రాష్ట్రపతికి నివేదిక సమర్పించిన రామ్ నాథ్ కోవింద్ కమిటీ
x

రాష్ట్రపతికి నివేదిక సమర్పించిన రామ్ నాథ్ కోవింద్ కమిటీ

దేశ వ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే విషయంలో సాధ్యసాధ్యాలను పరిశీలించేందుకు ఏర్పాటు అయిన రామ్ నాథ్ కోవింద్ కమిటీ గురువారం రాష్ట్రపతి ముర్ముకు నివేదిక..


దేశ వ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ గురువారం (మార్చి 14) రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు నివేదికను సమర్పించింది. దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే సాధ్యాసాధ్యాలపై తన నివేదికను సమగ్రంగా ఇందులో సిఫార్సు చేసింది.

ప్యానెల్ 18,626 పేజీలతో కూడిన నివేదికను రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 2, 2023 నాటి రాజ్యాంగం నుండి 191 రోజుల పాటు రాజకీయ నాయకులు, నిపుణులు, పరిశోధనా పనితో విస్తృతమైన సంప్రదింపుల ఫలితంగా ఈ నివేదిక రూపొందించబడింది.

కమిటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాజ్యసభలో మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే సభ్యులు గా ఉన్నారు.
సెప్టెంబరు 2023లో ఏర్పాటైన ఈ కమిటీ, ప్రస్తుత రాజ్యాంగ ఫ్రేమ్‌వర్క్‌ను దృష్టిలో ఉంచుకుని, లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం కోసం పరిశీలించి, సిఫార్సులు చేయనుంది. అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ప్రాంతీయ పార్టీలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశాయి.
ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు మైనారిటీలో పడిపోయినప్పుడు తిరిగి ఎన్నికలు ఎంత కాలానికి నిర్వహించాలి. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు అంటూ తమ అభ్యంతరాలను కమిటీ ముందు లెవనెత్తాయి. తాము వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు వ్యతిరేకం అని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ ఇప్పటికే తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అలాగే ఎస్పీ, బీఎస్పీ తో పాటు సీపీఐ వంటి పార్టీలు సైతం దీనిని వ్యతిరేకించాయి.
అయితే కొంతమంది న్యాయనిఫుణులు చెబుతున్న ప్రకారం రాజ్యాంగంలోని కొన్ని భాగాలకు సవరణ చేస్తే ఏకకాలంలో దేశ వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించవచ్చుని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం కూడా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే ఖర్చు తగ్గడంతో పాటు చీటిమాటికి ఎన్నికలు కోడ్ రావడం వల్ల అభివృద్ది ప్రక్రియకు కుంటుపడుతోందని, ఓటు బ్యాంకు రాజకీయాలు దేశాన్ని శాసిస్తున్నాయని భావిస్తోంది.
Read More
Next Story