ఏపీలో 47 మంది పోలీసు ఉన్నతాధికారుల బదిలీలు..
x

ఏపీలో 47 మంది పోలీసు ఉన్నతాధికారుల బదిలీలు..

ఆంధ్రప్రదేశ్ అధికారుల బదిలీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా దాదాపు 47 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది.


ఆంధ్రప్రదేశ్ అధికారుల బదిలీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా దాదాపు 47 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విషయాన్ని డీజేపీ ద్వారకా తిరుమల రావు ప్రకటించారు. ఈ బదిలీలు అన్నీ కూడా తక్షణమే అమలవుతాయని కూడా తమ అధికారిక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం బదిలీలు జరిగిన స్థానాల్లో ఉన్న అధికారులు వెంటనే తమ పదవుల నుంచి తప్పుకోవాలని, వారికి ప్రత్యామ్నాయాలను సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. అదే విధంగా బదిలీ అయిన అధికారులు కూడా వీలైనంత త్వరగా తమతమ కొత్త పోస్ట్‌లను స్వీకరించాలని పేర్కొన్నారు. అయితే నూతన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే చాలా వరకు పోలీసుల్లో బదిలీల ఆందోళన మొదలైంది. మొన్నమొన్నటి వరకు ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలపై ఫుల్ ఫోకస్ పెట్టిన సర్కార్.. తాజాగా పోలీసు శాఖలోని ఇతర అధికారుల బదిలీలను కూడా చేపట్టింది. ఇందులో భాగంగానే తాజాగా 47 మందిని బదిలీ చేశారు.



Read More
Next Story