ఏపీలో రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు మృతి
x
పెందుర్తితో లారీ ఢీకొట్టిన వ్యాన్

ఏపీలో రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు మృతి

ఈరోజు ఉదయం ఏపీలో మూడు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అక్కడికక్కడే ఏడుగురు మరణించారు. వీటిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.


ఈరోజు ఉదయం విశాఖ, కృష్ణా జిల్లాలో మూడు వేరువేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిలో ఏడుగురు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలాలకు చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబీకులకు సమాచారం అందించారు. వారు రాగానే పోస్ట్‌మార్టం చేయించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ రోడ్డు ప్రమాదాలను అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ప్రమాదానికి అసలు కారణం వీలైనంత త్వరగా తెలుసుకుంటామని వెల్లడించారు.

పెందుర్తిలో ఘోరం

విశాఖ జిల్లా పెందుర్తి అక్కిరెడ్డి పాలెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా ఏసీ వ్యానన్‌ను అతివేగంగా వచ్చి ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు అక్కడిక్కడమే మరణించారు. మరో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో మరణించిన వారు కొవ్వూరుకు చెందిన వారిగా గుర్తించామని, వారి కుటుంబీకులకు సమాచారం అందజేశామని పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదంలో చింతాడి ఇందు(65), హనుమంతు శేఖర్ రావు (15), ఆనందరావు(45) మరణించినట్లు పోలీసులు తెలిపారు.

లోయలోకి దూసుకెళ్లిన బొలేరో

పాడేరు ఘాట్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన బొలేరో వాహనం.. ఘాట్ రోడ్డు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ఈ బొలేరో లో 30 మంది ప్రయాణిస్తున్నారని, మరణించిన ఇద్దరూ వసల కూలీలేనని పోలీసులు గుర్తించారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలు కాగా కొందరు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు.

కృష్ణా జిల్లాలో లారీని ఢీ కొట్టిన బైక్

కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంకపల్లి దగ్గర ఓ బైకు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వస్తున్న భార్యాభర్తలిద్దరూ మృతి చెందారు. మృతులిద్దరూ చల్లపల్లి మండలం పచ్చర్లంక వాసులుగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.



Read More
Next Story