మీ పిటిషన్ ను  అత్యవసరంగా విచారించలేము: సుప్రీంకోర్టు
x
సుప్రీంకోర్టు

మీ పిటిషన్ ను అత్యవసరంగా విచారించలేము: సుప్రీంకోర్టు

తమిళనాడు పిటిషన్ పై ఉన్నత న్యాయస్థానం స్పందన


కేంద్రం తీసుకొచ్చిన కొత్త జాతీయ విద్యావిధానం ప్రకారం తమిళనాడు రాష్ట్రానికి నిలిపివేసిన విద్యా నిధులను వెంటనే విడుదల చేయాలని ఆ రాష్ట్రం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ఈ పిటిషన్ లో అత్యవసరంగా విచారించాల్సిన అంశాలు లేవని పేర్కొంది.

2024-25 సంవత్సరానికి సమగ్ర శిక్ష పథకం కింద తమ రాష్ట్రానికి రూ. 2,151 కోట్లు పైగా నిధులు రావాల్సి ఉందని తమిళనాడు తన పిటిషన్ లో పేర్కొంది. 2024, 2025 సంవత్సరానికి గాను కేంద్రం నిధులు నిలిపివేసిందని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మే నెలలో పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని న్యాయమూర్తులు ప్రశాంత్ కుమార్ మిశ్రా, మన్మోహన్ లతో కూడిన ధర్మాసనం గమనించింది.
అత్యవసరం కాదు..
‘‘ ఈ పిటిషన్ లో ఎటువంటి అత్యవసరం అంశాలు లేవు. వేసవి సెలవులు తరువాత దీనిని చేపట్టవచ్చు’’ అని ధర్మాసనం పేర్కొంది. మే నెలలో నిధులు నిలిపివేసినట్లు ఆరోపిస్తూ కేంద్రంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
కేంద్ర విద్యామంత్రిత్వ శాఖకు వ్యతిరేకంగా డీఎంకే ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 ని ప్రస్తావించింది. రాజ్యాంగంలోని ఈ అధికరణ ప్రకారం.. కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదాలను విచారించడానికి సుప్రీంకోర్టుకు ప్రత్యేకంగా అధికారాన్ని ఇస్తుంది.
జాతీయ విద్యావిధానం 2020, దానికి సంబంధించిన పీఎం శ్రీ పాఠశాలల పథకాన్ని, ముఖ్యంగా వివాదాస్పద త్రిభాషా సూత్రాన్ని కేంద్రం తీసుకు రాగా, తమిళనాడు దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది.
దావాలో ప్రస్తావించిన అంశాలు..
తమిళనాడులో త్రిభాష విధానం అమలు కోసం కేంద్రం, రాష్ట్రం మధ్య అధికారిక ఒప్పందం కుదిరే వరకూ జాతీయ విద్యావిధానం, పీఎం శ్రీ పథకాల విషయంలో రాష్ట్రం కట్టుబడి ఉండకుండా ప్రకటించాలని, అందుకు తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు.
సమగ్ర శిక్ష పథకం కింద నిధులు పొందడం తమిళ హక్కును జాతీయ విద్యా విధానం- 2020, పీఎం శ్రీ పథకాల అనుసంధానం రాజ్యాంగ విరుద్దం, చట్ట విరుద్దమని ప్రకటించాలని సైతం కోరింది.
ఫిబ్రవరి 23, 2024, మార్చి 7, 2024 తేదీలలో కేంద్రం పంపిన లేఖలు కూడా చట్టవిరుదమైనవిగా ప్రకటించాలని పిటిషన్ లో సుప్రీంకోర్టును కోరింది. వీటికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉండవని ప్రకటించాలని కూడా కోరింది.
‘‘నిర్ణీత కాలపరిమితి లోపు తమకు రావాల్సిన రూ. 2,291 కోట్లు చెల్లించాలని కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్ లో కోరింది. అలాగే ప్రధాన మొత్తం అయిన 2,151 కోట్లపై మే 1, 2025 నుంచి కోర్టు ఆదేశాలు వచ్చే వరకూ సంవత్సరానికి ఆరు శాతం వడ్డీ కూడా చెల్లించాలి’’ అని పిటిషన్ లో కోరింది.
కేంద్రం ఆమోదం..
విద్యా మంత్రిత్వ శాఖ ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డ్ (పీఏబీ) 2024- 25 ఆర్థిక సంవత్సరానికి తమిళనాడుకు మొత్తం రూ. 3, 585 కోట్ల వ్యయాన్ని ఆమోదించింది. దీనిలో కేంద్ర ప్రభుత్వం వాటా 60 శాతం, ఇందులో 2,151 కోట్లుగా నిర్ణయించింది. ఈ ఆమోదం ఉన్నప్పటికీ కేంద్రం ఇంకా ఎటువంటి వాయిదాలు విడుదల చేయలేదని తన పిటిషన్ లో పేర్కొంది.
కేంద్రం ఈ నిధుల విడుదల చేయడానకి జాతీయ విద్యావిధానం- 2020 పూర్తి అమలు, పీఎం శ్రీ పాఠశాలల పథకానికి అనుసంధానించిందని పేర్కొంది. ఈ షరతులు సమగ్ర శిక్ష పథకంలో భాగం కావు లేదా అంగీకరించలేదని పేర్కొంది.
ఈ నిధులు విడుదల కాకపోవడం వల్ల కలిగే ప్రభావాన్ని ప్రస్తావిస్తూ ఉపాధ్యాయులు, సహయక సిబ్బందికి జీతాలు చెల్లించడం చాలా కీలకమని పిటిషన్ లో పేర్కొన్నారు.
ఇది విద్యార్థులకు అందించే విద్య నాణ్యతను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. తదుపరి తరంపై ఈ ప్రభావం పడి సామాజిక అభివృద్ది కుంటుపడుతుందని తన పిటిషన్ లో పేర్కొంది.
Read More
Next Story