కాశ్మీర్: పీడీపీ ఉనికి ఈ ఎన్నికలతో ప్రమాదంలో పడుతుందా?
x

కాశ్మీర్: పీడీపీ ఉనికి ఈ ఎన్నికలతో ప్రమాదంలో పడుతుందా?

ఈ లోక్ సభ ఎన్నికలు పీడీపీకి జీవన్మరణ సమస్యగా మాారాయి. అనేక మంది నాయకులు ఇప్పటికే పార్టీని వీడి వెళ్లిపోయారు. ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాకపోతే..


జమ్మూకాశ్మీర్ లోని ప్రధాన పార్టీ అయినా పీడీపీ(పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ) ఉనికి ఇప్పుడు ప్రమాదంలో పడిందనే చెప్పుకోవాలి. ఆ పార్టీ ఇలా అనేక సంక్షోభాలు ఎదుర్కోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. పార్టీ ఒకప్పటి రాజకీయ శక్తిగా లేదని ముందుగా మనం గుర్తుంచుకోవాలి.

పార్టీ తిరిగి ప్రజాదరణ పొందడానికి, కొత్త నాయకత్వం తయారు కావడానికి దాని అధినేత మెహబూబా ముప్తి అనుసరించే వ్యూహాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇది జరగాలంటే ముప్తీ ప్రసంగాలు, ప్రజాకర్షణగా ఉండాలి. లేదంటో లోయలో జరిగే లోక్ సభ ఎన్నికలు పార్టీకి అగ్నిపరీక్షగా నిలుస్తాయని అనుకోవడంలో ఎలాంటి సందేహాలు లేవు. అధికరణ 370, 35 ఏ రద్దు తరువాత పార్టీ చేస్తున్న పోటీ చేస్తున్న ఎన్నికలు ఇవే. ఇక్కడ కనీసం పార్టీ రెండు లేదా మూడు స్థానాలైన గెలవాలి లేదంటే పార్టీ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతుంది.

అందువల్ల, లోయలోని మూడు లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాలని పిడిపి 'డూ-ఆర్-డై' నిర్ణయం తీసుకుంది. పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, యువనేత వహీద్ పర్రా, ఫయాజ్ మీర్ వరుసగా అనంతనాగ్-రాజౌరీ, శ్రీనగర్ (మధ్య కాశ్మీర్), బారాముల్లా (ఉత్తర కాశ్మీర్) పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులుగా ఉన్నారు. ఎన్సీ మద్ధతు తీసుకోకూడదని ముప్తీ భావిస్తున్నారు. ఒమర్ అబ్దుల్లా అధికారంలో ఉండగా మా పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. మా పార్టీ ఉనికిని ప్రశ్నిస్తున్నారు.. కావునా ఇప్పుడు ఆయన మద్దతు కోసం వెళ్లను అని పీడీపీ అధినేత ఆలోచన. జమ్మూ, ఉధంపూర్, లడఖ్ పార్లమెంటరీ సెగ్మెంట్లలో తమకు అవకాశం లేదని PDP గ్రహించింది. అందుకే మూడు స్థానాలపైనే దృష్టి సారించింది.
NC నాకౌట్ పంచ్
జమ్మూకాశ్మీర్ లోని ఐదు స్థానాలు, అలాగే లఢక్ పార్లమెంట్ స్థానంపై ఎన్సీ, కాంగ్రెస్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇది పీడీపీకి పెద్ద దెబ్బ. గతంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని మొత్తం ఆరు పార్లమెంటరీ నియోజకవర్గాలకు తమ పార్టీ సీట్ల భాగస్వామ్యాన్ని ఖరారు చేసినట్లు ఒమర్ అబ్దుల్లా ధృవీకరించారు. న్యూఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరాతో అబ్దుల్లా విలేకరులతో మాట్లాడుతూ, "మేము వాటిని (సీట్లు) మా మధ్య సమానంగా పంచుకోవాలని నిర్ణయించుకున్నాము" అని అన్నారు.
