అధికారం అక్కడ.. సంబరాలు ఇక్కడ..

కాంగ్రెస్, బీజేపీ కార్యాలయాల్లో సందడి


అధికారం అక్కడ.. సంబరాలు ఇక్కడ..
x
విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం

కాంగ్రెస్, బీజేపీ కార్యాలయాల్లో సందడి

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ సాధించిన విజయం ఏపీలో సంబరాలకు దారి తీసింది. అధికారం అక్కడైతే ఇక్కడ సంబరాలేంటనుకుంటున్నారా.. అదే మిత్రులకు సంఘీభావం. మా పార్టీ దేశంలో ఎక్కడ గెలిచినా మేము విజయం సాధించినట్లేననే ఆనందంలో కాంగ్రెస్, బీజేపీలు ఉన్నాయి. ఈ రెండు పార్టీలు ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క సీటును కూడా సాధించలేని స్థితిలో ప్రస్తుతం ఉన్నాయి. అయినా పార్టీని నమ్ముకుని ఉన్న వారిలో ఆనందం తాండవించింది. ఇక్కడ కాకపోయినా అక్కడ మా గెలుపు ఇక్కడ గెలుపుగానే భావిస్తామనే భావన వారిలో కనిపించింది. విజయవాడలోని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షరాలు దగ్గుబాటి పురందేశ్వరి నేతృత్వంలో సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులకు ఆంధ్రరత్న భవన్‌ వేదికైంది. రాహుల్‌ గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడం, తెలంగాణలో 8సీట్లు బీజేపీకి రావడంతో ఆనందాన్ని బీజేపీ వారు ఆపుకోలేపోయారు. పార్టీ కార్యాలయం ఎదుట స్టెప్పులేశారు.


Next Story