‘జల్ జీవన్ మిషన్’ ను లఢాకీ లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
x

‘జల్ జీవన్ మిషన్’ ను లఢాకీ లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

లఢక్ లోని ఇంటింటికి మంచినీరు అందించే జల్ జీవన్ మిషన్ ను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. శీతల ఎడారి ప్రాంతమైన ఇక్కడ మంచినీటి పైపులైన్ లు వేస్తే..


కేంద్ర పాలిత ప్రాంతం లఢక్ లో వచ్చే నెల చివరి నాటికి జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి తాగు నీరు అందిస్తామని అధికారులు నమ్మకంగా చెబుతున్నారు. 2019 లో జమ్మూకాశ్మీర్ నుంచి లఢక్ ను వేరు చేశారు. అత్యంత కఠినమైన టెరెయిన్ గా పేరుపొందిన లఢక్ లో ఈ పని చేయడం అంతసులువుకాదు.

ప్రతి ఇంటికి ఫంక్షనల్ ట్యాప్ కనెక్షన్‌ను అందించాలనే ఐదేళ్ల క్రితం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి 2024 ఆగష్టుతో తీరిపోతుంది. అప్పట్లో ప్రధాని మోదీ హర్ ఘర్ నల్( ప్రతి ఇంటికి నల్లా నీరు) అందిస్తామని ప్రకటించారు. ఈ బహుమానం మాత్రం లఢాకీలకు నచ్చలేదు.

కుళాయి కనెక్షన్‌కి వ్యతిరేకంగా లడాఖీలు
“లడఖ్ చాలావరకు శీతల ఎడారి. నీటి సరఫరా కోసం మేము పూర్తిగా హిమానీనదాలు, నదులు, బుగ్గలు, జలపాతాల వంటి సహజ వనరులపై ఆధారపడతాము" అని లడఖ్‌లోని నుబ్రా వ్యాలీకి చివరలో ఉన్న తుర్టుక్ గ్రామ మాజీ సర్పంచ్ గులాం హుస్సెన్ వివరించారు.
ఈ గ్రామం పాకిస్తాన్ నుంచి కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. “శతాబ్దాలుగా, మా పూర్వీకులు జల్ జీవన్ అంటే ఏంటో బోధించారు – నీటి వనరులను పెంపొందించుకోండి, రోజువారీ అవసరాలకు అవసరమైనంత నీటిని మాత్రమే తీసుకోండి.
గ్రామాల్లోని ప్రధాన నీటి వనరులు, నీటి కాలువలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ప్రభుత్వం జల్ జీవన్‌ని మళ్లీ ఊహించుకుంటూ, పైప్‌డ్ వాటర్, ట్యాప్ కనెక్షన్‌లను పొందేలా ప్రతి ఒక్కరినీ బలవంతం చేస్తోంది,” అని అతను ది ఫెడరల్‌తో చెప్పాడు.
“ఈ కుళాయి కనెక్షన్లలో చాలా వరకు పనికిరానివి. చలికాలంలో అవి పని చేయవు, ఎందుకంటే ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉండటం వలన పైపులలో నీరు గడ్డకడుతుంది. ప్రతి వేసవిలో అవి పని చేస్తాయనే గ్యారంటీ ఉండదు, ఎందుకంటే పైప్‌లైన్‌లకు అనుసంధానించబడిన ప్రాంతంలో ఈ సంవత్సరం నీరు ఉండవచ్చు కానీ వచ్చే వేసవిలో ఎండిపోవచ్చు’’ అని అతను సవాలక్ష సందేహాలు లేవనెత్తారు.



