ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు మెరుపు దాడులు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్లో భారీ స్థాయిలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కస్టమ్స్ అధికారులు ఇటీవల చేపట్టిన మెరుపు దాడుల్లో భారీగానే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, తాడిపత్రి రైల్వే స్టేషన్, నెల్లూరు రైల్వే స్టేషన్, బొల్లపల్లి టోల్ ప్లాజా వంటి పలు ప్రాంతాలో కస్టమ్స్ అధికారులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. అందులో భాగంగా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న దాదాపు 17.9 కేజీలో బంగారాన్ని ఈ తనిఖీలలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులకు పట్టబడిన బంగారం విలువ మార్కెట్లో సుమారు రూ. 14.37 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేరళ, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాల నుంచి ఈ బంగారాన్ని నిందితులు అక్రమంగా తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. బంగారం అక్రమ తరలింపులకు పాల్పడుతున్న 16 మంది నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీటిపైన శనివారం విచారణ చేపట్టిన విశాఖలోని న్యాయస్థానం 14 రోజుల పాటు నిందితులకు రిమాండ్ విధించింది.