ఉదంపూర్, జమ్మూ, లడఖ్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీ చేయగా, అనంతనాగ్-రాజౌరీ, శ్రీనగర్, బారాముల్లా లోక్‌సభ స్థానాల్లో ఎన్‌సీ పోటీ చేస్తోంది. ఈ నేపధ్యంలో, కాంగ్రెస్-ఎన్‌సి జట్టుకట్టడం వల్ల పార్టీల విజయాకశాలు ఎలా ఉంటాయి. కాంగ్రెస్-ఎన్‌సి భాగస్వామ్యం PDPని ఎలా ప్రభావితం చేస్తుంది. సజాద్ లోన్, అల్తాఫ్ బుఖారీ, గులాం నబీ ఆజాద్ నేతృత్వంలోని పార్టీలకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి?
అనుకూలంగా.. వ్యతిరేకంగా
ఆగస్టు 2019 తర్వాత, మెహబూబా పిర్ పంజాల్ శ్రేణులలోని పూంచ్, రాజౌరీలలో నివసిస్తున్న గుజ్జర్, పహాడీ కమ్యూనిటీల పౌర హక్కులు, వాక్ స్వాతంత్ర్యం, హక్కుల కోసం ముప్తీ తన స్వరం పెంచింది. నియంత్రణ రేఖ దగ్గర సీజ్ ఫైర్ అమలు చేయడం, సరిహద్దుకు ఇరువైపులా ఉన్నా ప్రజల మధ్య విద్యా, సాంస్కృతిక హక్కుల కోసం పాటుపడతానని హమీ ఇస్తున్నారు.
ఏప్రిల్ 2015 నుంచి జూన్ 2018 వరకు ఆమె ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, 2016లో కాశ్మీర్ లో నిరసనల సందర్భంగా పెద్ద ఎత్తున పౌర హత్యలు జరిగాయి. ఈ విషయాలు ప్రచురించిన ఇంగ్లిష్ పత్రిక కాశ్మీర్ రీడర్ పై నిషేధం విధించింది. పెల్లెట్ గన్ లను ఉపయోగించడం కారణంగా దాదాపు 1100 మంది కంటి చూపులను కొల్పోయారు. అయితే వాటిపై అప్పట్లో ఆమె మౌనం వహించారు.
తరువాత జరిగిన పరిణామాలతో ముప్తీ బిజేపీ వ్యతిరేకత ప్రారంభించారు. ఈ గట్టి వ్యతిరేకత ఇతర అంశాలతో కలిపి దక్షిణ కాశ్మీర్‌లోని బిజ్‌బెహరా, అనంత్‌నాగ్ సెంటర్, వాచీ, కుల్గామ్‌లోని దివ్సర్, షోపియాన్‌లోని కొన్ని ప్రాంతాలలో ఆమెకు సహాయపడతాయి. సాంప్రదాయకంగా ప్రభావం చూపుతుంది. అదేవిధంగా, పూంచ్, పూంచ్ హవేలీ, సూరంకోట్‌లలో కూడా PDP దాని సైద్ధాంతిక క్యాడర్ మద్దతును కలిగి ఉంది.
దివంగత ముఫ్తీ మహ్మద్ సయీద్ 2002 నుంచి 2005 వరకు J&K ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు, తన అభివృద్ధి ఎజెండాతో పాటు, అతను తరచుగా నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ, శ్రీనగర్- ముజఫరాబాద్ వాణిజ్యం సరిహద్దుగా మీదుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. అయితే, PDP ఇప్పుడు ఆ స్థాయి రాజకీయ శక్తిగా లేదు. బీజేపీతో పొత్తు తర్వాత ఆ పార్టీ తన సత్తాను చాలా వరకు కోల్పోయింది.
'అపవిత్ర కూటమి' ఖరీదు
2015 ప్రారంభంలో, దివంగత ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ఈ వ్యాసం రాస్తున్న నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పట్లో బిజెపితో తన పార్టీ పొత్తును "పారాడిగ్మ్ షిఫ్ట్"గా అభివర్ణించారు. మూడు సంవత్సరాల తరువాత, సయీద్ కుమారుడు తస్సాదుక్ ముఫ్తీ, ఢిల్లీకి చెందిన ఒక వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో..రెండు పార్టీలు అంత మంచివి కావు. ఇందుకోసం కాశ్మీర్ లోని ఒకతరం వారి రక్తాన్ని చిందించాల్సి రావచ్చు అన్నారు. 2018లో తిరిగి నాతోనే మాట్లాడుతూ.. బీజేపీతో పొత్తు పూర్తిగా జనాదరణ లేని నిర్ణయంగా అభివర్ణించారు.