ప్రభుత్వ గణాంకాలు
జల్ శక్తి మంత్రిత్వ శాఖ అధికారిక గణాంకాల ప్రకారం, లడఖ్‌లో 40,808 ఇళ్లు ఉన్నాయి. ఆగస్టు 2019లో, మోదీ జల్ జీవన్ మిషన్‌ను ప్రారంభించినప్పుడు, కేంద్రపాలిత ప్రాంతంలో కేవలం 1,414 గృహ కుళాయి కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి. ఐదు సంవత్సరాల తరువాత, లడఖ్‌లోని 38,067 గృహాలు – 93.28 శాతం – ఫంక్షనల్ గృహ కుళాయి కనెక్షన్‌లను (FHTC) పొందాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. గడచిన ఐదేళ్లలో, మిషన్ కింద పూర్తి సంతృప్తతను సాధించేందుకు కేంద్రపాలిత ప్రాంతం రూ.923 కోట్లకు పైగా కేంద్ర నిధులను ఖర్చు చేసింది.
చాలా మందికి, ఈ గణాంకాలు ప్రశంసనీయమైనవిగా కనిపిస్తాయి; ప్రమాదకరమైన స్థలాకృతికి పేరుగాంచిన శుష్క ప్రాంతంలో నీటి సరఫరా ప్రాథమిక సౌకర్యానికి గొప్ప మలుపు. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో లడఖ్‌ను జాబితా చేయడానికి కేంద్రం నిరాకరించడంపై ఇప్పటికే ఆందోళన చేస్తున్న స్థానికులు, జల్ జీవన్ మిషన్ “విధానం”, దాని అవసరం, సమర్థత గురించి లఢాకీలు ప్రశ్నలు సంధిస్తున్నారు.
ఢిల్లీ నుంచే..
జల్ జీవన్ మిషన్ తో లఢక్ లో మంచి కంటే చెడే ఎక్కువ జరిగే అవకాశం ఉందని ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచిన స్వతంత్ర లోక్ సభ అభ్యర్థి మహ్మద్ హనీఫా ది ఫెడరల్ తో అన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలుస్తూ ఇక్కడ కూడా కొన్ని పథకాలను అమలు చేస్తున్నారు. ఇక్కడి వాతావరణాన్ని, అవసరాలను పట్టించుకోవడం లేదని అన్నారు. కేంద్రపాలిత ప్రాంతం నలుమూలల నుంచి ప్రజలు ఈ పథకానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు.
“ఢిల్లీకి అర్థం కానటువంటి అనేక ఆచరణాత్మక ఆందోళనలు ఉన్నాయి. లడఖ్‌లోని మెజారిటీ సహజ నీటి వనరుల ద్వారా అందించబడుతుంది; ప్రతి గ్రామం సహజసిద్ధమైన నీటి కాలువలను కలిగి ఉంది. ప్రజలు ఈ మార్గాల నుంచి నీటిని వారి అవసరాలకు అనుగుణంగా మళ్లిస్తారు, అది గృహ లేదా వ్యవసాయ వినియోగానికి ఉపయోగిస్తున్నారు. ఇది హిమానీనదాలు, జలపాతాలు, నీటి బుగ్గల నుంచి నేరుగా వచ్చే నీరు కాబట్టి, ఇది త్రాగడానికి యోగ్యమైనది. లడఖ్‌లో నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల గురించి ఎవరైనా ఫిర్యాదు చేయలేరు, ” అని హనీఫా చెప్పారు.
అస్థిర నీటి వనరులు
లడఖ్ ఎంపీ మాట్లాడుతూ.. “జల్ జీవన్ ఏమి చేస్తుంది - మీరు సహజ నీటి వనరులను అడ్డుకుంటారు. ఇంటికి కుళాయి కనెక్షన్‌లను ఇవ్వడానికి పైప్‌లైన్‌లు వేస్తారు. రేపు, నీటి వనరు ఎక్కడైన కలుషితమైతే, మీరు ఆ కాలుష్యాన్ని అంతటా వ్యాప్తి చేస్తారు’’ అని పేర్కొన్నారు.



