‘మేమంతా సిద్ధం’ యాత్రకు విరామం!
x
Source: Twitter

‘మేమంతా సిద్ధం’ యాత్రకు విరామం!

మేమంతా సిద్ధం బస్సు యాత్రకు నేడె విరామం ప్రకటించారు. ఈరోజు నెల్లూరు జిల్లా నేతలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు.


‘మేమంతా సిద్ధం’ పేరిట ప్రారంభించిన బస్సు యాత్రతో వైసీపీ అధినేత, సీఎం జగన్ జోరుగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. దాదాపు ప్రతి నియోజకవర్గంలో సభను నిర్వహిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. అయితే ఈరోజు యాత్రకు విరామం ఇస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. దీంతో ఈరోజు సీఎం జగన్.. నెల్లూరు చింతారెడ్డి పాలెం దగ్గర క్యాంప్‌లో బస చేయనున్నారు. అక్కడే పార్టీ ముఖ్యనేతలతో ఆయన ఈరోజు సమావేశం అవుతారు. అందులో నెల్లూరు నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో జిల్లాలో వైసీసీ జోరు ఎలా ఉంది, అందరికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అన్న అంశాలను చర్చించడంతో పాటు టికెట్ ఆశించి భంగపడిన నేతలతో కూడా చర్చిస్తారని సమాచారం. అంతేకాకుండా జిల్లాలో పార్టీ బలోపేతం కోసం చేయాల్సిన కార్యక్రమాలు, గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు జగన్. ఈ మేరకు సదరు నేతలకు వైసీపీ క్యాంప్ నుంచి పిలుపు కూడా వెళ్లింది. ఈరోజు మధ్యాహ్నం ఈ సమావేశాలు జరగొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం ఈరోజు సాయంత్రం నిర్వహించే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు.



Read More
Next Story