రాహుల్ గాంధీ ఇప్పుడు క్షమాపణ చెబుతారా: బీజేపీ
x

రాహుల్ గాంధీ ఇప్పుడు క్షమాపణ చెబుతారా: బీజేపీ

నీట్ పరీక్ష లో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తరువాత రాహుల్ గాంధీపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.


నీట్ పునఃపరీక్ష కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. భారత పరీక్ష విధానంపై తనకు విశ్వాసం లేదని ఇంతకుముందే రాహూల్ గాంధీ ప్రకటనపై ఇప్పుడు బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నీట్ పరీక్షపై సుప్రీంకోర్టు తీర్పు తరువాత అయినా రాహుల్ గాంధీ క్షమాపణ చెబుతారా? అని ప్రశ్నించింది.

పరీక్షను రద్దు చేసి మళ్లీ ఎగ్జామ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లను ఉన్నత న్యాయస్థానం మంగళవారం తోసిపుచ్చింది. పేపర్ లీకేజీ విస్తృత స్థాయిలో జరగలేదని, కేవలం రెండు నగరాల్లోనే లీక్ జరిగిందని కోర్టు పేర్కొంది. దోషులంతా దొరికారని అందువల్ల పరీక్ష తిరిగి నిర్వహించడం కుదరదని ప్రకటించింది.
దేశ పరువు తీయడం
బిజెపి నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ... తన మాటలతో ప్రపంచ వ్యాప్తంగా భారత పరువును తీయడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తీర్పు తరువాత ప్రతిపక్షాలపై ఆయన మాటల తూటాలు పేల్చారు. రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు.. పార్లమెంట్ గౌరవానికి, ప్రతిపక్ష నాయకత్వానికి భంగం కలిగించిందని ప్రసాద్ అన్నారు.
బడ్జెట్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కూడా రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుర్చీ బచావో బడ్జెట్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదన్నారు. ఎన్నికల్లో ప్రజలు తనను, తన పార్టీని పదే పదే తిరస్కరించినట్లు చెప్పిన ఆయన, ఇది బీజేపీ తప్పు కాదని అన్నారు.
సీబీఐ విచారణ
నీట్ వరుసపై ప్రభుత్వ చర్యను సమర్థించిన ఆయన, ఈ విషయంలో దర్యాప్తును సీబీఐకి అప్పగించామని, 155 మంది పరీక్షకుల అభ్యర్థిత్వాన్ని రద్దు చేసినట్లు బీజేపీ నాయకుడు చెప్పారు. 571 నగరాల్లోని 4,750 కేంద్రాల్లో 23.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు.
అయితే రెండు పరీక్ష కేంద్రాల్లో పేపర్ లీక్ జరిగిందని, కానీ రాహుల్ గాంధీ మోసం వంటి పదాలను ఉపయోగించి విద్యార్థులను గందరగోళంలో పడేశారని విమర్శించారు. ఇప్పుడు కోర్టు అలాంటిదేం లేదని, నీట్ రద్దు చేయలేదని చెప్పారు.‘‘రాహుల్ గాంధీ క్షమాపణ చెబుతారా...’’ అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాల హయాంలో పేపర్ లీకేజీలు జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.పేపర్ లీక్ ఘటనలకు వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం పటిష్టమైన చట్టాన్ని రూపొందించిందని ఆయన పేర్కొన్నారు.
Read More
Next Story