కృష్ణా జిల్లాలో అధికంగా బీపీ, షుగర్ వ్యాధులతో బాధపడుతున్న బాధితులు ఉన్నారు. 18.57 శాతం బీపీతోను, 14.95 శాతం మంది షుగర్తోను బాధలు పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కువుగా వినిపిస్తున్న మాట ‘హబ్’. ఏ రంగం మీద సమీక్షలు జరిగినా, లేదా సమావేశాలు జరిగా ఆ రంగంలో హబ్గా ఆంధ్రప్రదేశ్ను తయారు చేస్తానని సీఎం చంద్రబాబు చెప్పడం పరిపాటిగా మారింది. అయితే ఆయా రంగాల్లో ఆంధ్రప్రదేశ్ను హబ్గా మారుస్తారో లేదో తెలియదు కానీ బీపీ, షుగర్ల విషయంలో మాత్రం హబ్గా ఆంధ్రప్రదేశ్ అవతరించనుందనే ఆందోళనలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న వైద్య పరీక్షలే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇంత వరకు చేపట్టిన స్క్రీనింగ్ టెస్టుల్లో అధిక శాతం మంది బీపీ, షుగర్లతో సతమతమవుతున్నట్లు తేలింది. బీపీ, షుగర్ల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. నాన్ కమ్యూనికేబుల్ రోగాల గుర్తింపు సర్వే–3లో ఈ విషయాలు వెలుగులో వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో 14.73 శాతం మంది బీపీ, 11.78 శాతం మంది షుగర్ వ్యాధులతో బాధపడుతున్నట్లు తేలింది.