రస్తావించడమేనని, తద్వారా కేసును మరొక బెంచ్ కు అప్పగించవచ్చని పేర్కొంటూ దరఖాస్తూ ఇవ్వడాన్ని వారు వ్యతిరేకించారు. కానీ మొత్తానికి కోర్టు దీనిని అంగీకరించింది.
ఆ సమయంలో జస్టిస్ వర్మ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఉన్నారు. ఫిబ్రవరి 2016 లో ఆయనను కోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమించింది. కేవలం మూడు నెలల తరువాత అంటే మే 2016 లో జస్టిస్ చంద్రచూడ్ సుప్రీంకోర్టుకు పదోన్నతిపై వెళ్లారు.
వెళ్లిన చోటకే తిరిగి వచ్చిన వర్మ..
అదే సంవత్సరం ఆగష్టు 2, 2016న జస్టిస్ వర్మ ఒక సభ్యుడిగా ఉన్న ధర్మాసనం ముందుకు ఈ కేసు మళ్లీ విచారణకు వచ్చింది. మరో సారి మేము అభ్యంతరం పెట్టడంతో అప్పటి అలాహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బాబా సాహెబ్ భోంస్లే.
ఈ విషయాన్ని మరొక ధర్మాసనం ముందు విచారించాలని న్యాయమూర్తులు ఆదేశించారు. తరువాత అక్టోబర్ 2021 లో జస్టిస్ వర్మ అలహాబాద్ హైకోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు.
మార్చి 14న ఆయన అధికారిక నివాసంలోని స్టోర్ రూమ్ లో జరిగిన అగ్ని ప్రమాదం తరువాత బ్యాగుల్లో దాచిపెట్టిన కాలిన కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది. ప్రస్తుతానికి జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు తిరిగి బదిలీ చేసింది.
Read More
Next Story