
Jagan vs CBN | పులివెందులపై టీడీపీ జెండా
టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే.. ఆమె భర్త బీటెక్ రవి రియాక్షన్
పులివెందుల అంటే వైఎస్ఆర్ కుటుంబానికి పెట్టనికోటగా నిలిచింది. 1972 నుంచి దివంగత సీఎం వైఎస్ఆర్, ఆయన కుటుంబీకులదే రాజకీయ ఆధిపత్యం.
జెడ్పీటీసీ ఉన ఎన్నికల నేపథ్యంలో అధికార టీడీపీ పులివెందులలో పాగా వేయడానికి సర్వశక్తులు ఒడ్డింది. ఇక్కడి నుంచి మాజీ ఎంఎల్సీ బీ.టెక్ రవి భార్య మారెడ్డి లతారెడ్డి 6,716 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి లతారెడ్డి ధృవపత్రం అందుకున్నారు.
2021 లో జరిగిన పులివెందుల జెడ్పీటీసీ సభ్యుడిగా మహేశ్వరరెడ్డి ఏకగ్రీవంగా గెలిచాడు. అనారోగ్యంతో ఆయన మరణించారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన కొడుకు హేమంతరెడ్డికి వైసీపీ నుంచి పోటీ చేయించారు.
ఈ నెల 12 వ తేదీ ఉపఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ పోటీలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రారెడ్డి (బీటెక్) రవి భార్య మారెడ్డి లతారెడ్డి విజయం సాధించారు.
ఈ ఫలితంపై బీటెక్ రవి స్పందించారు.
"పులివెందుల"లో వైఎస్ఆర్ కుటుంబ ఏకపక్ష ధోరణికి ప్రజలు ఈ విధంగా బుద్ధి చెప్పారు" అని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీ.టెక్ రవి కొద్దిసేపటి కిందట కడపలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
"పులివెందులలో దాదాపు 40 సంవత్సరాలుగా వైఎస్ కుటుంబం ఎన్నికలు జరగనివ్వకుండా, ఏకగ్రీవాలతో పెత్తనం సాగించింది. ఈ పద్ధతికి చెక్ పెట్టాం" అని బీ.టెక్ రవి అన్నారు. మాజీ సీఎం వైఎస్. జగన్ తీరుతో విసిగిపోయిన వైసీపీ నేతలు బయటికి వచ్చారని బీటెక్ రవి తెలిపారు. తన పక్కనే వారిలో కొందరిని చూపిస్తూ, వీరంతా వైసీపీ నుంచి వచ్చిన వారే అని చెప్పారు.
"కడప ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డి, ఈయన అన్ఎన మ్మెల్యే వైఎస్. జగన్ ఇంకా ఆకాశంలో ఉన్నారు. వారి తీరుతో ప్రజలు విసిగిపోయారు" అని బీటెక్ రవి వ్యాఖ్యానించారు. ఈ ఉత్సాహంతోనే ప్రజలకు మరింత చేరువ కావడం ద్వారా పులివెందులలో మళ్లీ పట్టు సాధించే కసరత్తు ఉంటుందని ఆయన వివరించారు.
పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పోలైన ఓట్లు
మొత్తం ఓట్లు 10,601
పోలైనవి 7,800
టీడీపీ అభ్యర్థి లతా రెడ్డికి దక్కింన ఓట్లు 6,716
వైసీపీ అభ్యర్థి తురకా హేమంతరెడ్డికి 683 ఓట్లు దక్కాయి.
టీడీపీ మెజారిటీ 6,033 ఓట్లు