నామినేషన్ దాఖలు చేసిన జగన్
x
Source: Twitter

నామినేషన్ దాఖలు చేసిన జగన్

సీఎం జగన్.. పులివెందులలో తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అవినాష్ రెడ్డి కూడా పాల్గొన్నారు.



ఆంధ్రలో నామినేషన్లు దాఖలు చేయడానికి ఈరోజు ఆఖరు తేదీ. నేడు ఆంధ్ర సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా తన నామినేషన్‌ను దాఖలు చేశారు. భారీ ర్యాలీగా రిటర్నింగ్ అధికారి కార్యాలయం దగ్గరకు చేరుకున్న జగన్.. అధికారిని తన నామినేషన్ పత్రాలను అందించి రాజ్యాంగ బద్దంగా నడుచుకుంటానని ప్రమాణం కూడా చేశారు. బహిరంగ సభలో ప్రసంగించిన జగన్.. నేరుగా సెక్రటరేయట్‌కే చేరుకుని తన నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా పాల్గొన్నారు.


అంతకుముందు నిర్వహించిన ర్యాలీలో ప్రజలంతా ముక్తకంఠంతో జై జగన్ అంటూ నినాదాలు చేశారు. దాంతో పులివెందుల అంతటా కోలాహల వాతావరణం అలుముకుంది. జగన్‌కు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన జగన్.. ప్రతిపక్షాలను తీవ్రంగా విమర్శించారు. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో గెలిచేది వైసీపీనే అని ధీమా వ్యక్తం చేశారు.



Read More
Next Story