నేడు నివేదిక సమర్పించనున్న ‘కోవింద్’ కమిటీ
x
మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

నేడు నివేదిక సమర్పించనున్న ‘కోవింద్’ కమిటీ

దేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలనే అంశంపై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటు అయిన కమిటీ నేడు తన నివేదికను సమర్పించనుంది.


వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటు ఆయిన అత్యున్నత స్థాయి కమిటి ఈ రోజు తన నివేదికను సమర్పించునున్నారని తెలిసింది. ఈ రోజు మధ్యాహ్నం తరువాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు తన నివేదికను సమర్పిస్తుందని జాతీయ మీడియా వార్తలు ప్రసారం చేసింది.

కమిటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాజ్యసభలో మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే సభ్యులు గా ఉన్నారు.
సెప్టెంబరు 2023లో ఏర్పాటైన ఈ కమిటీ, ప్రస్తుత రాజ్యాంగ ఫ్రేమ్‌వర్క్‌ను దృష్టిలో ఉంచుకుని, లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం కోసం పరిశీలించి, సిఫార్సులు చేయనుంది. అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ప్రాంతీయ పార్టీలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశాయి.
ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు మైనారిటీలో పడిపోయినప్పుడు తిరిగి ఎన్నికలు ఎంత కాలానికి నిర్వహించాలి. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు అంటూ తమ అభ్యంతరాలను కమిటీ ముందు లెవనెత్తాయి. తాము వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు వ్యతిరేకం అని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ ఇప్పటికే తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అలాగే ఎస్పీ, బీఎస్పీ తో పాటు సీపీఐ వంటి పార్టీలు సైతం దీనిని వ్యతిరేకించాయి.
అయితే కొంతమంది న్యాయనిఫుణులు చెబుతున్న ప్రకారం రాజ్యాంగంలోని కొన్ని భాగాలకు సవరణ చేస్తే ఏకకాలంలో దేశ వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించవచ్చుని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం కూడా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే ఖర్చు తగ్గడంతో పాటు చీటిమాటికి ఎన్నికలు కోడ్ రావడం వల్ల అభివృద్ది ప్రక్రియకు కుంటుపడుతోందని, ఓటు బ్యాంకు రాజకీయాలు దేశాన్ని శాసిస్తున్నాయని భావిస్తోంది.


Read More
Next Story