నిజానికి, పీడీపీ, BJPతో "అపవిత్ర రాజకీయ పొత్తు" కుదుర్చుకుంది. జనవరి 2016లో తన తండ్రి మరణం తర్వాత కాషాయ పార్టీతో మరో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవాలని మెహబూబా తీసుకున్న నిర్ణయం ఆమె పార్టీకి "రాజకీయ ఆత్మహత్య" కంటే తక్కువ కాదని రుజువు చేసింది.
అప్పటి నుంచి పార్టీ వరుస దెబ్బలు తింది. హసీబ్ ద్రాబు, అల్తాఫ్ బుఖారీ, ఇమ్రాన్ రెజా అన్సారీ, బషారత్ బుఖారీ, అష్రఫ్ మీర్, రఫీ మీర్, మెహబూబాకు ఒకప్పుడు సన్నిహితుడు మాజీ ప్రధాన కార్యదర్శి పీర్ మన్సూర్ హుస్సేన్ సోహ్రవర్ధి వంటి ముఖ్యమైన నాయకులు పార్టీని వీడారు. అల్తాఫ్ బుఖారీ (అప్నీ పార్టీ), సజాద్ లోన్ నేతృత్వంలోని పీపుల్స్ కాన్ఫరెన్స్ (PC) నేతృత్వంలోని కొత్త రాజకీయ సంస్థలో చేరారు.
ఎన్నికల లెక్కలు
1999లో ముఫ్తీ మొహమ్మద్ సయీద్ స్థాపించిన పీడీపీ, 2002 J&K అసెంబ్లీ ఎన్నికలలో 16 అసెంబ్లీ సెగ్మెంట్‌లను గెలుచుకుంది. దాంతో అప్పటి వరకూ ఏకఛత్రాధిపత్యం చేస్తున్ననేషనల్ కాన్పరెన్స్ కు సవాల్ విసిరింది. అప్పట్లో ఆ పార్టీ ఓట్ల శాతం దాదాపు 10 శాతానికి చేరుకుంది. ఆరేళ్ల తర్వాత (2008) జరిగిన తదుపరి అసెంబ్లీ ఎన్నికలలో, PDP 21 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకుంది. ఓట్ల శాతం కూడా దాదాపు 10 నుంచి 15.3 శాతానికి పెంచుకుంది. రాజకీయ శక్తిగా దాని పనితీరు, ఖ్యాతిని మరింత పెంచుకుంటూ, 2014 ఎన్నికలలో PDP 28 అసెంబ్లీ సెగ్మెంట్లను గెలుచుకుంది, ఓట్ల వాటా దాదాపు 23 శాతానికి పెరిగింది.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ, బీజేపీల ఎన్నికల ఫలితాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. జమ్మూ ప్రాంతం నుంచి మొత్తం 25 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న బీజేపీ, ఓట్ల శాతాన్ని 23.1 శాతానికి పెంచుకుంది. అయితే, ఈ అసెంబ్లీ ఎన్నికలలో 21 శాతం ఓట్లతో 15 అసెంబ్లీ నియోజకవర్గాలను మాత్రమే గెలుచుకోవడం ద్వారా NC తన అతిపెద్ద ఎన్నికల ఓటమిని ఎదుర్కొంది, అయితే కాంగ్రెస్ పార్టీ 18 శాతం కంటే కొంచెం ఎక్కువ ఓట్లతో 12 స్థానాలను గెలుచుకుంది.
“కాశ్మీర్‌లో NC వర్సెస్ PDP గా ఉంది. సహజంగానే, మెహబూబా ముఫ్తీని ప్రధాన ప్రత్యర్థిగా భావించినందున PDPని ఎన్నికల రాజకీయాల నుంచి తప్పించాలని NC కోరుకుంది, ”అని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు నసీర్ అహ్మద్ ది ఫెడరల్‌తో అన్నారు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, అందుకే ఎన్‌సి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది, అయితే మెహబూబా "తన పార్టీ చెక్కుచెదరకుండా" దానితో పోరాడాలనుకుంటున్నారు.
ముందుకు వెళ్లే మార్గం..
పలు కారణాలు ఉన్నప్పటికీ అనంతనాగ్-రాజౌరీ పార్లమెంటరీ స్థానాన్ని NC లేదా గులాం నబీ ఆజాద్ నేతృత్వంలోని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (DPAP)కి 'మూన్వాక్' అని పేర్కొనలేము.
