అమెరికాలో ఆంధ్ర విద్యార్థి మృతి.. అసలేం జరిగిందంటే..!
x

అమెరికాలో ఆంధ్ర విద్యార్థి మృతి.. అసలేం జరిగిందంటే..!

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందారు. పర్యటనకు వెళ్లిన విద్యార్థి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఘటన సోమవారం చోటు చేసుకుంది.


అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందారు. పర్యటనకు వెళ్లిన విద్యార్థి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. అతడి మరణంపై కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. పర్యటిద్దామని వెళ్లిన యువకుడు పరలోకానికి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకున్నారు.

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం చిట్యాలకు చెందిన గద్దే శ్రీనివాస్, శిరీష దంపతులకు ఇద్దరు పిల్లలు. వారి కుమార్తె అమెరికాలో ఉంటుంది. వారి కుమారుడు గద్దే సాయిసూర్య అవినాష్ (26) ఉన్నత చదువుల కోసమని 2023లో అమెరికా వెళ్లాడు. అక్కడే ఇంటి వద్ద ఉంటూ ఎంఎస్ చేస్తున్న అవినాష్.. జూలై 7న తన అక్క కుటుంబీకులతో కలిసి ఆమె స్నేహితురాలి ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి రెండు కుటుంబాల వారు కలిసి దగ్గర్లోని జలపాతాలను చూడటానికి వెళ్లారు. అప్పటి వరకు అంతా బాగానే ఉంది. అక్కడి వెళ్లిన తర్వాత అందరూ జలపాతాల అందాలను చూస్తూ ఉన్నారు. ఆ సమయంలోనే ప్రమాదవశాత్తూ అవినాష్.. వాటర్‌ఫాల్స్‌లో పడిపోయాడు. దాంతో నీట మునిగి మరణించాడని అవినాష్ కుటుంబీకులు వివరించారు. అయితే అవినాష్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని మృతుడి అక్క వెల్లడించారు.

Read More
Next Story