
పరిశ్రమలకు భూకేటాయింపు ..
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు: అమరావతి రెండో దశ భూసేకరణకు గ్రీన్ సిగ్నల్
రాష్ట్రంలో కూటమి ని ఆశ్వీరదిస్తూ ప్రజలు తీర్పునిచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఏడాది పాలనపై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సమావేశమయిన మంత్రివర్గ సమావేశంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా మంత్రులు ఉన్నతాధికారులు పాల్ఘొన్నారు.ముఖ్యంగా ఏడాది కాలంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ,అభివృద్ది కార్యక్రమాలపై చర్చించారు.రాజధాని అమరావతి అభివృద్దికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను చర్చించిన మంత్రివర్ఘం సీఆర్డీఏ తాజా నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది.ముఖ్యంగా 9 కీలకాంశాలపై మంత్రివర్గంలో చర్చించారు.
మంత్రివర్గ నిర్ణయాలు ఇవే..
- అమరావతిలో రెండో దశ భూసేకరణకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- అమరావతిలో 5వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం
- వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ తీసుకువచ్చిన ఉత్తర్వులకు ఆమోదం
- రక్షిత మంచినీటి సరఫరాకు శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానంలో దాదాపు రూ.5.75 కోట్లు
- కుప్పం నియోజకవర్గంలో రూ. 8.22 కోట్లు వయబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదలకు ఆమోదం
- పలు సంస్థలకు భూకేటాయింపులు, రాయితీల కల్పనపై చర్చించి.. ఆ ప్రతిపాదలనకు ఆమోదం
- పరిశ్రమలకు సంబంధించి 2025 చట్టంలో పలు నింబధనల సవరణలకు గ్రీన్ సిగ్నల్
- ఏపీ షాప్స్ ఆండ్ ఎస్టాబిలిష్ మెంట్ బిల్లు 2025 చట్టంలో నింబధనల సవరణలకు ఆమోదం
- ఈ ఏడాది ఫిబ్రవరి 1 వరకు సత్ప్రవర్తన కలిగిన 17 మంది జీవిత ఖైదీలను విడుదల చేసే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్
- 248 కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు ఆమోదం
- మహిళలు రాత్రిపూట కూడా పనిచేసే చట్ట సవరణకు ఆమోదం,రాత్రిపూట పనిచేసే మహిళలకు భద్రత, రవాణా సౌకర్యం
మంత్రుల పనితీరుపై సీఎం సమీక్ష
శాఖల వారీగా మంత్రుల పనితీరుపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ భేటీలో సమీక్షించారు.కొందరి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.విపక్షం చేస్తున్న విమర్శలను సమర్థంగా తిప్పికొట్టాలని ,మరింత దూకుడుగా వెళ్లాలని మంత్రులకు చంద్రబాబు సూచించారు.ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా మంత్రులు పనిచేయాలని , ప్రజలలో మమేకం కావాలని సీఎం దిశానిర్దేశం చేశారు.వైసీపీ నేతలపై కేసుల విషయం కూడా కొందరు మంత్రులు ప్రస్తావించగా , తప్పుచేసిన వారు ఎవరైనా వదిలేది లేదని , అయితే రాజకీయ కక్ష సాధింపు ఉండదని చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.రాష్టంలో తాజా రాజకీయాలపైనా ముఖ్యమంత్రి మంత్రులతో చర్చించారు. వైసీపీ నేతలు రౌడీ రాజకీయాలు చేస్తున్నారాన్ని ,నేరస్తులను పరామర్శిస్తున్నారని ,అన్నింటిని సమర్థంగా తిప్పికొట్టాలని సీఎం సూచించారు.
అమరావతిపై విస్తృత చర్చ
రాజధాని అమరావతి పనులపై మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అమరావతిలో రెండో దశ భూసేకరణకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.దానితోపాటు అమరావతిలో 5వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్, 2500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ హబ్ నిర్మాణంపై మంత్రివర్ఘంలో చర్చించారు..