Road Terror | కర్నూలు: బస్సు ఢీాకొని నలుగురి మృతి
x

Road Terror | కర్నూలు: బస్సు ఢీాకొని నలుగురి మృతి

ఆదోని వద్ద ఈ ర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.


ద్విచక్ర వాహనాలపై వెళుతున్న వారిని ఆర్టీసీ అధిగమించేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. అదే సమయంలో కర్ణాటక బస్సు స్టీరిండ్ రాడ్ ఊడిపోయినట్లు తెలిసింది. దీంతో అదుపుతప్పిన బస్సు రెండు బైక్ లపై వెళుతున్న వారిపై దూసుకుపోయింది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికి అక్కడే మరణించారు. వారిలో ఉ గర్భణి కూడా ఉన్నారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స తీసుకుంటూ మరణించారని సమాచారం. ఘటనా స్థలాన్ని ఆదోని డీఎస్పీ హేమలత పరిశీలించారు.


కర్నూలు జిల్లా ఆదోని మండలం జాలిమంచి గ్రామం వద్ద మంగళవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది. ప్రాథమిక సమచారం మేరకు ఆ వివరాలివి,

కర్ణాటక రాష్ట్రం గంగావతి నుంచి ఆదోని మీదుగా రాయచూరు ( Raichur )కు KA 37F 0711 నంబర్ కేఎస్ఆర్టీసీ బస్సు బయలుదేరింది. ఆ బస్సు జాలిమంచి గ్రామం వద్ద ప్రయాణిస్తుండగా ఎదురుగా రెండు ద్విచక్ర వాహనాల్లో నలుగురు వెళుతున్నారు. వారిని ఓవర్ టేక్ చేయడానికి బస్సు డ్రైవర్ ప్రయత్నించినట్లు ప్రత్యక్ష్యసాక్షుల కథనం.
ఆ సమయంలో బస్సు స్టీరింగ్ రాడ్ ఊడడం వల్ల అదుపుతప్పి, బైక్ పై ప్రయాణిస్తున్న వారిపైకి దూసుకుని వెళ్లినట్లు చెబుతున్నారు. దీంతో రెండు ద్విచక్రవాహనాల్లో ప్రయాణిస్తున్న నలుగురు బస్సు టైర్ల కింద నలిగిపోయి, ప్రాణాలు వదిలారు. ఈ ప్రమాదంలో మాన్వి గ్రామానికి చెందిన హోంగార్డు పరిస్థితి విషమంగా ఉండడం వల్ల ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు అతనిని ఆదోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ( Adoni Government General Hospital) కి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలినట్లు సమాచారం.
బస్సు ఢీకొనడంతో మరణించిన నలుగురిని పోలీసులు గుర్తించారు. మృతులు కొప్పల్ గ్రామానికి చెందిన దంపతులు ఈరన్న, ఆదిలక్ష్మిగా గుర్తించారు. ఈమె నిండిగర్భిణి అని సమాచారం. ఈ ప్రమాదంలోనే మాన్వి గ్రామానికి చెందిన హేమాద్రి భార్య నాగరత్నమ్మ, కుమారుడు దేవరాజుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై ఆదోని సమీపంలోని పెద్దతుంబళం పోలీసులు కేసు చేశారు.
Read More
Next Story