బస్సు కిందకు చొచ్చుకెళ్లిన ఆటో.. పదో తరగతి విద్యార్థి మృతి
x

బస్సు కిందకు చొచ్చుకెళ్లిన ఆటో.. పదో తరగతి విద్యార్థి మృతి

రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. ప్రతి రోజూ రోడ్డు ప్రమాదాలకు ఎవరో ఒకరు బలవుతున్నారు.


రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. ప్రతి రోజూ రోడ్డు ప్రమాదాలకు ఎవరో ఒకరు బలవుతున్నారు. ఈరోజు హబ్సిగూడలో జరిగిన రోడ్డు ప్రమాదానికి ఓ పదో తరగతి విద్యార్థిని బలైంది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెప్తున్నారు.

అసలేం జరిగిందంటే..

ప్రతి రోజు తరహాలోనే స్కూల్ వెళ్లేందుకు సాత్విక అనే పదో తరగతి విద్యార్థిని ఉదయం 7:30 గంటలకు ఆటోలో ఇంటి నుంచి బయలుదేరింది. హబ్సిగూడ కూడలికి చేరుకున్న సమయంలో వారి ఆటోను వేకాల నుంచి ఓ లారీ ఢీకొట్టింది. దీంతో ఆటో.. ఎదురుగా ఉన్న ఆర్టీసీ బస్సు కిందకు చొచ్చుకు పోయింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్, సాత్వికకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు వెంటనే క్రేన్ సహాయంతో బస్సును లేపి పక్కకు పెట్టారు. వెంటనే సాత్విక, ఆటో డ్రైవర్‌ను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాత్విక తుదిశ్వాస విడిచింది. మరోవైపు ఆటో డ్రైవర్ పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.

అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్ కోసం వెతుకులాట ప్రారంభించారు. ప్రమాదం గురించిన సమాచారన్ని సాత్విక, ఆటో డ్రైవర్ కుటుంబీకులకు తెలియజేసినట్లు పోలీసులు చెప్పారు. కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత సాత్విక మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు పంపనున్నట్లు సమాచారం.

Read More
Next Story