"రెండవది, మన నీటి వనరులు చాలా వరకు శాశ్వతమైనవి కావు, ఎందుకంటే కొన్ని చలికాలంలో గడ్డకట్టుకుపోతాయి, మరికొన్ని వాతావరణ మార్పులతో సహా వివిధ కారణాల వల్ల వేసవిలో ఎండిపోతాయి; కాబట్టి నీరు ఉన్న ప్రాంతం నుంచి పైప్‌లైన్ వేయడానికి ప్రభుత్వం కోట్లు ఖర్చు చేయవచ్చు. ఈ రోజు కానీ ఆరు నెలల తర్వాత, ఆ పైప్‌లైన్‌ వల్ల ఏ ప్రయోజనం ఉంటుంది?"
లడఖ్‌లోని నుబ్రా వ్యాలీలోని హుండర్ నివాసి ఇక్బాల్ జంషెడ్ మాట్లాడుతూ.. ఈ పథకం సరిగా లేదు. కొంతమంది కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చడానికే ఉపయోగపడుతుందని విమర్శించారు.
“ప్రభుత్వం ఇచ్చే పనికి కాంట్రాక్టర్ డబ్బు తీసుకుంటాడు. రెండు నెలల తరువాత లఢక్ లోని చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడి పైపులైన్లు ధ్వంసం అవుతాయి. మళ్లీ మేము నీటి కోసం హిమానీ నదాల మీద ఆధారపడాల్సి ఉంటుంది.తరువాత కాంట్రాక్టర్ కు ఎటువంటి బాధ్యత ఉండదు. మరో కాంట్రాక్టర్ ఈ పనిని తీసుకుంటారు.” అని జంషెడ్ చెప్పారు.
కాంట్రాక్టర్లకు లాభాలు..
జల్ జీవన్ పైప్‌లైన్‌ల ఏర్పాటులో మరో ప్రమాదకర పరిణామాన్ని హుస్సేన్ వివరించారు. ''చాలా ప్రాంతాల్లో కాంట్రాక్టర్లు భూగర్భ పైపులైన్లు వేయాలని కోరుతున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా లడఖ్‌లో పైప్‌లైన్‌లు భారీగా చెడిపోతున్నాయని ఏ లడాఖీకి తెలుసు. జల్‌ జీవన్‌ పైపులు డ్యామేజ్‌ ప్రూఫ్‌ అని ప్రభుత్వం చెబుతోంది కానీ అది వాస్తవం కాదు.
"కాంట్రాక్టర్లు భూగర్భ పైప్‌లైన్‌ల కోసం ఈ డ్యామేజ్-ఫ్రీ పైపు సాకును ఉపయోగించారు, ఎందుకంటే ఇది ప్రాజెక్ట్ ఖర్చును పెంచుతుంది. ఆపై వారు మా గ్రామాలను - రోడ్లు, వ్యవసాయ క్షేత్రాలు, ప్రతిదీ తవ్వారు. కొన్ని నెలల్లో పైపులకు మరమ్మతులు లేదా నిర్వహణ అవసరం అయినప్పుడు, వారు మళ్లీ వచ్చి ఊరంతా తవ్వి తీయడం వల్ల గ్రామస్తులే బాధపడ్డారు." అని హుస్సేన్ చెప్పాడు.
జల్ జీవన్ పైప్‌లైన్‌లు ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోవడం లేదా కొండచరియలు విరిగిపడడం అనేది లడఖ్‌లో ఒక సాధారణ ఫిర్యాదు అని, రెండు సంవత్సరాలుగా మిషన్ అమలులో నిమగ్నమై ఉన్న UT యొక్క పరిపాలనలోని ఒక సీనియర్ అధికారి అంగీకరించారు.
నీటి లైన్లకు నష్టం
“ఈ నెల ప్రారంభంలోనే ఖాల్ట్సేలోని టైమ్స్‌గామ్ గ్రామంలో కొండచరియలు విరిగిపడటం వల్ల హెచ్‌డిపిఇ పైపుల (హై డెన్సిటీ పాలిథిలిన్ పైపులు, జల్ జీవన్ మిషన్ కింద లడఖ్‌లో పైపుల లోపల నీరు గడ్డకట్టకుండా నిరోధించడానికి ఉపయోగిస్తారు) దెబ్బతిన్నాయి.
నీటి సరఫరాకు అంతరాయం కలిగింది. "మా బృందం కొత్త పైపులైన్లు వేయడం ద్వారా సరఫరాను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తోంది, అయితే ఇది లడఖ్ అంతటా ఒక సాధారణ సవాలు. జల్ జీవన్ పైప్‌లైన్‌లు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అనేదానిపై మేము నిరంతరం నిఘా ఉంచాలి; అవి కొట్టుకుపోయినా లేదా పాడైపోయినా నీటి సరఫరాకు అంతరాయం తప్పదని ఓ అధికారి ఫెడరల్ కు చెప్పారు.
