ఆంధ్ర ప్రజలకు అలెర్ట్.. జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిక
x

ఆంధ్ర ప్రజలకు అలెర్ట్.. జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిక

ఆంధ్రలో రానున్న రెండు మూడు రోజుల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల సంస్థ ఎండీ కూర్మనాథ్ హెచ్చరించారు.


ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర విపత్తుల సంస్థ అలెర్ట్ ప్రకటించింది. రానున్న మూడు నాలుగు రోజులు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ద్రోణి ప్రభావం వల్లే ఈ వర్షాలు కురిసే అవకాశాలు మరింత పెరగనున్నాయని ఆయన వివరించారు. ఈ ప్రభావం వల్ల పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని వివరించారు. వాతావరణంలో రానున్న మార్పులను బట్టి ప్రజలకు ఎప్పటికప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన వివరించారు.

ఈ జిల్లాల్లోనే వర్షాలు

ద్రోణి ప్రభావం వల్ల సోమవారం.. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు,నంద్యాల,శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య , చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అదే విధంగా ఎల్లుండి అంటే మంగళవారం కూడా.. అల్లూరి సీతారామరాజు, శ్రీసత్యసాయి, వైయస్ఆర్, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.అలాగే పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

అప్రమత్తంగా ఉండాలి

రాష్ట్రంలో ఉరుములతో కూడిన వర్షాలు పడే సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూర్మనాథ్ హెచ్చరించారు. వర్షాలు పడే సమయాల్లో పశు కాపరులు, వ్యవసాయ కూలీలు.. చెట్లు, పోల్స్, టవర్ల కింద నిలబడొద్దని, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని వివరించారు. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

Read More
Next Story