కోర్టు ధిక్కరణ కేసులో నలుగురు ఐఏఎస్‌లకు ఏపీ హైకోర్టు బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది.


ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నలుగురు ఐఏఎస్‌ల తీరుపై సీరియస్‌ అయ్యింది. తాము జారీ చేసిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కరణ కేసు కింద ఆ నలుగురు ఐఏఎస్‌ల అధికారులకు బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. గతంలో జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి పని చేసిన శశిభూషణ్‌ కుమార్‌కు, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేసిన ఎస్‌ఎస్‌ రావత్‌కు, కాకినాడ జిల్లా కలెక్టర్‌గా పని చేసిన కృతికా శుక్లా, కోనసీమ జిల్లా కలెక్టర్‌గా ఉన్న హిమాన్షు శుక్లాలకు గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించ లేదు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి జస్టిస్‌ వెంకటేశ్వర్లు నేతృత్వంలోని సింగిల్‌ కోర్టు బెంచ్‌ ఆ నలుగురికి బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్‌ 27వ తేదీకి వాయిదా వేసింది. గత ప్రభుత్వంలో అనేక మంది ఐఏఎస్ అధికారులపై ఇలాంటి నోటీసులను హైకోర్టు జారీ చేసింది.

Next Story