“జల్ జీవన్ మిషన్ కాలపరిమితితో కూడిన పథకం. దాని కింద ఉన్న అన్ని పనులు ఈ సంవత్సరంలోనే పూర్తి చేయబడతాయి. మిషన్ పూర్తయిన తర్వాత, మరమ్మతు, నిర్వహణ పనులపై స్థానిక యంత్రాంగం ఎంత అప్రమత్తంగా ఉంటుందో మాకు తెలియదు. కొన్ని సంవత్సరాలలో ఈ పైప్‌లైన్‌లన్నీ ధ్వంసమై ఎఫ్‌హెచ్‌టిసి నెట్‌వర్క్‌కు జోడించబడిన వేలాది గృహాలకు నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతుందనే భయం మాత్రం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
పథకం అమలు సమస్యలు..
లఢక్ లోని త్యక్షి గ్రామ నివాసి అయినా అబ్దుల్లా మాట్లాడుతూ.. అనేక ప్రాంతాల్లో హర్ ఘర్ నాల్ వాగ్దానం ఒక ప్రహసనమని అభిప్రాయపడ్డారు. “ఈ పథకం మంచిదే కావచ్చు. లడఖ్‌లో ఇంటింటికి తాగునీరు అందడం అధ్వాన్నంగా ఉందని తిరస్కరించడం లేదు, కానీ మిషన్ అమలు చేస్తున్న విధానం సరైనది కాదు. కాగితంపై, ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చామని వారు చెప్పుకోవడానికి మాత్రమే పనికి వస్తుందన్నారు.
"ఇతర ప్రాంతాలలో, పైప్‌లైన్ వచ్చింది, కానీ గ్రామం మొత్తానికి ఒకటి లేదా రెండు సాధారణ కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. అక్కడ నుంచి నీటిని తీసుకోవడానికి ప్రజలు బారులు తీరాలి. ప్రతి ఒక్కరు కమ్యూనిటీ కుళాయి వద్ద వరుసలో ఉండి మన సమయాన్ని ఎందుకు వృథా చేయాలనుకుంటున్నాము? గ్రామంలో నీటి కాలువలు ఉన్నాయి; మనం నీటిని పొందడానికి బయటకు వెళ్లవలసి వస్తే, మనం వెళ్లి కుళాయి వద్ద క్యూలో నిలబడే ఫ్రీ గా నీటిని తీసుకోవచ్చు, ”అని అబ్దుల్లా ది ఫెడరల్‌తో అన్నారు.
లడఖీ నిపుణులను విస్మరించడం
హనీఫా దృష్టిలో, మిషన్‌తో ఉన్న ఇతర సమస్య ఏమిటంటే, దాని భావన.. అమలు రెండూ “లడఖ్‌లోని విషయ నిపుణుల అభిప్రాయాలను మినహాయించాయి”. “ఇటువంటి పథకాలకు తప్పనిసరిగా లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (LAHDC), డొమైన్ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు అవసరం కానీ ఇక్కడ అలా జరగలేదు. LAHDC అభిప్రాయాలను ఢిల్లీ లేదా లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌తో కలిసి పనిచేస్తున్న అధికారులు కూడా పరిగణనలోకి తీసుకోలేదు.
"జల్ జీవన్ మిషన్ కోసం, వారు మొదట మన నీటి వనరులు, రుతుపవనాలు.. ఇతర కాలానుగుణ కారకాలు, భౌగోళిక సవాళ్లను విస్తృతంగా పరిశోధించి, ఆపై లడాఖీలను విశ్వాసంలోకి తీసుకోవాలి. అవేవి లేకుండా పథకాన్ని అమలు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు వారు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు నిరంతరం సమీక్షలు చేస్తున్నారు, ”అని హనీఫా అన్నారు.
Read More
Next Story