విపక్షాల నిరసనల ముందు మూగబోయిన  ప్రధాని స్వరం
x

విపక్షాల నిరసనల ముందు మూగబోయిన ప్రధాని స్వరం

లోక్ సభ లో ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే ఈ యుద్దంలో విజయం మాత్రం ప్రతిపక్షానికి దక్కిందని చెప్పవచ్చు.


లోక్ సభ లో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య ప్రత్యక్ష పోరుకు రంగం సిద్ధమైంది. ఇరువురు నేతలు సభలో వెనక్కి తగ్గడానికి ఇష్టపడలేదు. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన మొదటి పార్లమెంట్ సమావేశాల పరిణామాలు వచ్చే ఐదేళ్ల సభ దృశ్యాలు ముందే రివీల్ అయ్యాయని చెప్పవచ్చు. బీజేపీ, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి మధ్య రాజీ ఉండదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పవచ్చు. రెండు వర్గాల మధ్య జరిగిన ఈ విభజన తిరిగి కలపడానికి వీలులేనంతగా ఉంది.

ప్రధాని ప్రసంగానికి పదే పదే అడ్డంకులు..
లోక్ సభ లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ఆపడానికి ఇండి కూటమి ఆపడానికి ప్రయత్నించిందని స్పష్టంగా అర్థమైంది. ఇందుకోసం ముందే పక్కా ప్రణాళికతో వచ్చింది. ప్రధాని ప్రసంగం సభ లో దాదాపు 135 నిమిషాల పాటు సాగింది. ఇందులో ఆయన ప్రసంగం ప్రజలు వినకుండా ఉండటానికి అరుపులు, గోలలు చేసిన విపక్షాలు ప్రజలకు సభ లో ప్రధాని ప్రసంగాన్ని వినడానికి అవకాశం ఇవ్వవద్దనే స్పష్టతతో ఉన్నారు. దీనిపై ప్రధాని మోదీ ఓ దశలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సభ లో ఆగ్రహం వ్యక్తం చేయడం ఇది మొదటి సారి. ఇక్కడ అధికార పార్టీ క్షీణించినట్లు కనిపిస్తోంది.
రాజకీయ గొడవలు
లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ- కాంగ్రెస్ మధ్య కనిపించిన రాజకీయ పోరు ప్రధాని సభలో ప్రసంగించడంలో మరోసారి తెరపైకి తెచ్చింది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలతో సహా ప్రతిపక్ష పార్టీల సంఖ్యా బలం పెరగడంతో మోదీ తొలిసారిగా ప్రతిపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ గొడవ విరామం లేకుండా కొనసాగడంతో, ప్రతిపక్ష సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను ప్రధాని మోదీ కోరారు.
“బీజేపీకి ఉన్న సమస్య ఏమిటంటే, ప్రతిపక్షాలైన కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీల నుంచి ఎంపీల సంఖ్య పెరగడాన్ని అది ఊహించలేదు. విపక్షాలకు వ్యతిరేకంగా బిజెపికి సరైన ప్రణాళిక లేదని స్పష్టమైంది, అయితే ప్రధాని మోదీని ఎదుర్కోవడానికి ఇండి గ్రూప్ సభ్యులు బాగా సిద్ధమయి వచ్చారని అర్థమైంది. రెండు గంటలకు పైగా ప్రతిపక్షాల సంఖ్యాబలానికి వ్యతిరేకంగా బీజేపీకి ఎలాంటి స్పందన కనిపించలేదు.” అని రచయిత సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (CSDS) ప్రొఫెసర్ అభయ్ దూబే ఫెడరల్‌తో అన్నారు.
ప్రభుత్వ కోర్టులో బంతి
ఓం బిర్లా ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించి, వరుసగా రెండోసారి లోక్‌సభ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటికీ, పోరుబాట పట్టిన ప్రతిపక్షాలను అదుపు చేయడంలో ఆయన నిస్సహాయంగా కనిపించారు. పార్లమెంట్ నిబంధనల ప్రకారం సభ ను నిర్వహించడం ప్రభుత్వ బాధ్యత. ‘ప్రధానిని ఢీకొట్టడానికి’ తమ వద్ద సంఖ్యాబలం ఉందని ప్రతిపక్షాలు స్పష్టం చేస్తుండగా, వచ్చే ఐదేళ్లపాటు లోక్‌సభలో పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై బీజేపీ కసరత్తులు చేయాల్సిన అవసరం ఉంది.
“బిజెపి నాయకులు కూర్చొని పరిస్థితిని పునరాలోచించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే సభను నడపడానికి ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలో కేంద్రం బాధ్యత వహిస్తుంది. ప్రతిపక్షం, ప్రభుత్వానికి సాయం చేయమని కోరవచ్చు, కానీ అది చేయవలసిన అవసరం లేదు. ప్రభుత్వం ఇందుకు కృషి చేయవలసి ఉంది. దేశంలో రాజకీయ పరిస్థితులు మారాయని ప్రతిపక్షాలు స్పష్టమైన సంకేతాలను ఇచ్చాయి, ”అని దూబే వివరించారు.
అవకాశం కోల్పోయింది
దాదాపు రెండు గంటలపాటు సాగిన ప్రధాని ప్రసంగంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, దాని అధినేత రాహుల్ గాంధీపై దృష్టి సారించింది. వచ్చే ఐదేళ్లలో ఏం చేయాలనుకుంటున్నారో స్పష్టమైన ఆర్థిక ప్రణాళికను ఇవ్వడానికి కేంద్రం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
నీట్ పరీక్షలు, పేపర్ లీక్‌లు, అగ్నివీర్ స్కీమ్ వంటి కీలకమైన అంశాల గురించి ప్రధానమంత్రి మాట్లాడినప్పటికీ, ఈ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం కచ్చితమైన కార్యాచరణ ప్రణాళిక బిజెపి తన స్వంత ఓటర్ల సంఖ్యను మించి చేరుకోవడానికి సహాయపడగలదు.
Read More
Next Story