నిజానికి, కాంగ్రెస్-ఎన్‌సీ ఒప్పందం PDPకి ఎదురుదెబ్బ మాత్రమే కాదు. గులాంనబీ ఆజాద్ నేతృత్వంలోని పలు పార్టీలకు కూడా ఇది ఇబ్బంది కలిగించే పరిణామమనే చెప్పుకోవాలి.
అనంతనాగ్-రాజౌరీ LS సీటుకు మే 7న ఓటింగ్ జరుగుతుంది. ఇక్కడ నుంచే పీడీపీ అధినేత పోటీ చేస్తున్నారు. ఎన్సీ ఇక్కడ ప్రముఖ గుజ్జర్ నాయకుడు మియాన్ అల్తాఫ్‌ ను పోటీకి దింపింది. ఆయనకు ఇక్కడ మంచి పట్టు ఉంది. మెహబూబా ముఫ్తీ గత ఎన్నికల్లో ఇదే సీటును భారీ మెజార్టీతో గెలుచుకున్నారు.
దక్షిణ కాశ్మీర్, మధ్య కాశ్మీర్‌లో 2019లో ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంది. మొత్తంమీద, 2019 లోక్‌సభ ఎన్నికల్లో 72,02,163 (72 లక్షలు) ఓటర్లతో 20 రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. పోలైన 35,52,622 (35 లక్షలు) ఓట్లలో 35,30,883 మాత్రమే చెల్లుబాటు అయ్యేవిగా పరిగణించబడ్డాయి. జమ్మూ, ఉధంపూర్, లడఖ్‌లలో భారీ ఓటింగ్ (70 శాతానికి పైగా) కారణంగా 2019లో J&Kలో మొత్తం ఓటింగ్ శాతం 49.3 శాతంగా ఉన్నప్పటికీ, దక్షిణ కాశ్మీర్‌లో (8.98 శాతం), శ్రీనగర్‌లో (14.43 శాతం) ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంది. శాతం), బారాముల్లా 34.60 శాతం గా నమోదు అయింది.
2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 46 శాతం ఓట్లు రాగా, ఎన్‌సీ దాదాపు 29 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు, PDP కేవలం రెండు శాతం ఓట్ల వాటాను మాత్రమే పొందింది. పార్టీ స్థాపించిన తరువాత దాని అత్యంత దారుణమైన పనితీరు ఇది.
2024లో కీలక అంశాలు..
J&Kలో కాంగ్రెస్, NC ఎన్నికల కూటమిలో ఉన్నందున, ఈ రెండు పార్టీల సంప్రదాయ ఓట్లు అనంతనాగ్-రాజౌరీ LS సెగ్మెంట్‌లో NC మియాన్ అల్తాఫ్‌కు అనుకూలంగా కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది. మియాన్ అల్తాఫ్ రాజకీయ నాయకుడిగా ఆధ్యాత్మిక వ్యక్తిగా గుజ్జర్ సమాజంలో పలుకుబడిని కలిగి ఉన్నాడు. అదే సమయంలో, గులాం నబీ ఆజాద్ జాఫర్ మన్హాస్ ఖచ్చితంగా కొన్ని ఓట్లను కట్ చేస్తారు, ఇది PDPకి శరాఘాతమే.
కశ్మీర్‌లో ఎన్‌సీ ఆధిపత్యం
సెంట్రల్ కాశ్మీర్‌లో (శ్రీనగర్ ఎల్‌ఎస్ సీటు), ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ ఒక శక్తిగా కొనసాగుతోంది. ఒమర్ అబ్దుల్లా, అలీ సాగర్, నాసిర్ అస్లాం వానీ, తన్వీర్ సాదిక్ వంటి నాయకుల కారణంగా రాజధాని శ్రీనగర్‌లో పార్టీకి ప్రాబల్యం ఉంది, అయితే సెంట్రల్ కాశ్మీర్‌లోని బుద్గామ్ ప్రాంతంలో పార్టీకి ప్రభావవంతమైన షియా నాయకుడు అఘా రుహుల్లా మెహదీ ఉన్నారు.ఏది ఏమైనప్పటికీ, కాశ్మీర్ (అనంతనాగ్-రాజౌరీ , శ్రీనగర్) నుంచి కనీసం రెండు పార్లమెంటరీ స్థానాలను NC గెలుచుకుంటుంది. ఇదే జరిగితే పీడీపీ పరిస్థితి ఎలా ఉంటుందో కాలమే చెప్పాలి.
Read More
Next Story