తత్కాల్ బుకింగ్‌కు OTP తప్పనిసరి..
x

తత్కాల్ బుకింగ్‌కు OTP తప్పనిసరి..

దురంతో, వందే భారత్ సహా మరో 13 రైళ్లల్లో ఈ విధానం అమల్లోకి..


Click the Play button to hear this message in audio format

తత్కాల్(Tatkal) టికెట్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది సెంట్రల్ రైల్వే (సీఆర్). డిసెంబర్ 6వ తేదీ నుంచి ఓటీపీ ఆధారిత విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ విధానం ప్రకారం.. ప్రయాణీకులు బుకింగ్ సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్‌కు వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) వస్తుంది. అది ఎంట్రీ చేస్తేనే టికెట్ జారీ అవుతాయి. దురంతో, వందే భారత్ సహా మరో 13 రైళ్లల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ విధానం ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT)-హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలుకు డిసెంబర్ 5 నుంచే అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. కాగా డిసెంబర్ 1 నుంచే పూణే-హైదరాబాద్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌కు ఈ విధానం అమల్లో ఉన్న విషయం తెలిసిందే.

కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) కౌంటర్లు, అధీకృత ఏజెంట్లు, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న తత్కాల్ టిక్కెట్లకు ఈ కొత్త వ్యవస్థ వర్తిస్తుందని CR ఒక ప్రకటనలో తెలిపింది. పారదర్శకతను పెంపొందించడం, దుర్వినియోగాన్ని అరికట్టడం, నిజమైన ప్రయాణీకులు మాత్రమే తత్కాల్ కోటాను పొందడమే లక్ష్యంగా ఈ విధానం తీసుకువచ్చినట్లు సెంట్రల్ రైల్వే పేర్కొంది.

Read More
Next Story