టీడీపీ అభ్యర్థిపై హత్యాయత్నం
x
Source: Twitter

టీడీపీ అభ్యర్థిపై హత్యాయత్నం

టీడీపీ అభ్యర్థి, బొజ్జ రామకృష్ణారెడ్డి తనయుడు సుధీర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ప్రచారం చేస్తున్న సమయంలో మహేష్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు.


శ్రీకాళహస్తిలో టీడీపీ అభ్యర్థి, బొజ్జ రామకృష్ణారెడ్డి కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డిపై ఈరోజు ఉదయం దాడి జరిగింది. శ్రీకాళహస్తి నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తున్న సుధీర్.. పట్టణంలోని 5వ వార్డులో ఇంటింటి ప్రచారం చేయడానికి వెళ్లారు. అప్పుడే ఈ ఘటన జరిగింది. మహేష్ కుమార్ అనే వ్యక్తి సెల్ఫీ తీసుకుంటానని సుధీర్ రెడ్డి దగ్గరకు వచ్చాడు. అందుకు సుధీర్ అంగీకరించడంతో పక్కకు చేరిన వెంటనే కత్తితో దాడికి పాల్పడ్డాడు. దాడి అనంతరం మహేష్ పారిపోవడానికి ప్రయత్నించగా అక్కడే ఉన్న టీడీపీ నేత కాసరం రమేశ్, తదితరులు మహేష్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

దాడి చేసిన మహేష్ కుమార్

కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని, మహేష్‌ను విచారిస్తున్నామ చెప్పారు పోలీసులు. అతడు ఆర్‌టీసీ మెకానిక్‌గా పనిచేస్తున్నట్లు తెలిసిందని, త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. అయితే బొజ్జల సుధీర్‌పై జరిగిన దాడి అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రత్యర్థి పార్టీ నేతలే ఈ పని చేయించారని టీడీపీ కార్యకర్తలు కొందరు ఆరోపిస్తున్నారు.



Read More
Next Story