NEET UG - 2025 ఫలితాల విడుదల..
x

NEET UG - 2025 ఫలితాల విడుదల..

టాపర్‌గా రాజస్థాన్‌కు చెందిన మహేష్‌ కుమార్‌..


Click the Play button to hear this message in audio format

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ NEET (UG)-2025 ప్రవేశ పరీక్ష ఫలితాలు శనివారం (జూన్ 14) విడుదలయ్యాయి. రాజస్థాన్‌కు చెందిన మహేష్ కుమార్ టాపర్‌గా నిలవగా.. మధ్యప్రదేశ్‌కు చెందిన ఉత్కర్ష్ అవధియా రెండో స్థానంలో, మహారాష్ట్రకు చెందిన కృషాంగ్ జోషి మూడో స్థానంలో నిలిచారు.

పరీక్ష రాసిన 22 లక్షల మంది..

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మే 4న దేశంలోని 552 నగరాలు, 14 అంతర్జాతీయ నగరాల్లో ఈ పరీక్ష నిర్వహించింది. 22 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. 22.76 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 22.09 లక్షల మంది హాజరయ్యారు.

మొత్తం 12,36,351 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరిలో పురుష అభ్యర్థులు 5,14,063 మంది కాగా మహిళా అభ్యర్థులు 7,22,462 మంది ఉన్నారు. ఒక్క ఉత్తరప్రదేశ్ నుంచి 3.33 లక్షల మంది పరీక్షకు హాజరు కాగా, అత్యధికంగా 1.7 లక్షల మంది అర్హత సాధించారు. ఇక మహారాష్ట్ర నుంచి దాదాపు 1.25 లక్షల మంది, రాజస్థాన్ నుంచి 1.19 లక్షల మంది అర్హత సాధించారు.

NTA ర్యాంక్‌ ఆధారంగా విద్యార్థులు MBBS/BDS కోర్సుల్లో ప్రవేశం పొందుతారు. కౌన్సెలింగ్ షెడ్యూల్‌ తేదీలను త్వరలో ప్రకటించనున్నారు.

Read More
Next Story