దర్యాప్తు సంస్థలకు సహాయకారిగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్
x

దర్యాప్తు సంస్థలకు సహాయకారిగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్

విమానం కూలిన ప్రాంతానికి చేరుకున్న టీం సభ్యులు..


Click the Play button to hear this message in audio format

గుజరాత్(Gujarat) రాష్ట్రం అహ్మదాబాద్‌(Ahmadabad)లో చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదంలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విధితమే. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఇప్పటికే ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, డీజీసీఏ, అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఇప్పటికే రంగంలోకి దిగారు. దర్యాప్తు సంస్థలకు సహాయకారిగా ఉండడం కోసం నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జి) టీంను రప్పించారు. ఇటు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు శుక్రవారం మేఘానినగర్‌లోని ప్రమాద స్థలాన్ని సందర్శించారు.

గురువారం మధ్యాహ్నం 242 మంది ప్రయాణికులతో అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం - బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ ఆకాశంలోకి ఎగిరిన కొద్ది నిముషాలకే మేఘనినగర్ ప్రాంతంలోని ఒక వైద్య కళాశాల భవన సముదాయంపైకి కూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది, కాలేజీ బిల్డింగ్‌పై పడిపోవడంతో 24 మంది కూడా చనిపోయారు. ఒక్క ప్రయాణికుడు రమేష్ విశ్వకుమార్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్న ఆయనను ప్రధాని మోదీ పరామర్శించిన విషయం తెలిసిందే. విమానం కూలిన వెంటనే ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ సీటుకు దగ్గరగా ఉన్న తన సీటు ఊడిపోవడం వల్ల దూరంగా విసిరివేయబడడంతో ప్రాణాలతో బయటపడ్డానని విశ్వకుమార్ చెప్పారు.

Read More
Next Story