కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, స్థానికులతో పెళ్లి మండపం కళకళలాడింది. అందరి సంతోషాల మధ్య పెళ్లి ఘనంగా జరిగింది. ఇక పెళ్లి ఊరేగింపు ప్రారంభమైంది. డీజే పాటలు, మ్యూజిక్తో ఊరేగింపు మొదలైంది. స్నేహితులు, బంధువులు డ్యాన్స్లకు దిగారు. తాను కూడా కాలు కలిపేందుకు ముందుకొచ్చాడు. స్నేహితులతో కలిసి డ్యాన్స్లు చేయడానికి ఉత్సాహం చూపించాడు. ఎంతో హుషారుతో డ్యాన్స్లు వేశాడు. అలా సరదాగా డ్యాస్సులు వేస్తున్న సమయంలో డ్యాన్సులేస్తున్న చోటునే ఒక్క సారిగా కుప్పకూలాడు. ఏమి జరిగిందో అని తేరుకొని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లో లోపే అతను కన్ను మూశాడు.
కేరింతల మధ్య సాగుతున్న పెళ్లి ఊరేగింపులో విషాదం అలుముకుంది. అప్పటి వరకు ఊరేగింపులో హుషారుగా గెంతులేసిన వ్యక్తి లేడనే విషయాన్ని జీర్ణించుకోలేక పోయారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. గుండెలు బాదుకుంటూ తీవ్ర దుఃఖంలో మునిగి పోయారు. అనాధలుగా మారిన చిన్న పిల్లలను చూసి స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు. సంతోషంతో సాగాల్సిన పెళ్లి ఊరేగింపు విషాదంతో ముగిసింది. అత్యంత బాధాకరమైన ఈ సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.
కర్నూలు జిల్లాలో కోసిగి ఆర్టీసి బస్టాండ్ సమీంపంలో వీరేష్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. కర్నూలు జిల్లా ఆదోని మండలం, కుప్పగల్లులో తన కుటుంబ సభ్యులతో కలిసి బంధవుల పెళ్లికి వెళ్లాడు. పెళ్లి అయిన తర్వాత శనివారం రాత్రి పెళ్లి ఊరేగింపు జరిగింది. డీజే పాటలతో ఊరేగింపు సాగింది. అయితే పెళ్లికి వచ్చిన బంధువులు, మిత్రులు ఊరేగింపులో డ్యాన్స్లు చేస్తున్నారు. సరదాగా కేరింతలు కొడుతూ డ్యాన్సులు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇదే క్రమంలో వీరేష్ కూడా డ్యాన్స్ చేయాలని ఉత్సాహ పడ్డాడు. తన స్నేహితులు, బంధువులతో కలిసి డాన్సులు చేయడం ఆరంభించాడు.
అలా హుషారుగా గెంతులు వేస్తున్న సయమంలో డ్యాన్స్ వేస్తున్న చోటునే ఒక్క సారిగా కుప్పకూలిపోయాడు వీరేష్. దీంతో పెళ్లి ఊరేగింపులోని మిత్రులు, బంధువులు ఒక్క సారిగా షాక్కు గురయ్యారు. నేలకొరిగిన వీరేషన్ను మాట్లాడించే ప్రయత్నం చేశారు. కానీ వీరేష్కు మాటలు రాలేదు. వెంటనే ఆ షాక్లో నుంచి తేరుకొని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకునే లోపే వీరేష్ కన్ను మూశాడు. మార్గ మధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. పరీక్షలు చేసిన డాక్టర్లు.. డాన్సులేసేటప్పుడు వీరేష్కు తీవ్ర గుండె పోటు వచ్చిందని, దాంతోనే అతను మరణించాడని నిర్థారించారు.
దీంతో సరదాగా సాగాల్సిన పెళ్లి ఊరేగింపు విషాదంతో ముగిసింది. అప్పటి వరకు అందరితో కలిసి హుషారుగా స్టెప్పులేసిన వీరేష్ అకాల మరణం బంధు మిత్రుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మరణించాడని విషయం తెలుసుకున్న వీరేష్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. వారి దుఃఖాన్ని ఆపడం ఎవరి తరం కాలేదు. గుండెలు బాదుకుంటూ విలపించారు. వీరేష్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతనికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. ఆరోగ్యంగా ఉండే వాడు. అలా ఆరోగ్యంగా ఉన్న వీరేష్ ఒక్క సారిగా గుండెపోటుతో కుప్పకూలి కన్ను మూయడం జీర్ణించుకోలేక పోతున్నారు. అనాధలుగా మారిన భార్య, చిన్నపిల్లలను చూసి స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు.